అరవీర ‘రంగు’ మార్తాండ
మురుగు కాలువలు లేవు. ఉన్న వాటినైనా శుభ్రం చేయించడానికి సొమ్ముల్లేవు. ఎప్పుడో ఏర్పాటు చేసిన తాగునీటి పైపులైన్లే దిక్కు. పగిలిపోతే మరమ్మతులకు పైసల్లేవు.
కనిపించిన కట్టడాలకు సున్నాలు
శ్మశానాలనూ వదలకుండా సోకులు
వైకాపా ప్రభుత్వ వికృత విధానాలు
గ్రామ స్వరాజ్యానికి సమాధి రాళ్లు
రూ.11.50 కోట్లు వృథా
మురుగు కాలువలు లేవు. ఉన్న వాటినైనా శుభ్రం చేయించడానికి సొమ్ముల్లేవు. ఎప్పుడో ఏర్పాటు చేసిన తాగునీటి పైపులైన్లే దిక్కు. పగిలిపోతే మరమ్మతులకు పైసల్లేవు. ఎక్కడ చూసినా ఛిద్రమైన, గోతులు ఏర్పడిన రహదారులు. తట్టెడు మట్టి పోసేందుకు చేతులురావు. రహదారుల వెంట చెత్త తొలగింపు మొదలు.. వీధి దీపాల నిర్వహణ వరకు ప్రతిదీ సమస్యే. బ్లీచింగ్, ఫాగింగ్కూ నాలుగు రూపాయల కోసం వెతుక్కోవాల్సిన దుస్థితి. గ్రామ స్వరాజ్యానికి వైకాపా ప్రభుత్వం సమాధి కట్టిందనేందుకు ఇవో నిదర్శనాలు. చెప్పుకొనేందుకు చేసిందేమీ లేక కనిపించిన కట్టడాలన్నింటికీ పార్టీ రంగులతో సున్నమేసి సోకులద్దే ప్రయత్నం చేశారు. ఉన్న కొద్దిపాటి నిధులను వృథాగా ఖర్చు పెట్టారు. ఈ వికృత విధానంపై న్యాయస్థానం కన్నెర్ర చేసింది. మళ్లీ వాటిని తొలగించాల్సి వచ్చింది. అందుకు మరోసారి రంగులేశారు. ఈ అనాలోచిత వికృత విధానం ఫలితంగా జిల్లాలో రూ. 11.50 కోట్ల ప్రజాధనాన్ని బూడిదలో పోసిన పన్నీరులా చేశారు వైకాపా పాలకులు.
న్యూస్టుడే, ఒంగోలు గ్రామీణం
మొదటిగా రూ. 8 కోట్లు...: జిల్లాలో మొత్తం 719 సచివాలయాలున్నాయి. అనుబంధంగా ఆర్బీకేలు, విలేజ్ హెల్త్ క్లినిక్లకు పార్టీ రంగులద్దారు. ఇదే అదునుగా పట్టణం, గ్రామం అనే తేడా లేకుండా ప్రభుత్వ భవనాలకు వైకాపా రంగులు వేయించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన పంచాయతీ భవనాలతో పాటు, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు, వాటర్ట్యాంక్లు, చివరికి రహదారి డివైడర్లనూ వదలకుండా రంగులద్దారు. మరికొన్ని చోట్ల శ్మశానాలు, చేపల మార్కెట్ తదితర భవనాలకు కూడా వేశారు. ఆర్బీకే, విలేజ్ హెల్త్ క్లినిక్, డంపింగ్ యార్డులకు ఒక్కోదానికి ప్రభుత్వమే రూ.20 వేలు చొప్పున ఇవ్వగా, గ్రామ సచివాలయాలు, వాటర్ ట్యాంక్లకు చదరపు అడుగుల మేరకు ఒక్కోదానికి గ్రామ పంచాయతీ నిధుల నుంచి రూ.20 నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేశారు. మొదటి విడత వైకాపా రంగులు వేసేందుకు సరాసరిన ఒక్కో పంచాయతీకి రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు వెచ్చించారు. తద్వారా జిల్లా వ్యాప్తంగా రూ.8 కోట్ల మేర నిధులు ఖర్చు చేశారు.
హైకోర్టు ఆదేశాలతో మళ్లీ...
గ్రామాల్లోని సచివాలయాలతో పాటు, ఇతర ప్రభుత్వ భవనాలకు ఓ రాజకీయ పార్టీకి చెందిన వైకాపా రంగులు వేయడం రాజ్యాంగ విరుద్ధమంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో తక్షణమే పార్టీ రంగులు తొలగించాలంటూ కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో వాటిని మళ్లీ మార్చేశారు. కనీసం తెల్ల సున్నం వేసేందుకు కూడా పంచాయతీ ఖాతాలో నిధులు లేకపోవడంతో కొన్ని గ్రామాల్లో కార్యదర్శులు సొంత డబ్బులు వెచ్చించాల్సి వచ్చింది. మరికొందరు మూడు రంగుల్లో ఒకటి మాత్రమే తొలగించి మమ అనిపించారు. రెండో విడత కింద పంచాయతీకి సరాసరిన రూ.50 వేలు చొప్పున రూ.3.50 కోట్ల వరకు ఖర్చు చేశారు. జిల్లా అంతటా రెండు సార్లు రంగులు వేసేందుకు సుమారు రూ.11.50 కోట్ల వరకు ప్రభుత్వ నిధులు ఖర్చు చేశారు.
వైకాపా రంగులతో ఒంగోలు మండలం సర్వేరెడ్డిపాలెం రైతు భరోసా కేంద్రం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన భూములపై జగన్ పెత్తనం.. అరాచకానికి పరాకాష్ట: చంద్రబాబు
[ 03-05-2024]
రాష్ట్రంలో పింఛనుదారుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
వైకాపా పందికొక్కులు.. బొక్కింది రూ.666 కోట్లు
[ 03-05-2024]
జగన్ పాలనలో వైకాపా ద్వితీయ శ్రేణి నాయకులు పందికొక్కుల అవతారమెత్తారు. పేదల నోరు కట్టి.. పొట్ట కొట్టి చౌక బియ్యాన్ని అందినంత బొక్కారు. నేతలు, ప్రజాప్రతినిధులకు కమీషన్లు ముట్టజెబుతూ వారి అండతో లెక్కపెట్టలేనంతగా మింగేశారు. -
నరకానికి దారులు
[ 03-05-2024]
జిల్లావ్యాప్తంగా రహదారులన్నీ ఛిద్రమవవ్వడంతో ప్రయాణం ప్రాణ సంకటంగా మారింది. ఏళ్ల తరబడి మరమ్మతుల ఊసే లేకపోవడంతో దుర్ఘటనలకు నిలయాలుగా మారాయి. మండల కేంద్రం నుంచి గ్రామాలకు వెళ్లే ప్రధాన రోడ్లతో పాటు, పల్లెల మధ్య ఏర్పాటుచేసిన లింకు, గ్రావెల్ రోడ్లు కూడా అధ్వానంగా తయారయ్యాయి. -
విపక్షాలపై పగ.. పండుటాకులపై కక్ష
[ 03-05-2024]
సామాజిక భద్రతా పింఛన్లు పొందుతున్న లబ్థిదారులకు ప్రభుత్వం పింఛన్ నగదును సచివాలయ సిబ్బందితో 2 నుంచి 3 రోజుల్లో పూర్తిగా పంపిణీ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఆదిశగా చర్యలు చేపట్టలేదు. -
బిడ్డనంటివి.. ఏడి‘ఫింఛను’ కుట్ర పన్నితివి
[ 03-05-2024]
వైకాపా ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలకు ముందు సామాజిక పింఛను లబ్ధిదారులతో ఓట్ల రాజకీయానికి తెరలేపింది. వృద్ధులను ముప్పుతిప్పలు పెట్టి.. ప్రతిపక్షంపైకి నెపం నెట్టాలనే ఉద్దేశంతోనే మే నెల నగదును బ్యాంక్లకు జమ చేసింది. -
నేడు జిల్లాకు అధినేతలు
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం జిల్లాకు రానున్నారు. -
అప్పుల బాధ తాళలేక యువ రైతు ఆత్మహత్య
[ 03-05-2024]
అప్పుల బాధ తాళలేక యువ రైతు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన దర్శి నగర పంచాయతీ పరిధిలోని శివరాజ్నగర్లో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై సుమన్ తెలిపిన వివరాల ప్రకారం.. -
మాదిగలకు ఆది నుంచీ అండగా చంద్రన్న
[ 03-05-2024]
రాష్ట్రంలో జగన్ అనే పాలకుడు పోవాలి, మరోసారి చంద్రబాబు రావాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందా కృష్ణమాదిగ ఆకాంక్షించారు. -
ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘించొద్దు
[ 03-05-2024]
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ప్రచార ఖర్చుల నిర్వహణ విషయంలో నిబంధనలు ఉల్లంఘించరాదని కలెక్టర్ దినేష్కుమార్ స్పష్టంచేశారు. -
తెదేపాలో చేరిన వార్డు వాలంటీర్లు
[ 03-05-2024]
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన అయిదుగురు వాలంటీర్లు గురువారం రాజీనామా చేసి వైకాపాను వీడి తెదేపా చేరారు. -
రైల్వే పనులు త్వరలో పూర్తి
[ 03-05-2024]
దొనకొండ రైల్వేస్టేషన్లో నిలిచిన పనులు త్వరలో పూర్తి చేయాలని రైల్వే గుంటూరు డివిజనల్ మేనేజర్ ఎం.రామకృష్ణ అన్నారు. అమృత్ భారత్ పనులు పరిశీలనలో భాగంగా ఆయన గురువారం దొనకొండ వచ్చారు. -
వైభవంగా స్వామివారి చక్రస్నానం
[ 03-05-2024]
పట్టణంలోని కాప వీధిలో కొలువైన వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా గురువారం స్వామివారి చక్రస్నానం పూజారులు కనులపండువగా నిర్వహించారు. -
నిర్లక్ష్యంతో ఆటలకు చేటు
[ 03-05-2024]
వైకాపా ప్రభుత్వం క్రీడారంగంపై శీతకన్ను వేసింది. ఫలితంగా యువత, విద్యార్థులకు గల్లీ క్రీడలే దిక్కవుతున్నాయి. చినుకు పడితే చాలు నగరంలోని మినీ స్టేడియం జలమయమవుతోంది. -
కోడిగుడ్ల డబ్బులు మింగేశారు!
[ 03-05-2024]
మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా కోడిగుడ్లు సరఫరా బిల్లుల చెల్లింపులో అక్రమాలు చోటుచేసుకున్నాయి. ప్రతినెలా వారానికి ఒకసారి గుత్తేదారు కోడిగుడ్లు సరఫరా చేస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?