ఎండలతో ఆలస్యంగా సమావేశాలు
ప్రస్తుతం బయటకు వెళ్లాలంటే ఎండ తక్కువ ఉన్నప్పుడే చూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
న్యూస్టుడే, బోధన్ పట్టణం: ప్రస్తుతం బయటకు వెళ్లాలంటే ఎండ తక్కువ ఉన్నప్పుడే చూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. భగభగ మండుతున్న ఎండలు ఎన్నికల ప్రచార సరళిని నిలువరిస్తున్నాయనే చెప్పాలి. నామపత్రాల దాఖలు ప్రక్రియ గురువారం ముగిసింది. తర్వాత అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. బుధ, గురువారాల ముందు ప్రధాన పార్టీల అభ్యర్థులు మండల స్థాయి నాయకులతో సమావేశాలు నిర్వహించారు. ఇవి ఉదయం, సాయంత్రం ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఇటీవల జిల్లాలోని ఒక నియోజకవర్గంలో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ఏర్పాటు చేశారు. అయితే కార్యకర్తలు అనుకున్న సమయం దాటి అరగంట అయినా ఎవరూ రాలేదు. దీంతో నాయకులు ఏమైందని ఆరా తీస్తే ‘సార్ ఎండలు బాగున్నాయి నాలుగు తర్వాతనే గ్రామాల నుంచి బయల్దేరుతాము’ అని చెప్పారని ద్వితీయశ్రేణి నాయకులు వెల్లడించారు. దీంతో అనుకున్న సమయానికి రెండు గంటలు ఆలస్యంగా సమావేశం నిర్వహించాల్సి వచ్చింది. పైగా ఈ సమావేశాల్లో వాతావరణానికి తగ్గట్టుగా కార్యకర్తలకు చాయ్ బదులు మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. లోక్సభ నియోజకవర్గ పరిధి పెద్దగా ఉండటంతో అభ్యర్థులు ఆయా నియోజకవర్గబాధ్యులు, మండల స్థాయి నాయకులపైనే ఆధారపడాల్సి ఉంటుంది. ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ఉదయం, సాయంత్రం ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. మరోవైపు ఒక్కోసారి సాయంత్రం కాగానే గాలి, వానల దృష్ట్యా సమావేశాలు రద్దు చేసుకునే పరిస్థితి ఏర్పడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆడపిల్ల పుడితే రూ.2వేల డిపాజిట్.. ఎండ్రియల్లో యువ జంట వినూత్న నిర్ణయం
[ 08-05-2024]
మండలంలోని ఎండ్రియల్ గ్రామానికి చెందిన ఓ యువ జంట తమ 10వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. -
ఉద్యమ ఊపిరి.. కామారెడ్డి
[ 08-05-2024]
తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ కామారెడ్డి అని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. -
పోలింగ్ కేంద్రం ఎక్కడుందో..
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికలు ఈ నెల 13న జరగనున్నాయి. ఇక ఏ పోలింగ్ కేంద్రం ఎక్కడుందో గూగుల్ మ్యాప్(ఉపగ్రహ పటాలు)తో తెలుసుకోవచ్చు. -
తరలొస్తూ.. తర్ఫీదు పొందుతూ
[ 08-05-2024]
కొందరు వేసవి సెలవులను ఇంట్లోనే ఉంటూ చరవాణుల్లో వీడియోగేమ్లు ఆడుకుంటుంటే.. ఈ చిన్నారులు మాత్రం సృజనాత్మకతకు పదునెడుతున్నారు. -
ఎన్నికల ప్రక్రియలో వీరే కీలకం
[ 08-05-2024]
ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ కీలకమైన అంశం. ఓటుహక్కుతో ప్రజలు తమకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకునే ప్రక్రియ ఇది. -
బరువు పేరిట వడ్లు కాజేత
[ 08-05-2024]
కరవు పరిస్థితులను అధిగమించి ఎలాగోలా వరి పంటను బతికించుకొని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన రైతులకు చివరికి నిరాశే మిగులుతోంది. -
ఇంటర్లో అధికంగా విద్యార్థుల అనుత్తీర్ణత
[ 08-05-2024]
ఇటీవల విడుదలైన పది, ఇంటర్ ఫలితాలు నిరాశపరిచాయి. గతేడాది కన్నా తక్కువ ఉత్తీర్ణతశాతం నమోదైంది. వచ్చే నెలలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. -
ప్రైవేటు బడులు.. నిబంధనలకు నీళ్లు
[ 08-05-2024]
అధికారులంతా ఎన్నికల విధుల్లో తలమునకలయ్యారు. సాధారణ బడుల నుంచి కార్పొరేట్ పాఠశాలల వరకు యాజమాన్యాలు ఇదే అదనుగా రెచ్చిపోతున్నాయి. -
కలుస్తూ.. కలియతిరుగుతూ..
[ 08-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం మూడు రోజుల్లో ముగియనుంది. ప్రధాన పార్టీలు బహిరంగ సభలు, రోడ్ షోలతో హోరెత్తిస్తున్నాయి. అభ్యర్థులు ఊళ్లను చుట్టేస్తున్నారు. -
‘చివరి ఎన్నిక.. ఆశీర్వదించండి’
[ 08-05-2024]
‘వయసు మీరింది. మళ్లీ ఓట్లు చూస్తానో.. చూడనో.. ఎన్నికల్లో పోటీకి ఇదే చివరి అవకాశం. ఆపదలో ఉన్నా ఓటుతో ఆశీర్వదించి ఎంపీగా గెలిపించండి’ అని కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి ప్రజలను కోరారు. -
‘రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే విమానాశ్రయం ఆలస్యం’
[ 08-05-2024]
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే జక్రాన్పల్లిలో విమానాశ్రయం ఏర్పాటు ఆలస్యమైందని, ప్రతిపాదిత భూమి అప్పగిస్తే ఏడాదిలో ఏర్పాటు చేయిస్తానని భాజపా ఎంపీ అభ్యర్థి అర్వింద్ పేర్కొన్నారు. జక్రాన్పల్లిలో మంగళవారం ఎన్నికల ప్రచారం చేశారు. -
‘భాజపా అభ్యర్థికి తెదేపా మద్దతు’
[ 08-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు భాజపా అభ్యర్థి బీబీపాటిల్కు మద్దతు ప్రకటిస్తున్నట్లు జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పైడి గోపాల్రెడ్డి ప్రకటించారు. -
వేలికి సిరా.. తప్పిదాలకు తెర
[ 08-05-2024]
మే 13న లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో అక్రమాలను నిరోధించేందుకు, దొంగ ఓట్ల నమోదును తగ్గించేందుకు ఎన్నికల సంఘం సిరాను వినియోగిస్తుంది -
‘కాంగ్రెస్కు చేనేత కార్మికుల కష్టాలు పట్టవు’
[ 08-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వానికి చేనేత కార్మికుల కష్టాలు ఏ మాత్రం పట్టవని నిజామాబాద్ భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. -
సౌకర్యాలు లేకుంటే దోస్త్లో చేర్చం
[ 08-05-2024]
తెవివి పరిధిలోని డిగ్రీ కళాశాలలకు (2024-25 విద్యా సంవత్సరానికి) ‘వర్సిటీ అనుబంధ గుర్తింపు’ ఇచ్చేందుకు తనిఖీలు సాగుతుండగానే దోస్త్ ప్రక్రియ ప్రారంభమైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆడపిల్ల పుడితే రూ.2వేల డిపాజిట్.. ఎండ్రియల్లో యువ జంట వినూత్న నిర్ణయం
-
హలో.. మీ ఓటు ఎటు?.. సర్వే ఏజెన్సీల నుంచి ఫోన్లు
-
మాయావతి కీలక ప్రకటన.. వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ తొలగింపు
-
‘జే బ్రాండ్’ మద్యం తాగి వృద్ధుడి మృతి
-
పెద్దపల్లి పోరు.. తండ్రీకొడుకులపై పోటీ
-
మాట తప్పిన జోగి.. మా సొమ్ములేవి?