logo

మావోయిస్టులు, పోలీసుల మధ్య కాల్పులు

ఒడిశా- ఛత్తీస్‌గఢ్‌- నవరంగపూర్‌ జిల్లా సరిహద్దు ప్రాంతమైన రాయ్‌ఘర్‌లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి.

Published : 10 May 2024 14:04 IST

నవరంగ్‌పూర్‌: ఒడిశా- ఛత్తీస్‌గఢ్‌- నవరంగపూర్‌ జిల్లా సరిహద్దు ప్రాంతమైన రాయ్‌ఘర్‌లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. సదరు సమితి హతిగావ్ అడవిలో జరిగిన కాల్పుల్లో ఒక మవోయిస్టు మృతి చెందాడు. పోలీసులు జరిపిన సోదాల్లో డంప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డీఐజీ చరణ్ సింగ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు గురువారం సాయంత్రం హతిగావ్ అడవుల్లో మావోయిస్టులు ఉన్నట్టు గుర్తించి ఎస్పీ రోహిత్ వర్మ నేతృత్వంలో రెండు బృందాలు కాల్పులు జరిపారన్నారు. మావోయిస్టులను లొంగిపోవాలని హెచ్చరించినా వినకుండా తిరిగి కాల్పులు జరిపారని, దాదాపు 45 నిమిషాల పాటు కాల్పులు జరిగాయని తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు