logo

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం

వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో జిల్లాకు చెందిన ఇద్దరు మృతిచెందారు. వివరాలిలా.. మనుబోలు అడ్డరోడ్డు వద్ద జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు.

Published : 08 May 2024 06:26 IST

మనుబోలు, న్యూస్‌టుడే: వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో జిల్లాకు చెందిన ఇద్దరు మృతిచెందారు. వివరాలిలా.. మనుబోలు అడ్డరోడ్డు వద్ద జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు.  సుమారు 35 ఏళ్ల వయసు గల గుర్తు తెలియని యువకుడు రోడ్డు దాటుతుండగా గూడూరు నుంచి నెల్లూరు వైపు వెళుతున్న లారీ ఢీకొంది. ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుడి చేతిపై షోడో అని పచ్చబొట్టు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం గూడూరు ప్రాంతీయ వైద్యశాలకు తరలించి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

హుకుంపేట, పాడేరు, న్యూస్‌టుడే: బొలెరో వాహనం అదుపు తప్పి ఇంజినీర్‌ దుర్మరణం పాలైన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై సతీష్‌ కథనం ప్రకారం.. కొట్నాపల్లి హైవే బేస్‌ క్యాంపు కార్యాలయం నుంచి హుకుంపేట వైపు వస్తున్న బొలెరో వాహనం తాడిపుట్టు జంక్షన్‌ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో హైవే అథారిటీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్న వలసంగారి పవన్‌ (28) తలకు తీవ్రగాయాలయ్యాయి. ఇతడిని పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందారు. ఇతడిది నెల్లూరు జిల్లా ముత్తుకురు గ్రామం. ఈ ప్రమాదంలో ఆఫీస్‌ బాయ్‌కు గాయాలయ్యాయి. ఎస్సై సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. వాహన డ్రైవర్‌ సాయికృష్ణపై కేసు నమోదు చేశారు. పవన్‌ కుటుంబ సభ్యులకు హైవే అధికారులు సమాచారం అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు