కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు.
జనజాతర సభలో కార్యకర్తలకు సీఎం దిశానిర్దేశం
అభివాదం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి
పెద్దశంకరంపేట, నారాయణఖేడ్, న్యూస్టుడే: మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. రానున్న లోకసభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా సురేష్షెట్కార్ను లక్ష మెజారిటీతో గెలిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇందిరమ్మ ప్రభుత్వ హయాంలోనే ఉమ్మడి మెదక్ జిల్లాలో బీహెచ్ఈఎల్, ఐడీపీఎల్, ఈసీఐఎల్ వంటి పరిశ్రమలు స్థాపించిన విషయాన్ని గుర్తు చేశారు. వీటితో స్థానికంగానే కాకుండా రాష్ట్రం, పొరుగు రాష్ట్రాల నిరుద్యోగ యువతకు ఉపాధి లభించిందన్నారు.
సభావేదికపై సీఎం రేవంత్రెడ్డి, మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఎమ్మెల్యేలు లక్ష్మీకాంతరావు, మదన్మోహన్రావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు రాములునాయక్, ఏనుగు రవీందర్రెడ్డి
అందుబాటులో ఉండే నేతకు పట్టం కట్టాలి
ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడే సురేష్షెట్కార్ను ఎంపీగా గెలిపించాలని కార్యకర్తలకు సీఎం పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ టికెట్ ఆయనకు కేటాయిస్తే, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సంజీవరెడ్డికి త్యాగం చేశారని కొనియాడారు. సంజీవరెడ్డి అయితేనే విజయం సాధిస్తారని గ్రహించడంతోపాటు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావాలనే సంకల్పంతో షెట్కార్ ఈ పని చేశారని పేర్కొన్నారు. త్యాగం చేసిన ఆయన విజయానికి కాంగ్రెస్ కార్యకర్తలు శ్రమించాలని కోరారు.
అంచనాకు మించి హాజరైన జనం
సభకు హాజరైన కాంగ్రెస్ నాయకులు, అభిమానులు, ప్రజలు
జనజాతర సభకు అంచనాలకు మించి కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. రెట్టించిన ఉత్సాహంతో కాంగ్రెస్ నేతలు సమావేశంలో మాట్లాడారు. ఎంపీ బీబీపాటిల్ పదేళ్ల కాలంలో నియోజకవర్గానికి ఏం చేయలేదని, సంగారెడ్డి-నాందేడ్-అకోల(ఎస్ఎన్ఏ) జాతీయ రహదారి తన పదవీ కాలంలోనే మంజూరైనప్పటికీ బీబీపాటిల్ తాను మంజూరు చేయించినట్లు చెప్పుకొంటున్నారని సురేష్ షెట్కార్ ఆరోపించారు. ఈ సందర్భంగా గతంలో కేంద్రప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ను సభలో ప్రదర్శించారు. సమావేశంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఎమ్మెల్యేలు మదన్మోహన్రావు, లక్ష్మీకాంతరావు, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, మండవ వెంకటేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మాట్లాడారు. నారాయణఖేడ్, అందోలు, జహీరాబాద్ నియోజకవర్గాలతో పాటు కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు
హామీలు నెరవేర్చే సత్తా పార్టీకి ఉంది
మంత్రి దామోదర్ రాజనర్సింహ
దేశంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే సత్తా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలను 100 రోజుల్లోపే అమలు చేశామని చెప్పారు. 30 వేల ఉద్యోగాలు ఇవ్వగా, ఇంకా 2లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన, మహిళకు 50 శాతం రిజర్వేషన్లు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీలకు వేతనాలు పెంపు, 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 60 ఏళ్ల తెలంగాణ కలను సోనియాగాంధీ సాకారం చేయగా, తొమ్మిదిన్నరేళ్ల కేసీˆఆర్ కుటుంబ పాలనలో రూ.7లక్షల కోట్ల అప్పులతోపాటు, అన్ని వర్గాల వారికీ అన్యాయం జరిగిందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను కాలరాయడానికే భాజపా 400 సీట్లు కోరుకుంటోందని దుయ్యబట్టారు. భాజపా గెలిస్తే సమాజం ప్రమాదంలో పడుతుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆలోచించుకోవాలన్నారు.
జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్షెట్కార్ మాట్లాడుతూ.. తాను ఎంపీగా ఉన్న సమయంలో సోనియాగాంధీని ఒప్పించి, మెప్పించి తెలంగాణ బిల్లు పాస్ చేయించడంతో తన పాత్ర ఉందన్నారు. జహీరాబాద్ ప్రాంతంలో నిమ్జ్ తన హయాంలోనే మంజూరైందన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగునెలలే అయ్యిందన్నారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్టేసి చెబుతున్నా, మాజీ మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ పట్టించుకోకుండా సీఎం కుటుంబ సభ్యులపై ఒట్టేయాలని అడగడం విడ్డూరంగా ఉందన్నారు. ఆగస్టు వరకు ఆగలేరా అని ప్రశ్నించారు. కారు స్పీడున్నప్పుడు బీబీ పాటిల్ అందులో ఉండి.. కారు డ్యామెజ్కాగానే కమలం దరి చేరారని పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి సురేష్షెట్కార్ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏఐసీసీ కార్యదర్శి రోహిత్చౌదరి, మాజీ మంత్రులు చంద్రశేఖర్, యూసూఫ్అలీ, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, నాయకులు ఉజ్వల్రెడ్డి, సుభాష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దళిత వికాస ఇన్ఛార్జిలకు సన్మానం
[ 07-05-2024]
తాండూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులను జహీరాబాద్ పార్లమెంట్ దళిత వికాస ఇన్ఛార్జిగా నియమితులైన ప్రభాకర్ను, ఎల్లారెడ్డి నియోజకవర్గ దళిత వికాస ఇన్ఛార్జిగా ఎన్నికైన బోరంచ సాయిలను కాంగ్రెస్ కార్యకర్తలు శాలువాతో ఘనంగా సన్మానించారు. -
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం
[ 07-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం అని కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. -
ఉత్సాహంగా వేసవి శిబిరం
[ 07-05-2024]
ఎండలను లెక్కచేయకుండా విద్యార్థులు వేసవి శిబిరాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కూచిపూడి, భరత నాట్యం, బృంద చర్చల్లో ఎలా రాణించాలి, నైతిక విలువల పెంపు, కర్రసాము తదితర అంశాల్లో శిక్షణ పొందుతున్నారు. -
కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉంది: ఇందుప్రియ
[ 07-05-2024]
ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉందని బల్దియా ఛైర్పర్సన్ ఇందు ప్రియ అన్నారు. -
భాజపాను భారీ మెజార్టీతో గెలిపించాలి
[ 07-05-2024]
ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో వివిధ పార్టీ నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు... -
ఇందూరును గుండెల్లో పెట్టుకుంటా
[ 07-05-2024]
‘‘నేను గులాబీ జెండా ఎత్తిన నాడు.. నిజామాబాద్ నా వెంట నిలిచి జిల్లా పరిషత్తును గెలిపించింది. ఉద్యమాన్ని ఆకాశానికి ఎత్తింది. ఈ విషయాన్ని నేను ప్రాణం ఉన్నంత వరకు మరవను. ఈ ప్రాంతాన్ని గుండెల్లో పెట్టుకుంటాను’’ అని భారాస అధినేత కేసీఆర్ అన్నారు. -
అగ్రనేతలు వస్తున్నారు
[ 07-05-2024]
పోలింగ్ తేదీ సమీపిస్తున్న క్రమంలో రాజకీయపార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. -
నేతల నోట.. తీయటి మాట
[ 07-05-2024]
నిజాం సుగర్స్.. ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారంగా పాఠ్య పుస్తకాల్లో పారిశ్రామిక గుర్తింపు. తెలంగాణకే తలమానికంగా భౌగోళిక ప్రత్యేకత. -
ఆమె నిర్ణయం.. అభ్యర్థి విజయం
[ 07-05-2024]
ఆకాశంలో సగం.. అన్నింటా మేమున్నామంటూ చాటుతున్న మహిళలు పార్లమెంటు ఎన్నికల్లో కీలకం కానున్నారు. -
ఐదంచెల భద్రతా వ్యవస్థ
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఐదంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ సీహెచ్ సింధూశర్మ పేర్కొన్నారు. -
‘యూనిఫాం సివిల్ కోడ్ తెచ్చి తీరుతాం’
[ 07-05-2024]
తాము అధికారంలోకి రాగానే యూనిఫామ్ సివిల్ కోడ్ తప్పక అమలుపరుస్తామని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. -
‘వ్యాపారులకు కొమ్ముకాస్తున్న కేంద్ర ప్రభుత్వం’
[ 07-05-2024]
కేంద్ర ప్రభుత్వం రైతులను విస్మరించి పెట్టుబడిదారులు, వ్యాపారులకు కొమ్ము కాస్తుందని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి ఆరోపించారు. -
ఇటు తనిఖీలు.. అటు దోస్త్ నోటిఫికేషన్
[ 07-05-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాలలకు 2024-25 విద్యా సంవత్సరానికి ‘యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు’ ఇచ్చేందుకు తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. -
ఆదాయానికి గండి
[ 07-05-2024]
‘కామారెడ్డిలో పాత జాతీయరహదారిపై ఉన్న ఓ వాణిజ్య భవనం నివాసయోగ్య పన్ను పరిధిలో ఉంది. నిర్మాణాల వైశాల్యం ఎక్కువ ఉన్నా తక్కువ చూపారు. నిర్దేశిత కొలతల ఆధారంగా పన్ను చెల్లించడం లేదు. -
మళ్లీ భగ్గుమన్న భానుడు
[ 07-05-2024]
జిల్లాలో మళ్లీ ఎండ జోరందుకుంది. నిప్పుల కొలిమిలా పరిస్థితి మారుతోంది. -
గడపగడపకు బూత్స్థాయి కమిటీలు
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికలు సమీపించడంతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇప్పటి వరకు నియోజకవర్గ, మండల కేంద్రాలకే పరిమితమైన ప్రచారం ప్రస్తుతం పల్లెలకు చేరింది. -
‘70 ఏళ్లుగా ఓటేస్తున్నా’
[ 07-05-2024]
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది.. ప్రజలే తమ నాయకుడిని ఎన్నుకుంటారు. -
11న సాయంత్రం 5 గంటలకు ప్రచారం సమాప్తం
[ 07-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోటీ చేసే అభ్యర్థులు ప్రచారం హోరెత్తిస్తున్నారు. -
ఎంపీగా ఓటమి.. ఎమ్మెల్యేగా గెలుపు
[ 07-05-2024]
ఉమ్మడి జిల్లాలో కొంతమంది నాయకులు మొదట లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్ కేసులో సుప్రీం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య