వ్యవసాయాధికారుల కొరత.. అన్నదాతల వెత
రైతుల సంక్షేమాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ సేవలు సక్రమంగా అందడం లేదు. వెనుకబడిన కొరాపుట్ జిల్లాలో వ్యవసాయ విభాగం పని తీరు తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది.
సిబ్బంది భర్తీపై కొరవడిన శ్రద్ధ
న్యూస్టుడే, సిమిలిగుడ
ఉపయోగపడని కొత్త కార్యాలయం
అధ్వానంగా వ్యవసాయ కార్యాలయాలు, అధికారులను కలిసేందుకు కి.మీ. వెళ్లాల్సిన దుస్థితి. వ్యవసాయాధికారులు, సిబ్బంది కొరత. ఇదీ కొరాపుట్ జిల్లాలో కర్షకులు ఎదుర్కొంటున్న దుస్థితి.
రైతుల సంక్షేమాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ సేవలు సక్రమంగా అందడం లేదు. వెనుకబడిన కొరాపుట్ జిల్లాలో వ్యవసాయ విభాగం పని తీరు తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. ముఖ్యంగా సంబంధిత విభాగంలో ఏళ్ల తరబడి అధికారులు, సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. దీంతో కార్యాలయానికి వెళ్తున్న రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చిత్తశుద్ధి లోపం
నందపూర్ వ్యవసాయ విభాగంలో పదుల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉండడంతోపాటు పనితీరులో చిత్తశుద్ధి లేదు. కొరాపుట్ వ్యవసాయ శాఖ పరిధిలో ఉన్న సిమిలిగుడ వ్యవసాయ శాఖ కార్యాలయం పనితీరులోనూ అన్నదాతలకు వెతలు తప్పడం లేదు. నిబంధన ప్రకారం సమితి కేంద్రం ఆవరణలోనే వ్యవసాయ శాఖ కార్యాలయం ఉండాలి. అయిదేళ్ల కిందట సిమిలిగుడ సమితి కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయ భవనం మరమ్మతులకు గురైంది. దీంతో సమితి కేంద్రానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న జానిగుడలోని రైతు సలహా కేంద్రం భవనానికి ఈ కార్యాలయాన్ని మార్చారు. దీనిపై ఆధారపడిన 17 పంచాయతీలకు చెందిన రైతులు కార్యాలయాలకు వెళ్లాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఏదైనా అవసరం నిమిత్తం, వ్యవసాయంపై సూచనలు కోసం రైతులు కార్యాలయానికి వెళ్లినప్పుడు అక్కడ అధికారులు, సిబ్బంది లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగిన సంఘటనలెన్నో ఉన్నాయి. అధికారుల కొరత, ఉన్న కొద్దిమంది క్షేత్రస్థాయిలో పనిచేయడంలో శ్రద్ధ చూపకపోవడం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. మూడేళ్లుగా వ్యవసాయాధికారి పోస్ట్ ఖాళీగా ఉంది.
ఒక్కరే మూడుచోట్ల..
దశమంతపూర్ సమితికి చెందిన వ్యవసాయ విభాగం అధికారి మహేష్ పాఢి స్థానిక కార్యాలయంతోపాటు మరో రెండు సమితుల్లోని కార్యాలయాల్లోనూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒకే అధికారి మూడుచోట్ల విధులు నిర్వహించడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వీఎల్డబ్ల్యూల సంఖ్య తక్కువగా ఉండడంతోపాటు ఒక్కొక్కరు రెండు, మూడు పంచాయతీల్లో విధులు నిర్వహించడం గమనార్హం. వారంలో అయిదు రోజులపాటు కార్యాలయం మూసే ఉంటోందని రైతులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ అధికారుల నుంచి తమకు ప్రోత్సాహం, సూచనలు, సలహాలు అందడంలేదని వాపోతున్నారు. పట్టణానికి దూరంగా కార్యాలయం ఉండడం రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని హలధారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయాధికారి మహేష్ పాఢి వద్ద ‘న్యూస్టుడే’ ప్రస్తావించగా కార్యాలయం నిర్వహణకు సరిపడా అధికారులు, సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, భర్తీకి ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. కార్యాలయంలో పనిచేసే సీనియర్ గుమస్తా సెలవులో ఉండడంతో కొన్నిరోజులు కార్యాలయం తెరవలేదని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివాహిత ఆత్మహత్యా యత్నం
[ 15-05-2024]
భర్త, అత్తమామల వేధింపులు భరించలేక నవ వధువురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. -
మాజీ మంత్రి డంబొరొదర ఉలక కన్నుమూత
[ 15-05-2024]
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డంబొరొదర ఉలక (87) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో భవనేశ్వర్ లోని.... -
జగన్నాథుని ఆశీస్సులెవరికి?
[ 15-05-2024]
హరి (జగన్నాథుడు) నామస్మరణతో నిరంతర మార్మోగే పూరీ తుర్పుతీర దివ్యధామంలో ఇప్పుడు రాజకీయ వేడి పెరిగింది. ఎన్నికల నేపథ్యంలో ప్రచారం ఊపందుకుంది. -
స్ట్రాంగ్రూంలో ఈవీఎంల భద్రత
[ 15-05-2024]
బ్రహ్మపుర లోక్సభ, దాని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోమవారం ప్రశాంతంగా పోలింగు జరిగింది. -
రాయగడ జిల్లాలో 74.44 శాతం పోలింగ్
[ 15-05-2024]
తొలిదశలో సోమవారం జరిగిన ఎన్నికల్లో రాయగడ జిల్లాలో 74.44 శాతం పోలింగ్ జరిగింది. మూడు నియోజకవర్గాలున్న జిల్లాలో బిసంకటక్ శాసనసభ స్థానంలో అత్యధికంగా 77.93 శాతం పోలింగ్ నమోదైంది. -
కోస్తా, తీర, పశ్చిమ జిల్లాల్లో ప్రచారం ముమ్మరం
[ 15-05-2024]
ఉత్తరకోస్తా, తీర, పశ్చిమ జిల్లాల్లో ఈ నెల 20, 25, జూన్ 1 తేదీల్లో పోలింగ్ జరగనుండగా ఎన్నికల ప్రచారం ఊపందుకుంది -
తెలుగు ఓటర్లవైపు పార్టీల చూపు
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల్లో తెలుగు ఓటర్లను ఆకర్షించడానికి తృణమూల్ కాంగ్రెస్, భాజపా, వామపక్ష పార్టీల కూటమి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి -
నేడు కటక్లో అమిత్షా రోడ్షో
[ 15-05-2024]
కేంద్ర హోంమంత్రి అమిత్షా బుధవారం సాయంత్రం కటక్ వస్తున్నారు. భాజపా నగరశాఖ ఆధ్వర్యంలో 10 కిలోమీటర్ల మేర రోడ్షో నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు గోలక్ మహాపాత్ర్ మంగళవారం భువనేశ్వర్లో విలేకరులకు చెప్పారు. -
ఇలా వస్తానని... అలా మాయమైంది
[ 15-05-2024]
ఇప్పుడే వస్తానని తోటి మహిళను నమ్మించి, ఆమె చేతిలో శిశువును పెట్టి ఓ మాతృమూర్తి పరారైంది. -
చకచకా రథ చక్రాల పనులు
[ 15-05-2024]
తెల్లవారక ముందే స్నానం, తర్వాత పురుషోత్తమ దర్శనం... స్వామి తీర్థ ప్రసాదాల ఆరగింత... అనంతరం శ్రీక్షేత్ర కార్యాలయం ఆవరణలో ఏర్పాటైన చలవ పందిరికి చేరుకుని రథచక్రాల పనులు.. ఇవీ ప్రస్తుతం శ్రీక్షేత్రం ఆవరణలో మహరణా (వడ్రంగి) సేవాయత్ల నిత్యకృత్యాలు. జులై 7న ఇక్కడ విశ్వప్రసిద్ధ రథయాత్ర నిర్వహించనున్నారు. -
బ్రహ్మపుర లోక్సభ భాజపా అభ్యర్థి ప్రదీప్పై దాడి
[ 15-05-2024]
బ్రహ్మపుర లోక్సభ నియోజకవర్గం భాజపా అభ్యర్థి ప్రదీప్ కుమార్ పాణిగ్రహిపై బ్రహ్మపుర అసెంబ్లీ సెగ్మెంట్ స్వతంత్ర అభ్యర్థి శిబశంకర దాస్ (పింటు దాస్) సోమవారం రాత్రి దాడి చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘గర్జనకు సిద్ధం’.. బైడెన్ సవాలును స్వీకరించిన ట్రంప్!
-
హైదరాబాద్లో ఏపీ ఆధీనంలో ఉన్న భవనాల స్వాధీనానికి సీఎం రేవంత్ ఆదేశం
-
మీరు అలా అంటుంటే ఆశ్చర్యంగా ఉంది: శివానీ రాజశేఖర్
-
మా ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదు.. హరియాణా మంత్రి
-
దీనిని ఎవరు ఓకే చేశారో..?: కింగ్ ఛార్లెస్ చిత్తరువుపై భిన్నాభిప్రాయాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM