logo

బలమైన రాజకీయశక్తిగా భారాస

రానున్న రోజుల్లో దేశంలో బలమైన రాజకీయ శక్తిగా భారాస నిలుస్తుందని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు.

Published : 24 Mar 2023 06:06 IST

జడ్పీ మాజీ ఛైర్మన్‌ సదానందానికి కండువా వేస్తున్న ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

ఆర్మూర్‌, న్యూస్‌టుడే: రానున్న రోజుల్లో దేశంలో బలమైన రాజకీయ శక్తిగా భారాస నిలుస్తుందని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. మహారాష్ట్రలోని కాందార్‌లోహలో పార్టీ కార్యకర్తల సమీకరణలో భాగంగా పర్యటిస్తూ గురువారం బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌తో కలిసి ఆయన మాట్లాడారు. తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. రైతులను ఆదుకోవడంలో సీఎం కేసీఆర్‌ ఎప్పుడూ ముందుంటారని చెప్పారు. మహారాష్ట్రలో పార్టీని విస్తరిస్తామని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా తిరిగి పార్టీలో చేరిన జిల్లా పరిషత్‌ మాజీ ఛైర్మన్‌ గంటా సదానందానికి ఆయన కండువా వేసి ఆహ్వానించారు. మహారాష్ట్రలో మాజీ ఎమ్మెల్యే శంకరన్న దొండ్గే, డాక్టర్‌ యశ్పాల్‌భింగే, సురేశ్‌ గైక్వాడ్‌ తదితరులు భారాసలో భాగస్వాములు అయ్యారని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని