logo

Road Accident: డివైడర్‌ను ఢీకొట్టిన బస్సు.. 10 మందికి గాయాలు

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సురారెడ్డిపాలెం వద్ద డివైడర్‌ను ఢీకొని ప్రైవేటు బస్సు బోల్తా పడింది.

Updated : 26 Nov 2023 09:46 IST

టంగుటూరు: ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సురారెడ్డిపాలెం వద్ద డివైడర్‌ను ఢీకొని ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు స్వలంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణిస్తున్నారు. బస్సులోని వారంతా తిరుపతి జిల్లా వాసులుగా గుర్తించారు. తిరుపతి నుంచి షిర్డీ వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. 

స్థానికుల సమాచారంతో జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాసరెడ్డి ,హైవే పోలీసులు, నాగులుప్పలపాడు ఎస్‌ఐ, సిబ్బంది ఘటనాస్థలికి చేరకున్నారు. బస్సులో ఇరుక్కుపోయిన ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం ఒంగోలు రిమ్స్‌కు 108లో తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు