logo

రైల్వే పనులు త్వరలో పూర్తి

దొనకొండ రైల్వేస్టేషన్‌లో నిలిచిన పనులు త్వరలో పూర్తి చేయాలని రైల్వే గుంటూరు డివిజనల్‌ మేనేజర్‌ ఎం.రామకృష్ణ అన్నారు. అమృత్‌ భారత్‌ పనులు పరిశీలనలో భాగంగా ఆయన గురువారం దొనకొండ వచ్చారు.

Published : 03 May 2024 03:12 IST

దొనకొండ రైల్వేస్టేషన్‌ ఆవరణలో పనులు పరిశీలిస్తున్న డీఆర్‌ఎం రామకృష్ణ

దొనకొండ, న్యూస్‌టుడే: దొనకొండ రైల్వేస్టేషన్‌లో నిలిచిన పనులు త్వరలో పూర్తి చేయాలని రైల్వే గుంటూరు డివిజనల్‌ మేనేజర్‌ ఎం.రామకృష్ణ అన్నారు. అమృత్‌ భారత్‌ పనులు పరిశీలనలో భాగంగా ఆయన గురువారం దొనకొండ వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆగిన పనులు నెల రోజుల్లో పూర్తి చేయకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్టేషన్‌లోని అన్ని గదులను పరిశీలించి శిథిలావస్థకు చేరినవి పడేసి కొత్తవి నిర్మించాలని ఆదేశించారు. ఎన్నికల తర్వాత అవసరమైన రైళ్లు ఆగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో సీనియర్‌ డీఈ గౌతమ్‌, ఇంజినీర్‌ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని