‘శిఖర’మంతా సాహసం.. కోరుతోంది ప్రోత్సాహం..!
జయశ్రీ చదువుతో పాటు సాహస క్రీడల్లోనూ ప్రతిభ చూపుతోంది. తల్లి ఉమా గృహిణి, తండ్రి ఎలక్ట్రికల్ దుకాణం నడుపుతున్నారు.
తాడు సాయంతో బియాస్ నదిని దాటుతున్న జయశ్రీ మంచు కొండను ఎక్కేందుకు సిద్ధమవుతూ..
సమాజంలో అమ్మాయిలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారు. ఏ శిక్షణకైనా, సాహసానికైనా మేము సైతం సై అంటూ ముందుకుసాగుతున్నారు. ఆ కోవకే చెందుతారు ఆమదాలవలస పట్టణం పాతినవారి వీధికి చెందిన కంచరాపు జయశ్రీ. ఈమె మంచు పర్వతాలు, కొండలు ఎక్కడం, నదులు దాటడం వంటి సాహస క్రీడలపై మక్కువతో ముందడుగు వేస్తున్నారు. ఇటీవల హిమాచల్ప్రదేశ్లో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకొని ఎవరెస్టును అధిరోహించడమే లక్ష్యంగా సాగుతున్నారు. ఈ సందర్భంగా ఈమెపై ‘న్యూస్టుడే’ ప్రత్యేక కథనం..
న్యూస్టుడే, ఆమదాలవలస గ్రామీణం: జయశ్రీ చదువుతో పాటు సాహస క్రీడల్లోనూ ప్రతిభ చూపుతోంది. తల్లి ఉమా గృహిణి, తండ్రి ఎలక్ట్రికల్ దుకాణం నడుపుతున్నారు. జయశ్రీ పదో తరగతి వరకు ఆమదాలవలసలో చదువుకుంది. ఇంటర్ శ్రీకాకుళంలోని శ్రీచైతన్య కళాశాలలో డిగ్రీ తిరుపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో పూర్తి చేసింది. ఎమ్మెస్సీ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ టెక్నాలజీ పీజీ చివరి సంవత్సరం అక్కడే చదువుతుంది. చివరి సంవత్సరం చదువుతుండగా సాహస క్రీడల్లో శిక్షణకు యూనివర్సిటీ నుంచి ఇద్దరిని ఎంపిక చేయగా వారిలో ఈమె ఒకరు కావడం గమనార్హం. వీరిద్దరూ ఈ నెల 6 నుంచి 15 వరకు హిమాచల్ప్రదేశ్ రాష్ట్రం కులుమనాలీలోని అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్ అండ్ అలైడ్ స్పోర్ట్సు (అభ్విమాస్) శిక్షణా కేంద్రంలో సాహస క్రీడల్లో తర్ఫీదు పొందారు.
శిబిరంలో నేర్పినవి ఇవే... శిబిరంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మైనస్ 2, 3 డిగ్రీల ఉష్ణోగ్రతలో శిక్షణలో భాగంగా యోగా, ధ్యానం, వ్యాయామం, పర్వతాలు, నదులు దాటడానికి శారీరకంగా మానసికంగా సిద్ధమయ్యేందుకు ముందుగా శిక్షణ ఇచ్చారు. మంచుకొండలపె చల్లటి నీటిలో తాడు సాయంతో బియాస్ నదిని దాటడం, వరదల్లో కొట్టుకుపోయేవారిని, నదిలో మునిగిపోయేవారిని ఏ విధంగా కాపాడాలో నేర్పించారు. శిక్షణ అనంతరం ప్రశంసాపత్రాలు, బహుమతులు అందించారు.
ఎవరెస్టు అధిరోహించాలనుంది...
శిక్షణను విజయవంతంగా పూర్తి చేశాను. మూడు వేల అడుగులు ఉన్న నాలుగు పర్వతాలను అధిరోహించడం, తాడు సాయంతో ఎత్తయిన కొండలను ఎక్కడం, దిగడం నేర్చుకున్నాను. వాటితో పాటు ఎలాంటి సమస్యలు, కష్టాలు ఎదురైనా దృఢంగా ముందుగా సాగితే విజయం సాధ్యమని పర్వతారోహణ ద్వారా తెలుసుకున్నాను. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాలని ఉంది. కానీ అందుకు శిక్షణ పొందేటంత ఆర్థిక స్థోమత లేదు. ప్రభుత్వం స్పందించి శిక్షణ ఇప్పిస్తే ఎవరెస్టును ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నాను.
కంచరాపు జయశ్రీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
[ 27-04-2024]
‘పల్లెల్లో అందరూ కలిసి ముందడుగు వేయండి. ఒకే మాటపై నిలబడండి. స్థానిక సంస్థల ఎన్నికలు ఏకగ్రీవం చేసుకుంటే ప్రోత్సాహక నిధులు మంజూరు చేస్తాం’ అని వైకాపా ప్రభుత్వం మూడేళ్ల కిందట పంచాయతీ ఎన్నికల సమయంలో ప్రకటించింది. -
95 ఆమోదం.. 28 తిరస్కరణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లావ్యాప్తంగా దాఖలైన నామపత్రాల పరిశీలన శుక్రవారం జరిగింది. 8 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానాలకు సంబంధించి వచ్చిన నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల పరిశీలకులు, అభ్యర్థుల సమక్షంలో పరిశీలించారు. -
వైకాపా అభ్యర్థుల నామపత్రాలపై అభ్యంతరాలు
[ 27-04-2024]
-
కలమట బాధ్యతల స్వీకరణ
[ 27-04-2024]
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. -
ఓటర్లు 18,75,934 మంది
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఓటర్ల కొత్త జాబితా ఖరారైంది. ఈ నెల 15 నాటికి నమోదైనవారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. -
మృత్యువులోనూ వీడని బంధం!
[ 27-04-2024]
వారిద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు. పిల్లల్ని పెంచి పెద్ద చేసి.. పెళ్లిళ్లు కూడా జరిపించారు. -
దశాబ్దాల వ్యధ.. శంకుస్థాపనకే పరిమితమైన కథ..!
[ 27-04-2024]
మూడు వైపులా మహేంద్రతనయ నది నీరు, మరో వైపు పంట పొలాలు. గ్రామం నుంచి బయటకు రావాలంటే నాటు పడవే శరణ్యం ఇదీ హిరమండలంలోని జిల్లేడుపేట గ్రామస్థుల పరిస్థితి. -
చుక్కలు చూపిస్తున్నారు
[ 27-04-2024]
పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలోని కొండి, పూజారి వీధులకు బోరు నీరే తాగు నీరు. బోరు వేసే సమయంలో 100 అడుగులు మాత్రమే తవ్వి వదిలేయడంతో క్రమేపీ నీటి లభ్యత తగ్గిపోయింది. -
ఇది మీ పాలనకు మచ్చు తునక
[ 27-04-2024]
వైకాపా పాలనలో రోడ్లు ఎలాంటి దీన స్థితిలో ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఇచ్ఛాపురంలోని పలు గ్రామాల్లోని రోడ్లు ఛిద్రమై వాహనదారులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. -
నగరమంతా.. ట్రాఫిక్ తంటా
[ 27-04-2024]
రోజురోజుకు పెరుగుతున్న జనాభా దృష్ట్యా నగరంలో నిత్యం ట్రాఫిక్ సవస్యలు అధికమవుతున్నాయి. డేఅండ్నైట్, రామలక్ష్మణ, సూర్యమహల్, అరసవల్లి మిల్లు, పొట్టిశ్రీరాములు, ఏడురోడ్ల కూడళ్లలో వాహనాల రద్దీతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
అరాచక పాలనకు చరమగీతం పాడాలి
[ 27-04-2024]
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని భాజపా ఎచ్చెర్ల ఎమ్మెల్యే అభ్యర్థి నడుకుదటి ఈశ్వరరావు అన్నారు. -
కూటమి విజయం ఖాయం
[ 27-04-2024]
కొద్ది రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి అఖండ విజయం ఖాయమని తెదేపా ఆమదాలవలస ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్ ధీమా వ్యక్తం చేశారు. -
జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాం
[ 27-04-2024]
అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకరరావు పేర్కొన్నారు. -
వచ్చే ఎన్నికల్లో కూటమి విజయం ఖాయం
[ 27-04-2024]
వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని ఎంపీ రామ్మోహన్నాయుడు అన్నారు.