logo

వైభవంగా స్వామివారి చక్రస్నానం

పట్టణంలోని కాప వీధిలో కొలువైన వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా గురువారం స్వామివారి చక్రస్నానం పూజారులు కనులపండువగా నిర్వహించారు.

Published : 03 May 2024 03:11 IST

స్వామివారి చక్రస్నానం నిర్వహిస్తున్న పూజారులు

కంభం, న్యూస్‌టుడే : పట్టణంలోని కాప వీధిలో కొలువైన వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా గురువారం స్వామివారి చక్రస్నానం పూజారులు కనులపండువగా నిర్వహించారు. స్వామివారి వసంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలే స్వామివారి పల్లకిని మోశారు. ఉత్సాహంగా వసంతం, కుంకుమలు చల్లుకున్నారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. రాత్రికి ఊంజల్‌ సేవ నిర్వహించారు. స్వామివారికి భక్తులు కాయకర్పూరాలు సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని