నిత్య కల్యాణం.. క్షేత్ర పాలకుడికి ఆరాధన
యాదాద్రి మహాదివ్య పుణ్యక్షేత్రంలో మంగళవారం నిత్య కల్యాణోత్సవం, క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని కొలుస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున సుప్రభాతంతో మొదలైన కైంకర్యాలు రాత్రి నిర్వహించిన శయనోత్సవంతో ముగిశాయి.
యాదగిరిగుట్ట అర్బన్, న్యూస్టుడే: యాదాద్రి మహాదివ్య పుణ్యక్షేత్రంలో మంగళవారం నిత్య కల్యాణోత్సవం, క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని కొలుస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున సుప్రభాతంతో మొదలైన కైంకర్యాలు రాత్రి నిర్వహించిన శయనోత్సవంతో ముగిశాయి. వేకువజామున సుప్రభాతం చేపట్టాక మూలవరులకు నిజాభిషేకం, తులసీ పత్రాలతో అర్చన జరిపారు. ప్రధాన ఆలయంలో క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి మందిరంలో ప్రత్యేక పత్రపూజ చేపట్టారు. మహాముఖ మండపంలో అష్టోత్తరం, నిత్య కల్యాణం జరిపారు. గజ వాహనంపై ఉత్సవమూర్తులను అధిష్ఠింపజేసి మాడ వీధుల్లో ఊరేగించారు. సాయంత్రం అలంకార జోడు సేవోత్సవాన్ని ఆలయ ఆచారంగా నిర్వహించారు. రాత్రి స్వయంభువులను కొలుస్తూ ఆరాధన, సహస్రనామార్చన జరిపారు. విష్ణు పుష్కరిణి వద్ద ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ ఆర్జిత పత్రపూజ చేశారు. వివిధ విభాగాల ద్వారా రూ.19,69,278 నిత్యాదాయం సమకూరినట్లు ఈవో భాస్కర్రావు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు