నాడు-నేడు మారని తీరు!
ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మనబడి ‘నాడు-నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
నెలాఖరుతో పూర్తికానున్న గడువు
ఇప్పటికి జరిగిన పనులు 25 శాతం లోపే..
శిథిలావస్థ భవనాల్లో చిన్నారుల చదువులు
న్యూస్టుడే, నెల్లూరు (విద్య)
ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మనబడి ‘నాడు-నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగానే రెండో విడతలో 1,357 పాఠశాలల అభివృద్ధికి రూ.453.91 కోట్లు కేటాయించింది. నెలాఖరుకు పనులు పూర్తి కావాల్సి ఉండగా.. ఇప్పటికి జరిగింది 25 శాతంలోపు కావడం గమనార్హం.
‘నాడు-నేడు’ రెండో విడత పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు జరిగే పాఠశాలల్లో ప్రత్యామ్నాయంగా తరగతులు నిర్వహించే ఏర్పాట్లు చేయకపోవడంతో శిథిల భవనాలు, వరండాలు, చెట్ల నీడలోనే చిన్నారులకు ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పనుల్లో జాప్యం నెలకొందని విద్యాశాఖాధికారులు చెబుతుండగా.. రాష్ట్ర కార్యాలయం నుంచి రావాల్సిన వస్తువులు, నిధులు రాలేదని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. నిర్మాణాలు నెమ్మదిగా సాగుతుండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి పూర్తి చేయాల్సిన అధికారులు.. పనులను ఆలస్యంగా మొదలు పెట్టారు. ఫలితంగా పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఇసుక, ఇటుకలు, నిర్మాణ సామగ్రి విద్యార్థులకు అడ్డంగా మారింది. వీటి కారణంగా పిల్లలు ప్రమాదాలకు గురవుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.
రెండో విడతలో ఎంపికైన పాఠశాలలు1357
మరుగుదొడ్ల నిర్మాణాలు : 1080 పాఠశాలల్లో
మంజూరైన నిధులురూ.453.91కోట్లు
అదనపు తరగతి గదులు 552 పాఠశాలల్లో 2001 గదులు
నాణ్యతా ప్రమాణాలు పాటించకుంటే చర్యలు
జిల్లాలో జరుగుతున్న రెండో విడత ‘నాడు- నేడు’ పనుల వేగవంతానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకుంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా పనులు త్వరితగతిన పూర్తిచేయిస్తాం.
సీహెచ్ ఉషారాణి, ఎస్ఎస్ఏ ఏపీసీ
ఎన్నాళ్లకో పూర్తి?
నగరంలోని మూలాపేట మున్సిపల్ ఉన్నత పాఠశాలలో (రామయ్య బడి) ఆరు నుంచి పదో తరగతి వరకు 195 మంది విద్యార్థులు ఉన్నారు. దీనిలో విలీనమైన పాఠశాల 3, 4, 5 తరగతి విద్యార్థులు మరో 150 మంది చేరారు. గదుల కొరత కారణంగా పాఠశాలకు ఏడు అదనపు తరగతి గదులు మంజూరయ్యాయి. ఒక్కో నిర్మాణానికి రూ.13 లక్షలు చొప్పున రూ.91 లక్షలు వచ్చాయి. మొదట రూ.16 లక్షలు ఆ పాఠశాల సీఎఫ్ఎంఎస్ ఖాతాలో పడ్డాయి. అయినా నేటికీ పునాది దశలోనే ఉన్నాయి. మరో గత్యంతరం లేక పాఠశాలలోని శిథిలావస్థ భవనం, వరండాల్లో చిన్నారుల చదువులు సాగుతున్నాయి.
అలా సా..గుతూ..
నగరంలోని దర్గామిట్ట బాలికల ఉన్నత పాఠశాలలో రెండో విడత రూ.95.91 లక్షలతో 8 అదనపు తరగతి గదులు, ఫర్నీచర్, విద్యుత్తు, ఫ్యాన్లు, గ్రీన్బోర్డులు, తదితర తొమ్మిది రకాల పనులు చేపట్టాల్సి ఉంది. వీటికి ఇప్పటి వరకు రూ.24 లక్షలు మంజూరైనా 30 శాతం నిర్మాణాలు జరగలేదు. జరిగిన పనులు కూడా నాసిరకంగా జరుగుతున్నాయని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ప్చ్.. ఈసారీ లేదు
నగరంలోని మూలాపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 380 మంది విద్యార్థులు చదువుతున్నారు. స్థానిక ప్రాథమిక పాఠశాల్లోని విద్యార్థులు 150 మంది ఇక్కడ విలీనమయ్యారు. గదుల్లేకపోవడంతో శిథిలావస్థ భవనాలు, రేకుల షెడ్డులో తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలకు నాడు-నేడు మొదటి, రెండో విడతలో అదనపు తరగతి గదులు మంజూరు కాలేదు. భవనాల మరమ్మతులు, తాగునీరు, మరుగుదొడ్లకు రెండో విడతలో నిధులొచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
[ 27-04-2024]
వైద్యసేవలు ప్రతి ఇంటికి అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం.. హెల్త్ క్లినిక్ సెంటర్లను ఏర్పాటు చేసింది. వైద్యసేవలను అందించేందుకు ఎంఎల్హెచ్పీలు సిబ్బందిని నియమించారు. -
ఉన్నత విద్య.. జగన్ మిథ్య
[ 27-04-2024]
విశ్వవిద్యాలయాలు ప్రగతిపథంలో నడవాలన్నా.. విద్యార్థులు చేరేందుకు పోటీపడాలన్నా.. పేరున్న విదేశీ విశ్వవిద్యాలయాలు అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు ముందుకు రావాలన్నా.. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
[ 27-04-2024]
జిల్లాలో సాధారణ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ముగిసింది. శుక్రవారం నెల్లూరు పార్లమెంటు, ఎనిమిది నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు. -
నేడు తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన
[ 27-04-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.25కు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు. -
ఓటుతో.. వైకాపాను తరిమికొడదాం
[ 27-04-2024]
‘ఎన్నికల్లో ఓటు వేయడం ద్వారా వైకాపా అరాచక పాలనకు చరమగీతం పాడాలి. ప్రజల సంక్షేమం.. అభివృద్ధే లక్ష్యంగా పనిచేసే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిగా కాదు.. -
అధికారమే అండ.. ఆక్రమణలే అజెండా!
[ 27-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక సాగునీటి వనరులకు రక్షణ లేకుండా పోయింది. ఖాళీగా కనిపిస్తే చాలు.. అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. సాగునీటి కాలువలనే ఆలోచన లేకుండా కబ్జా చేస్తున్నారు. -
నిమ్మధరలు ఆశాజనకం
[ 27-04-2024]
పొదలకూరు నిమ్మ మార్కెట్లో శుక్రవారం 80 కిలోల నిమ్మకాయల బస్తా రూ.9500 పలికింది. రెండు రోజుల నుంచి నిమ్మ ధరల్లో అనూహ్యమైన మార్పు వచ్చింది. -
ఎన్నికల్లో అక్రమాలపై కఠినంగా వ్యవహరించండి
[ 27-04-2024]
ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని జిల్లా పోలీసు పరిశీలకులు అశోక్ టి దుధే పోలీసు అధికారులకు సూచించారు. -
జగనన్నా.. గొంతెండుతోందయ్యా!
[ 27-04-2024]
ఎండలు మండిపోతున్నాయి. నీటి వనరులు వట్టిపోతున్నాయి. దాహం తీర్చుకోవడానికి చుక్క నీరు దొరకడం లేదు. గొంతులు తడారిపోతున్నాయి. -
పట్టణాభివృద్ధిలో వైశ్యుల పాత్ర కీలకం: తెదేపా
[ 27-04-2024]
పట్టణ అభివృద్ధిలో ఆర్యవైశ్యుల పాత్ర కీలకమైందని తెదేపా అభ్యర్థి దగుమాటి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని 30వ వార్డులో తెదేపా ఎన్నికల కార్యాలయాన్ని ఆర్యవైశ్య నాయకులు గాదంశెట్టి వేణుగోపాల్ నేతృత్వంలో ప్రారంభించారు. -
బాలయ్యా.. మా గుండెల్లో నీవేనయ్యా!
[ 27-04-2024]
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం కావలి, గుడ్లూరులో పర్యటించారు. -
జగన్ సర్కార్ ఉత్తుత్తి సాయం
[ 27-04-2024]
మహిళలను ఆర్థికంగా లక్షాధికారులు చేయాలనే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం రుణాలు అందజేస్తామనీ, వృత్తి శిక్షణ కార్యక్రమాలు చేపడతామనే ఆశయం గాడి తప్పింది. -
వైకాపా పాలనలో కూలేందుకు సిద్ధం
[ 27-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో గ్రామీణ ప్రాంత ప్రజలకు అవస్థలు తప్పడం లేదు... పలు గ్రామాల్లో వంతెనలు శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి...