ఆదిలోనే తిరకాసు
నెల్లూరులో దేవస్థానానికి చెందిన సుమారు తొమ్మిది ఎకరాల వాణిజ్య స్థలాలను 11 ఏళ్లకు లీజుకు కేటాయించేందుకు బహిరంగ వేలం పాటలు ప్రారంభించారు.
నెల్లూరు(సాంస్కృతికం), న్యూస్టుడే
టెండర్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తున్న దేవస్థానం ఈవో వెంకటేశ్వర్లు, ఆర్జేసీ సాగర్బాబు, ధర్మకర్తలు తదితరులు
నెల్లూరులో దేవస్థానానికి చెందిన సుమారు తొమ్మిది ఎకరాల వాణిజ్య స్థలాలను 11 ఏళ్లకు లీజుకు కేటాయించేందుకు బహిరంగ వేలం పాటలు ప్రారంభించారు. నిర్ణయించిన మేరకు ధరావతు, ఈఎండీ మొత్తాలను చెల్లించిన వారిని పాల్గొనేందుకు అనుమతించాల్సి ఉండగా- దేవాదాయశాఖ తిరుపతి రీజియన్ (7 జిల్లాల పరిధి) జాయింట్ కమిషనర్ సాగర్బాబు సమక్షంలో జరిగిన ప్రక్రియలో ఆ మొత్తాలను చెల్లించకుండానే ప్రథమ ధరావతు చెల్లించిన వారిని అనుమతించారు. దానిపై ధర్మకర్తల మండలి మాజీ సభ్యుడు రంగాచారి వెంకటేష్ అభ్యంతరం వ్యక్తం చేయగా.. అప్పటికప్పుడు చెల్లిస్తారని బ్యాంకు అధికారులను పిలిపించారు. వారు నగదు చెల్లించేందుకు సిద్ధంగా లేకపోవడంతో పాటలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. టెండర్ల ప్రక్రియ నిర్వహణ ద్వారా ఆదాయం సమకూరకపోగా.. రూ. లక్ష ఖర్చు చేయడం విశేషం.
ఏటా రూ. కోటి నష్టం
బహిరంగ వేలం పాటల్లో పాల్గొనేందుకు ప్రతి బిట్కు వేర్వేరుగా ధరావతు, ఈఎండీలను చెల్లించాలని నిబంధనల్లో పేర్కొన్నారు. హక్కు పొందిన వెంటనే ఏడాది కాలానికి చెల్లించాల్సిన ఫీజు మొత్తాన్ని 24 గంటల్లో చెల్లించాలి. 30 రోజుల్లో స్థలం మార్కెట్ విలువలో 10 శాతం నగదు కానీ, 25 శాతం బ్యాంకు గ్యారెంటీగా దేవస్థానానికి సమర్పించాల్సి ఉంటుంది. వేలానికి మూడు బిట్లు ప్రకటించినా.. ఒక్కోటి మూడు ఎకరాలకుపైగా ఉండటంతో రెండుగా చేసి నాలుగింటికి నిర్వహించారు. నిబంధనల మేరకు భూములకు ప్రభుత్వం నిర్ణయించిన రూ. 30 కోట్ల మార్కెట్ విలువ మేరకు నాలుగు బిట్లకు ధరావతుగా ధరావతుగా రూ.4 లక్షలు, ఈఎండీగా మరో రూ.83 లక్షలు, సెక్యూరిటీ ధరావతుగా రూ. 3కోట్లు చెల్లించాలి. పెద్దమొత్తంలో నగదు చెల్లించి.. లీజు హక్కులు పొందే సంస్థలు, వ్యాపారులు.. టెండర్లలో పాల్గొనేలా దేవాదాయశాఖ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంది. కానీ, ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. వేలం నిర్వహించి.. దేవస్థానం భూములను లీజుకు కేటాయిస్తే.. తక్షణం సుమారు రూ.అయిదు కోట్లు డిపాజిట్ రూపంలో నగదు సమకూరే అవకాశం ఉంది. దానిపై లీజుదారులకు వడ్డీ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక్కో స్థలానికి నెలకు రూ.లక్ష లీజుకు కేటాయించినా.. నాలుగింటికి ఏడాదికి రూ.48 లక్షల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. సెక్యూరిటీ డిపాజిట్పై వడ్డీతో పాటు లీజు రూపంలో ఆదాయం కలిపి ఏటా రూ. కోటి వరకు వచ్చే అవకాశం ఉన్నా.. లోపాయికారీ వ్యవహారంతో నష్టం జరిగే పరిస్థితి ఏర్పడిందన్న ఆరోపణలు నెలకొన్నాయి. ఈఎండీలు సైతం చెల్లించని వారిని వేలానికి అనుమతించి.. అయిన వారికి దేవస్థానం భూములు కట్టబెట్టాలనే ప్రయత్నం చివరికి బెడిసికొట్టిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
* ఈవో డి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. త్వరలోనే టెండర్లు తిరిగి నిర్వహించేందుకు చర్యలు చేపడతామన్నారు. నిర్వహణలో లోపాలు లేకుండా చూడాలనే ఈ రోజు రద్దుచేశామని.. బ్రహ్మోత్సవాల కారణంగా దీనిపై సరైన దృష్టి పెట్టకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
ప్రక్రియ ప్రారంభమిలా...
ఈ నెల 10వ తేదీ పత్రికా ప్రకటనలో దేవస్థానానికి చెందిన మూడు ఖాళీ స్థలాలను 11 ఏళ్ల లీజుకు కేటాయించేందుకు ఈ-టెండర్, సీల్డ్ టెండర్లను, 24 బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ మూడు ప్రక్రియల్లో అధిక మొత్తంలో చెల్లించేందుకు ముందుకొచ్చిన వారికి లీజు హక్కులు కేటాయించాల్సి ఉంది. ప్రకటనలో పేర్కొన్న విధంగా.. 15 రోజుల గడువు ఇచ్చి, ఆన్లైన్లో వివరాలను ఆలస్యంగా పొందుపరిచారు. దేవస్థానంలో సీల్డ్ టెండర్లు దాఖలు చేసే వారికి అవసరమైన సమాచారం అందుబాటులో ఉంచలేకపోయారు. ఈ విషయాన్ని మార్చి 15న ‘రంగనాథా ఇదేమీ చోద్యం’ శీర్షికన ఇచ్చిన కథనం ద్వారా ‘ఈనాడు’ వెలుగులోకి తెచ్చింది. 24వ తేదీన బహిరంగ వేలం పాటలు నిర్వహించే సమయానికి ఈ-టెండర్లు, సీల్డ్ టెండర్లను ఎవరూ దాఖలు చేయలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
[ 27-04-2024]
వైద్యసేవలు ప్రతి ఇంటికి అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం.. హెల్త్ క్లినిక్ సెంటర్లను ఏర్పాటు చేసింది. వైద్యసేవలను అందించేందుకు ఎంఎల్హెచ్పీలు సిబ్బందిని నియమించారు. -
ఉన్నత విద్య.. జగన్ మిథ్య
[ 27-04-2024]
విశ్వవిద్యాలయాలు ప్రగతిపథంలో నడవాలన్నా.. విద్యార్థులు చేరేందుకు పోటీపడాలన్నా.. పేరున్న విదేశీ విశ్వవిద్యాలయాలు అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు ముందుకు రావాలన్నా.. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
[ 27-04-2024]
జిల్లాలో సాధారణ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ముగిసింది. శుక్రవారం నెల్లూరు పార్లమెంటు, ఎనిమిది నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు. -
నేడు తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన
[ 27-04-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.25కు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు. -
ఓటుతో.. వైకాపాను తరిమికొడదాం
[ 27-04-2024]
‘ఎన్నికల్లో ఓటు వేయడం ద్వారా వైకాపా అరాచక పాలనకు చరమగీతం పాడాలి. ప్రజల సంక్షేమం.. అభివృద్ధే లక్ష్యంగా పనిచేసే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిగా కాదు.. -
అధికారమే అండ.. ఆక్రమణలే అజెండా!
[ 27-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక సాగునీటి వనరులకు రక్షణ లేకుండా పోయింది. ఖాళీగా కనిపిస్తే చాలు.. అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. సాగునీటి కాలువలనే ఆలోచన లేకుండా కబ్జా చేస్తున్నారు. -
నిమ్మధరలు ఆశాజనకం
[ 27-04-2024]
పొదలకూరు నిమ్మ మార్కెట్లో శుక్రవారం 80 కిలోల నిమ్మకాయల బస్తా రూ.9500 పలికింది. రెండు రోజుల నుంచి నిమ్మ ధరల్లో అనూహ్యమైన మార్పు వచ్చింది. -
ఎన్నికల్లో అక్రమాలపై కఠినంగా వ్యవహరించండి
[ 27-04-2024]
ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని జిల్లా పోలీసు పరిశీలకులు అశోక్ టి దుధే పోలీసు అధికారులకు సూచించారు. -
జగనన్నా.. గొంతెండుతోందయ్యా!
[ 27-04-2024]
ఎండలు మండిపోతున్నాయి. నీటి వనరులు వట్టిపోతున్నాయి. దాహం తీర్చుకోవడానికి చుక్క నీరు దొరకడం లేదు. గొంతులు తడారిపోతున్నాయి. -
పట్టణాభివృద్ధిలో వైశ్యుల పాత్ర కీలకం: తెదేపా
[ 27-04-2024]
పట్టణ అభివృద్ధిలో ఆర్యవైశ్యుల పాత్ర కీలకమైందని తెదేపా అభ్యర్థి దగుమాటి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని 30వ వార్డులో తెదేపా ఎన్నికల కార్యాలయాన్ని ఆర్యవైశ్య నాయకులు గాదంశెట్టి వేణుగోపాల్ నేతృత్వంలో ప్రారంభించారు. -
బాలయ్యా.. మా గుండెల్లో నీవేనయ్యా!
[ 27-04-2024]
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం కావలి, గుడ్లూరులో పర్యటించారు. -
జగన్ సర్కార్ ఉత్తుత్తి సాయం
[ 27-04-2024]
మహిళలను ఆర్థికంగా లక్షాధికారులు చేయాలనే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం రుణాలు అందజేస్తామనీ, వృత్తి శిక్షణ కార్యక్రమాలు చేపడతామనే ఆశయం గాడి తప్పింది. -
వైకాపా పాలనలో కూలేందుకు సిద్ధం
[ 27-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో గ్రామీణ ప్రాంత ప్రజలకు అవస్థలు తప్పడం లేదు... పలు గ్రామాల్లో వంతెనలు శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి...