పన్ను పెంపు.. బాదుడే బాదుడు
ఇంటి పన్నుల నోటీసులు చూసి పట్టణవాసులు హడలిపోతున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆస్తి విలువ ఆధారిత పన్ను పెంపు విధానంతో ఇంటి యజమానులపై ప్రతి ఏడాది అదనపు భారం పడుతోంది.
యజమానులపై అదనంగా వడ్డింపు
ఇబ్బందులు పెడుతున్న సర్కార్
గిద్దలూరు పట్టణం, న్యూస్టుడే
ఇంటి పన్నుల నోటీసులు చూసి పట్టణవాసులు హడలిపోతున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆస్తి విలువ ఆధారిత పన్ను పెంపు విధానంతో ఇంటి యజమానులపై ప్రతి ఏడాది అదనపు భారం పడుతోంది. ఏటా 15శాతం మేర పన్ను పెంపు చేసి ముక్కుపిండి వసూలు చేస్తుండటంతో సామాన్య ప్రజలకు అది భారంగా మారింది.
పన్నులు చెల్లించాలని సచివాలయ సిబ్బంది ఇంటింటికి తిరిగి ముక్కుపిండి పన్నులు వసూలు చేపడుతున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంతో ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. గతంలో ఇంటి విస్తీర్ణం ఆదారంగా గతంలో ఇంటి విస్తీర్ణం, నిర్మాణం తీరు, సొంతగా వినియోగించుకుంటున్నారా లేక అద్దెకు ఇచ్చారా అని క్షేత్రస్థాయిలో పురపాలక సిబ్బంది పరిశీలించి పన్ను వేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2020 నుంచి ఆస్తి విలువ ఆధారంగా ముదింపు చేసి ఇంటి పన్ను వేసే ప్రక్రియను అమల్లోకి తెచ్చారు. రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించిన ప్రాంతాల వారీగా ఆస్తి విలువను బట్టి ప్రతి ఏడాది ఇంటి పన్ను 15శాతం పెంపుదల చేస్తున్నారు. గిద్దలూరు నగర పంచాయతీలో పలువురు ఇంటి యజమానులకు గత ఏడాది చెల్లించిన పన్నుకంటే అధనంగా 100 రెట్లకు పైగా పన్ను డిమాండ్ రావడంతో ఇంటి యజమానులు డిమాండ్ నోటీసులు చూసి బెంబేలెత్తుతున్న పరిస్థితులు నెలకొన్నాయి.
ఎందుకు పెంచారో చెప్పటం లేదు
గిద్దలూరు నగర పంచాయతీ ఏబీఏంపాలెంలో కింద షాపులు, పైన గృహ నిర్మాణం చేపట్టా. గత ఏడాది ఇంటి పన్ను డిమాండ్ రూ.6,958 రావడంతో ప్రారంభంలోనే 5 శాతం రిబెట్ ఉండటంతో పన్ను రూ.6,610 చెల్లించాను. అయితే ఈ ఏడాది అదే ఇంటికి రూ.15,302 పన్ను చెల్లించాలని డిమాండ్ నోటీస్ అందజేశారు. ఈ ఏడాది 15శాతం పెరిగింది. ఎందుకు పెరిగిందని నగర పంచాయతీ అధికారుల వద్దకు వెళ్లినప్పటికీ తమకు సంబంధం లేదని ఆన్లైన్లో పెరిగిందని, మీ ప్రాంతంలో ఆస్తివిలువు పెరిగి ఉండవచ్చునని తెలియజేశారు.
చిక్కుడి చిన్నవేమయ్య, ఉపాధ్యాయుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కదులుతుందా యంత్రాంగం!
[ 17-05-2024]
ముందుగానే వర్షాలు కురుస్తుండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. -
పేదల జాగాలు.. దళారుల బేరాలు
[ 17-05-2024]
ప్రభుత్వం మీకు ఊరికి 5 కి.మీటర్ల దూరంలో స్థలాలిచ్చింది. అక్కడ రోడ్లు లేవు, విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేయలేదు. -
ఊపిరి ఆగిపోతోందయ్యా!
[ 17-05-2024]
తాగునీరే వారి పాలిట శాపమైంది. ఫ్లోరైడ్ మహమ్మారి కోరలకు చిక్కి మూత్రపిండాల రోగులుగా మారారు. -
బకింగ్ హాంఫట్
[ 17-05-2024]
రహదారుల నిర్వహణ, మరమ్మతులు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదనేందుకు ఈ దృశ్యాలే నిదర్శనం. -
అనునిత్యం అప్రమత్తత అవసరం
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. -
నిధులు లాగేసి.. నీళ్లు నిలిపేసి
[ 17-05-2024]
ప్రస్తుతం గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పశ్చిమంలో భూగర్భ జలాలు ఇప్పటికే అడుగంటాయి. -
వక్ఫ్బోర్డు భూములకు రక్షణేదీ!
[ 17-05-2024]
పొదిలిలో కోట్లాది రూపాయల విలువైన వక్ఫ్బోర్డు భూములు క్రమంగా ఆక్రమణలకు గురవుతున్నా రక్షించాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. -
నరసింహా.. పాలక వర్గం లేకుండానే వేలమా!
[ 17-05-2024]
దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధి చెందిన మండలంలోని పాతసింగరాయకొండ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు జూన్ 16 నుంచి 26 వ తేదీ వరకు నిర్వహించనున్నారు. -
తెదేపాకు ఓటేశాడని.. కొడవలితో వైకాపా నేత దాడి
[ 17-05-2024]
తెదేపాకు ఓటు వేశాడన్న ఆక్రోశంతో ఓ యువకుడిపై వైకాపా నాయకుడు కొడవలితో దాడి చేశాడు. -
పేలిన టైరు.. అదుపు తప్పిన కారు
[ 17-05-2024]
మండలంలోని రాయవరం గ్రామ శివారులోని వైద్యకళాశాలకు సమీపంలో కారు బోల్తాపడిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. -
ఆస్తి గొడవ అంత్యక్రియల నిలిపివేత
[ 17-05-2024]
ప్రాణం ఉన్నంతవరకూ పట్టించుకోని ఆప్తులు..ఆ తర్వాత ఆస్తి కోసం పరుగు పరుగున వచ్చారు. -
ట్రాక్టర్ కింద పడి చిన్నారి మృతి
[ 17-05-2024]
అభం శుభం తెలియని చిన్నారికి నాలుగేళ్లకే నిండు నూరేళ్లు నిండాయి.
తాజా వార్తలు (Latest News)
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
-
క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత
-
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!