logo

అయిదో రోజు 46 నామపత్రాల దాఖలు

ఒంగోలు పార్లమెంట్‌తోపాటు, 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అయిదో రోజైన మంగళవారం 46 మంది తమ నామపత్రాలు దాఖలు చేశారు.

Published : 24 Apr 2024 03:57 IST

కలెక్టర్‌ దినేష్‌కుమార్‌కు నామపత్రం అందజేస్తున్న ఒంగోలు ఎంపీ స్థానం కాంగ్రెస్‌ అభ్యర్థి సుధాకర్‌రెడ్డి

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఒంగోలు పార్లమెంట్‌తోపాటు, 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అయిదో రోజైన మంగళవారం 46 మంది తమ నామపత్రాలు దాఖలు చేశారు. ఒంగోలు పార్లమెంటు స్థానానికి ఈదా సుధాకర్‌రెడ్డి (కాంగ్రెస్‌), ధరణికోట లక్ష్మీనారాయణ (బీఎస్పీ), రాయపాటి జగదీష్‌ (స్వతంత్ర), కోట సూర్యతేజ (పిరమిడ్‌ పార్టీ), పాశం వెంకటేశ్వర్లు (సమాజ్‌ పార్టీ), బొంత రంగారెడ్డి (స్వతంత్ర)తోపాటు, మాగుంట శ్రీనివాసులురెడ్డి, మాగుంట గీతాలత (తెదేపా) తరఫున వారి ప్రతినిధులు మరో సెట్‌ నామపత్రాలు వేశారు. సదరు అభ్యర్థులు స్థానిక ప్రకాశం భవన్‌లోని ఛాంబర్‌లో కలెక్టర్‌ దినేష్‌కుమార్‌కు అందజేశారు. మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఎక్కువమంది అభ్యర్థులు రెండో సెట్‌ నామపత్రాలు వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని