మాదిగలకు ఆది నుంచీ అండగా చంద్రన్న
రాష్ట్రంలో జగన్ అనే పాలకుడు పోవాలి, మరోసారి చంద్రబాబు రావాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందా కృష్ణమాదిగ ఆకాంక్షించారు.
ఎంపీ ఇస్తానంటూ వైఎస్ ప్రలోభాలు
ఎమ్మార్పీఎస్ నేత కృష్ణమాదిగ వ్యాఖ్యలు
యర్రగొండపాలెంలో ప్రసంగిస్తున్న కృష్ణమాదిగ. చిత్రంలో తెదేపా అభ్యర్థి ఎరిక్షన్బాబు, మన్నె రవీంద్ర
యర్రగొండపాలెం పట్టణం, న్యూస్టుడే: రాష్ట్రంలో జగన్ అనే పాలకుడు పోవాలి, మరోసారి చంద్రబాబు రావాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందా కృష్ణమాదిగ ఆకాంక్షించారు. గురువారం యర్రగొండపాలెంలో తెదేపా, జనసేన, భాజపా కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన మాదిగ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన తెదేపా అభ్యర్థి ఎరిక్షన్బాబు మద్దతు పలికారు. అనంతరం మాట్లాడుతూ ముప్ఫై ఏళ్ల ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అన్ని పార్టీలూ తనకు మంచి పదవులిస్తామని మభ్యపెట్టినా తాను లొంగిపోలేదన్నారు. 2007లో చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ చేసి మాట నిలుపుకుని తమకు ఎనలేని గౌరవమిచ్చారన్నారు. అనంతరం వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వర్గీకరణను అడ్డుకున్నారన్నారు. దీనిపై మద్దతు ఇవ్వాలని కోరగా, తనను, మాల మహానాడుకు చెందిన జూపూడి ప్రభాకరరావును పిలిపించి రాజ్యసభ పదవి ఇస్తానని ఆశ చూపారన్నారు. తాను తిరస్కరించగా, జూపూడి పదవి తీసుకున్నారన్నారు.
జగన్కు సాయం చేస్తే మాట మార్చారు
ఇబ్బందుల్లో ఉన్న ముఖ్యమంత్రి జగన్కు సహాయపడితే..అధికారంలోకి వచ్చాక వర్గీకరణ విషయంలో ఆయన మాట మార్చారన్నారు. వర్గీకరణకు చంద్రబాబు, ప్రధాని మోదీ ఆశీస్సులున్నందున వారికి అండగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. తెదేపా సీనియర్ నాయకుడు డాక్టర్ మన్నె రవీంద్ర, ఎమ్మార్పీఎస్ నేత నాగరాజు, కాశీరావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాకు ఓటేశాడని.. కొడవలితో చెవి కోసేశాడు
[ 17-05-2024]
తెదేపాకు ఓటు వేశాడన్న ఆక్రోశంతో ఓ యువకుడిపై వైకాపా నాయకుడు కొడవలితో దాడి చేశాడు. -
కదులుతుందా యంత్రాంగం!
[ 17-05-2024]
ముందుగానే వర్షాలు కురుస్తుండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. -
పేదల జాగాలు.. దళారుల బేరాలు
[ 17-05-2024]
ప్రభుత్వం మీకు ఊరికి 5 కి.మీటర్ల దూరంలో స్థలాలిచ్చింది. అక్కడ రోడ్లు లేవు, విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేయలేదు. -
ఊపిరి ఆగిపోతోందయ్యా!
[ 17-05-2024]
తాగునీరే వారి పాలిట శాపమైంది. ఫ్లోరైడ్ మహమ్మారి కోరలకు చిక్కి మూత్రపిండాల రోగులుగా మారారు. -
బకింగ్ హాంఫట్
[ 17-05-2024]
రహదారుల నిర్వహణ, మరమ్మతులు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదనేందుకు ఈ దృశ్యాలే నిదర్శనం. -
అనునిత్యం అప్రమత్తత అవసరం
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. -
నిధులు లాగేసి.. నీళ్లు నిలిపేసి
[ 17-05-2024]
ప్రస్తుతం గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పశ్చిమంలో భూగర్భ జలాలు ఇప్పటికే అడుగంటాయి. -
వక్ఫ్బోర్డు భూములకు రక్షణేదీ!
[ 17-05-2024]
పొదిలిలో కోట్లాది రూపాయల విలువైన వక్ఫ్బోర్డు భూములు క్రమంగా ఆక్రమణలకు గురవుతున్నా రక్షించాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. -
నరసింహా.. పాలక వర్గం లేకుండానే వేలమా!
[ 17-05-2024]
దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధి చెందిన మండలంలోని పాతసింగరాయకొండ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు జూన్ 16 నుంచి 26 వ తేదీ వరకు నిర్వహించనున్నారు. -
పేలిన టైరు.. అదుపు తప్పిన కారు
[ 17-05-2024]
మండలంలోని రాయవరం గ్రామ శివారులోని వైద్యకళాశాలకు సమీపంలో కారు బోల్తాపడిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. -
ఆస్తి గొడవ అంత్యక్రియల నిలిపివేత
[ 17-05-2024]
ప్రాణం ఉన్నంతవరకూ పట్టించుకోని ఆప్తులు..ఆ తర్వాత ఆస్తి కోసం పరుగు పరుగున వచ్చారు. -
ట్రాక్టర్ కింద పడి చిన్నారి మృతి
[ 17-05-2024]
అభం శుభం తెలియని చిన్నారికి నాలుగేళ్లకే నిండు నూరేళ్లు నిండాయి.
తాజా వార్తలు (Latest News)
-
రంజాన్ నెలలో బాంబింగ్ ఆపాలని ఇజ్రాయెల్కు చెప్పాను: మోదీ
-
స్థిరాస్తి రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు: తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు
-
బౌలర్ల భవిష్యత్తు కాపాడండి.. అందుకు ఇలా చేయండి: అనిల్ కుంబ్లే
-
వరల్డ్ ‘సూపర్-రిచ్’లో 15 మంది.. జాబితాలో అదానీ
-
యూఏఈ నుంచి ఇక ‘బ్లూ రెసిడెన్సీ వీసా’.. ఎవరికంటే..?
-
టెండర్లలో 1.5 శాతం ఆయనకు ఇవ్వాల్సిందే: ఈడీ