logo

మద్యం మత్తులో మహిళపై దాడి

 మద్యం మత్తులో ఒకరిపై దాడికి వెళ్లిన యువకులు మరొక ఇంటికి వెళ్లి ఓ మహిళను కొట్టిన సంఘటన మార్కాపురం మండలంలోని వేములకోట గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితురాలు

Updated : 30 Jun 2022 02:49 IST

మార్కాపురం గ్రామీణం, న్యూస్‌టుడే :  మద్యం మత్తులో ఒకరిపై దాడికి వెళ్లిన యువకులు మరొక ఇంటికి వెళ్లి ఓ మహిళను కొట్టిన సంఘటన మార్కాపురం మండలంలోని వేములకోట గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితురాలు తేరుకొని 100కు సమాచారం ఇవ్వడంతో అక్కడికి పోలీసులు వచ్చే లోపే ఆ యువకులు పరారయ్యారు. మండలంలోని వేములకోట గ్రామంలో రెండు వర్గాలకు చెందిన యువకులు మంగళవారం మద్యం తాగి దాడులు చేసుకున్నారు. ఈ గ్రూపుల్లో ఉన్న ఓ యువకుడిపై దాడి చేసేందుకు వెళ్లిన వారు  మరొక ఇంటకి వెళ్లి ‘మీ కుమారుడు ఇంట్లో ఉన్నాడా.. బయటకు రమ్మను. లేకుంటే నిన్ను, వాడిని చంపేస్తాం’ అని బెదిరించడంతో పాటు ఆమె తేరుకునే లోపే అయిదుగురు యువకులు దాడి చేసినట్లు బాధితురాలు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వైకాపా కార్యకర్తలు అని చెప్పి వదిలేసినట్లు తెలిసింది. గ్రామానికి చెందిన ఓ నాయకుడి అండతోనే పలువురిపై ఆ యువకులు దాడులకు తెగబడుతున్నట్లు గ్రామస్థులు వాపోతున్నారు. ఈ విషయంపై మార్కాపురం గ్రామీణ పోలీసులను వివరణ కోరగా ఘటనపై ఎటువంటి కేసు నమోదు కాలేదని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని