ఏరులై పారిన మద్యం
మార్కాపురంలో సోమవారం వైకాపా అభ్యర్థి అన్నా వెంకట రాంబాబు నామినేషన్ సందర్భంగా మద్యం ఏరులైపారింది. డబ్బులు విచ్చలవిడిగా పంపిణీ చేశారు.పట్టణంతో పాటు చుటుపక్కల మండలాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులకు రూ.500 నగదు పంపిణీ చేశారు.
విచ్చలవిడిగా నగదు పంపిణీ
ర్యాలీతో ఇబ్బందులు
మార్కాపురంలోని కళాశాల రహదారిలో భారీగా నిలిచిపోయిన వాహనాలు
మార్కాపురం, న్యూస్టుడే : మార్కాపురంలో సోమవారం వైకాపా అభ్యర్థి అన్నా వెంకట రాంబాబు నామినేషన్ సందర్భంగా మద్యం ఏరులైపారింది. డబ్బులు విచ్చలవిడిగా పంపిణీ చేశారు.పట్టణంతో పాటు చుటుపక్కల మండలాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులకు రూ.500 నగదు పంపిణీ చేశారు. కొంత మందికి రూ.300 పంపిణీ చేశారు. ఎక్కడిక్కడ మద్యంతో పాటు చికెన్తో కూడిన పలావును పంపిణీ చేశారు. మద్యం కోసం పంపిణీ చేసిన చీటీలను తీసుకొని మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్ల వద్దకు వెళ్లి మరీ మద్యంను తీసుకున్నారు. ర్యాలీలో చిన్నపిల్లలు సైతం జెండాలు చేతపట్టుకోని కనిపించారు.
గుంటూరు, విజయవాడ నుంచి మహిళలు : నియోజకవర్గంలోని వైకాపా నాయకులు, కార్యకర్తలే కాకుండా గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో ఉన్న మహిళ కూలీలను ప్రత్యేకంగా వాహనాల్లో తరలించారు.వీరికి ఒక్కొక్కరికి రూ.వెయ్యి నగదుతో పాటు రవాణ ఖర్చుతో పాటు భోజన వసతి కల్పించారు. వీరిని స్థానికంగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన కల్యాణ మండపంలో ఉంచడం వివాదస్పందమైంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాజకీయ ప్రచారానికి తితిదే కల్యాణ మండపం వాడుకోవడం ఏమిటని ప్రతిపక్షాలు వాపోయాయి. మాకు చెప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి మహిళలను తీసుకురావడమేమిటి మార్కాపురం వచ్చిన మహిళలు వైకాపా నాయకులతో గొడవపడ్డారు.
ట్రాఫిక్కు అంతరాయం : మార్కాపురం కళాశాల రహదారితో పాటు దోర్నాల బస్టాండ్ మీదుగా గడియారస్తంభం నుంచి మార్కాపురం కంభం కూడలి వరకు వైకాపా నిర్వహించిన ర్యాలీతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఎటువంటి నిబంధనలు విధించకపోవడంతో అదే రహదారిపై ఒక పక్క ర్యాలీ, మరొక పక్క వాహనాలు, మరొక పక్క సాధారణ ప్రజల రాకపోకలతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. దీంతో ప్రజలు ఎండకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుమారు గంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. వైకాపా నాయకులు, కార్యకర్తల మధ్య సాధారణ ప్రజలు రహదారిపై నిలిచిపోవాల్సి వచ్చినందుకు వాపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన భూములపై జగన్ పెత్తనం.. అరాచకానికి పరాకాష్ట: చంద్రబాబు
[ 03-05-2024]
రాష్ట్రంలో పింఛనుదారుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
వైకాపా పందికొక్కులు.. బొక్కింది రూ.666 కోట్లు
[ 03-05-2024]
జగన్ పాలనలో వైకాపా ద్వితీయ శ్రేణి నాయకులు పందికొక్కుల అవతారమెత్తారు. పేదల నోరు కట్టి.. పొట్ట కొట్టి చౌక బియ్యాన్ని అందినంత బొక్కారు. నేతలు, ప్రజాప్రతినిధులకు కమీషన్లు ముట్టజెబుతూ వారి అండతో లెక్కపెట్టలేనంతగా మింగేశారు. -
నరకానికి దారులు
[ 03-05-2024]
జిల్లావ్యాప్తంగా రహదారులన్నీ ఛిద్రమవవ్వడంతో ప్రయాణం ప్రాణ సంకటంగా మారింది. ఏళ్ల తరబడి మరమ్మతుల ఊసే లేకపోవడంతో దుర్ఘటనలకు నిలయాలుగా మారాయి. మండల కేంద్రం నుంచి గ్రామాలకు వెళ్లే ప్రధాన రోడ్లతో పాటు, పల్లెల మధ్య ఏర్పాటుచేసిన లింకు, గ్రావెల్ రోడ్లు కూడా అధ్వానంగా తయారయ్యాయి. -
విపక్షాలపై పగ.. పండుటాకులపై కక్ష
[ 03-05-2024]
సామాజిక భద్రతా పింఛన్లు పొందుతున్న లబ్థిదారులకు ప్రభుత్వం పింఛన్ నగదును సచివాలయ సిబ్బందితో 2 నుంచి 3 రోజుల్లో పూర్తిగా పంపిణీ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఆదిశగా చర్యలు చేపట్టలేదు. -
బిడ్డనంటివి.. ఏడి‘ఫింఛను’ కుట్ర పన్నితివి
[ 03-05-2024]
వైకాపా ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలకు ముందు సామాజిక పింఛను లబ్ధిదారులతో ఓట్ల రాజకీయానికి తెరలేపింది. వృద్ధులను ముప్పుతిప్పలు పెట్టి.. ప్రతిపక్షంపైకి నెపం నెట్టాలనే ఉద్దేశంతోనే మే నెల నగదును బ్యాంక్లకు జమ చేసింది. -
నేడు జిల్లాకు అధినేతలు
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం జిల్లాకు రానున్నారు. -
అప్పుల బాధ తాళలేక యువ రైతు ఆత్మహత్య
[ 03-05-2024]
అప్పుల బాధ తాళలేక యువ రైతు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన దర్శి నగర పంచాయతీ పరిధిలోని శివరాజ్నగర్లో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై సుమన్ తెలిపిన వివరాల ప్రకారం.. -
మాదిగలకు ఆది నుంచీ అండగా చంద్రన్న
[ 03-05-2024]
రాష్ట్రంలో జగన్ అనే పాలకుడు పోవాలి, మరోసారి చంద్రబాబు రావాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందా కృష్ణమాదిగ ఆకాంక్షించారు. -
ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘించొద్దు
[ 03-05-2024]
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ప్రచార ఖర్చుల నిర్వహణ విషయంలో నిబంధనలు ఉల్లంఘించరాదని కలెక్టర్ దినేష్కుమార్ స్పష్టంచేశారు. -
తెదేపాలో చేరిన వార్డు వాలంటీర్లు
[ 03-05-2024]
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన అయిదుగురు వాలంటీర్లు గురువారం రాజీనామా చేసి వైకాపాను వీడి తెదేపా చేరారు. -
రైల్వే పనులు త్వరలో పూర్తి
[ 03-05-2024]
దొనకొండ రైల్వేస్టేషన్లో నిలిచిన పనులు త్వరలో పూర్తి చేయాలని రైల్వే గుంటూరు డివిజనల్ మేనేజర్ ఎం.రామకృష్ణ అన్నారు. అమృత్ భారత్ పనులు పరిశీలనలో భాగంగా ఆయన గురువారం దొనకొండ వచ్చారు. -
వైభవంగా స్వామివారి చక్రస్నానం
[ 03-05-2024]
పట్టణంలోని కాప వీధిలో కొలువైన వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా గురువారం స్వామివారి చక్రస్నానం పూజారులు కనులపండువగా నిర్వహించారు. -
నిర్లక్ష్యంతో ఆటలకు చేటు
[ 03-05-2024]
వైకాపా ప్రభుత్వం క్రీడారంగంపై శీతకన్ను వేసింది. ఫలితంగా యువత, విద్యార్థులకు గల్లీ క్రీడలే దిక్కవుతున్నాయి. చినుకు పడితే చాలు నగరంలోని మినీ స్టేడియం జలమయమవుతోంది. -
కోడిగుడ్ల డబ్బులు మింగేశారు!
[ 03-05-2024]
మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా కోడిగుడ్లు సరఫరా బిల్లుల చెల్లింపులో అక్రమాలు చోటుచేసుకున్నాయి. ప్రతినెలా వారానికి ఒకసారి గుత్తేదారు కోడిగుడ్లు సరఫరా చేస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు