Chandrababu: వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు

వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.

Published : 19 Apr 2024 17:17 IST

అమరావతి: విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో వైకాపా ప్రచారరథం ఢీకొని భరద్వాజ్‌ (10) అనే బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. సమయానికి 108 అంబులెన్స్‌ రాకపోవడం, బాలుడిని సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లలేకపోవడం బాధాకరమన్నారు. కన్నూమిన్ను కానరాక ప్రచార రథాన్ని నడిపిన నిర్లక్ష్యం ఒకటైతే.. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌ అందించలేని వైకాపా పాలనా నిర్లక్ష్యం మరొకటని మండిపడ్డారు. ఈ రెండూ కలిసి ఎంతో భవిష్యత్తు ఉన్న పసివాడి జీవితాన్ని బలితీసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భరద్వాజ్‌ కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని