EGG price: కోడిగుడ్డు ధర పైపైకి
జిల్లాలో కోడిగుడ్డు ధర రోజురోజుకూ పెరుగుతోంది. మాంసాహారం తర్వాత ఎక్కువగా తినే గుడ్డును కొనేందుకు వెళ్తే అకస్మాత్తుగా పెరిగిన ధరలే కనిపిస్తున్నాయి.
రూ.7కి చేరిన వైనం
సూర్యాపేట: రైతు బజారులోని దుకాణంలో విక్రయానికి ఉంచిన కోడిగుడ్లు
భానుపురి, న్యూస్టుడే: జిల్లాలో కోడిగుడ్డు ధర రోజురోజుకూ పెరుగుతోంది. మాంసాహారం తర్వాత ఎక్కువగా తినే గుడ్డును కొనేందుకు వెళ్తే అకస్మాత్తుగా పెరిగిన ధరలే కనిపిస్తున్నాయి. గతంలో డజన్ కోడిగుడ్లు రూ.66కు రాగా నేడు రూ.84కు చేరింది. అంటే ఒక్క గడ్డు ధర రూ.7 పలుకుతోంది. వారంలోనే డజన్ రూ.18 పెరగడంపై వినియోగదారులు అసహనం వ్యక్తంచేస్తున్నారు.
పెరుగుదలకు కారణం..
ఇటీవల కోళ్ల దాణా ధరలు పెరిగాయి. గతంలో కిలో రూ.15 నుంచి రూ.17 వరకు ఉండేది. ప్రస్తుతం ఒక్కసారి రూ.28కి పెరిగింది. కోళ్ల దాణా ఖర్చులు పెరగడంతో గుడ్డు ధరలు పెంచాల్సి వచ్చిందని కోళ్ల ఫారాల నిర్వాహకులు తెలిపారు. గతంలో గుడ్డుకు రూ.5.25 ధర పలికితే తమకు గిట్టుబాటు అయ్యేదని, దాణా ధరలు పెరగటం, డిమాండ్కు తగ్గట్లు గుడ్ల ఉత్పత్తి కాకపోవటంతో కొరత ఏర్పడింది. దీంతో కోడిగుడ్లకు ధర పెంచక తప్పటంలేదని చెబుతున్నారు.
భారమవుతున్న రవాణా
యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో పౌల్ట్రీ ఫాంలు పదుల సంఖ్యలో ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి కోడిగుడ్లను దిగుమతి చేసుకుంటున్నారు. జిల్లా వ్యాపారులు రంగారెడ్డి, షాద్నగర్, మహబూబ్నగర్, మహారాష్ట్ర నుంచి గుడ్లను తీసుకొస్తున్నారు. అక్కడ ఒక గుడ్డు రూ.5.30 పైసలు పడుతోంది. రవాణా ఖర్చులు పెరగడంతో రూ.7కు విక్రయిస్తున్నారు. జిల్లాలో రోజుకు 15 నుంచి 20 లక్షల కోడిగుడ్ల విక్రయాలు సాగుతుంటాయని, ఇలాగే కొరత సాగితే ఇంకా ధర పెరిగే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరికో పట్టం..!
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసి అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం అయింది.గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. బూత్లు, గ్రామాల వారీగా ఓట్ల లెక్కలతో కుస్తీ పడుతున్నారు. -
ప్రవేశాల సమయం.. సన్నద్ధతతో విజయం
[ 15-05-2024]
ఇంటర్మీడియట్లో 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు తొలి విడత ప్రక్రియ మొదలైంది. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ప్రారంభించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
చైతన్యకొండ..!
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు స్థానాల్లోనూ భారీగా పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల్లో తుది గణాంకాలను మంగళవారం వెల్లడించింది. -
ఆమె ఇంట్లోనే ఉండిపోయింది..!
[ 15-05-2024]
ఉమ్మడి జిల్లాలో సోమవారం జరిగిన లోక్సభ ఎన్నికల్లో మహిళలు ఓటింగ్కు అంతగా ఆసక్తి చూపలేదు. జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో ఓటర్ల పరంగా మహిళలే ముందంజలో ఉన్నప్పటికీ పోలింగ్ -
ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ముగియడంతో ఈవీఎంలు స్ట్రాంగ్రూంలకు తరలించారు. నల్గొండ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట, నల్గొండ అసెంబ్లీ -
ఆయువు తీస్తున్న పిడుగు
[ 15-05-2024]
నిన్నా మొన్నటి వరకు ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా నమోదయ్యాయి. ఎండల తీవ్రతతో ప్రజలు బెంబేలెత్తారు. ఇటీవల వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. -
అటకెక్కిన చలువ పైకప్పు
[ 15-05-2024]
భానుడు తన ప్రతాపాన్ని చూపుతూనే ఉన్నాడు. మేఘాలు కమ్ముకొన్నప్పుడు మినహా ఈ నెలలో ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే జిల్లాలో 40పైగా డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతోంది. -
మళ్లీ అగ్రస్థానమే..!
[ 15-05-2024]
భువనగిరి లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఓటుకు జైకొట్టారు. ఎన్నికేదైనా మరోసారి రాష్ట్రంలో అగ్రస్థానాన్ని నిలుపుకొని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు ఉండగా.. అత్యధికంగా ఇక్కడే 76.78శాతం నమోదు కావడం విశేషం. -
బాలికల విద్యకు భరోసా.. కస్తూర్బా
[ 15-05-2024]
ప్రస్తుత కాలంలో కార్పొరేటు స్థాయి పాఠశాల, కళాశాల విద్యనభ్యసించాలంటే దూర ప్రాంతాలకు వెళ్లి రూ.లక్షలు పెట్టాల్సిందే. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు తమ పిల్లల చదువు కోసం అన్ని రూపాయలు ఖర్చు పెట్టాలంటే సాధ్యం కానీ విషయమే. -
ఎన్నికలు తెచ్చిన లాభాలు!
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆర్టీసీ లాభాల పంట పండింది. ఎన్నికలకు ప్రత్యేకంగా ఉమ్మడి జిల్లా నుంచి 290 బస్సులను అద్దె ప్రాతిపదికన పంపగా.. సుమారు రూ.1.50 కోట్ల ఆదాయం రాగా.. -
పల్లెవించె.. పట్టణం నీరసించె
[ 15-05-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణంలోనే ఓటర్లు ఎక్కువ చైతన్యం చూపారు. దేవరకొండ లాంటి మారుమూల ప్రాంతాల్లో మాత్రం పోలింగ్ శాతం తక్కువగా నమోదైనా 2019 ఎన్నికలతో పోలిస్తే పెరిగింది. -
రద్దీ తగ్గింది
[ 15-05-2024]
జాతీయ రహదారిపై వాహనాల రద్దీ తగ్గింది. వచ్చిన వాహనాలు వచ్చినట్టుగా టోల్ప్లాజాను దాటి హైదరాబాద్ వైపు వస్తున్నాయి. మంగళవారం ఒక్కరోజే విజయవాడ వైపు నుంచి హైదరాబాద్కు పంతంగి టోల్గేట్లోంచి 30వేల వాహనాలు వచినట్లు లెక్క తేలింది. -
బోర్లు, బావులవైపే ఆసక్తి
[ 15-05-2024]
సాగర్ ఆయకట్టులో ఈసారి వానాకాలంలో సైతం బావులు, బోర్లు నీటి వనరులుగా మారే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఎల్నినో ప్రభావం జులై వరకు ఉంటుందని వాతావరణ శాఖ చెబుతుండటంతో ఆగస్టులో వర్షాలు పడతాయనే నమ్మకం కలుగుతోంది. -
వరస చోరీలతో కర్షకుల కంటతడి
[ 15-05-2024]
ప్రకృతి వైపరీత్యాలతో తల్లడిల్లుతున్న కర్షకులకు నియంత్రికలు, వ్యవసాయ మోటార్లలో రాగితీగను అపహరించే దొంగల ముఠాలు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. -
ట్రావెల్ బస్సు ఢీకొని కార్మికుడి మృతి
[ 15-05-2024]
తుప్రాన్పేట శివారులో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందినట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు..
-
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఊర్వశి హొయలు.. సక్సెస్ జోష్లో అదితి
-
తెలంగాణలో వర్సిటీల ఉపకులపతుల నియామకానికి ఈసీ అనుమతి
-
మ్యూచువల్ ఫండ్ మదుపర్లకు గుడ్న్యూస్.. కేవైసీ నిబంధనల్లో సడలింపు
-
మళ్లీ కలిసిన కేఎల్ - సంజీవ్ గోయెంకా.. అభిమానికి గంభీర్ స్వీట్ రిప్లయ్!
-
ఆర్సీబీ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లుతాడా? చెన్నైతో మ్యాచ్కు వర్షం ముప్పు