logo

22న నరసన్నపేటలో మహాగళార్చన

నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని మహాగళార్చన కార్యక్రమంలో భక్తులంతా పాల్గొనాలని భజగోవిందం సేవాసమితి కోరింది.

Published : 21 Mar 2023 05:39 IST

శుభ పత్రికలను ఆవిష్కరిస్తున్న భజగోవిందం సభ్యులు

నరసన్నపేట, న్యూస్‌టుడే: నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని మహాగళార్చన కార్యక్రమంలో భక్తులంతా పాల్గొనాలని భజగోవిందం సేవాసమితి కోరింది. నరసన్నపేటలోని వెంకటేశ్వరాలయంలో సోమవారం భజగోవిందం సమితి మహాగళార్చన ఏర్పాట్లపై సమావేశమయ్యారు. ఈనెల 22న సాయంత్రం వెంకటేశ్వరాలయ ప్రాంగణంలో మహాగళార్చన నిర్వహిస్తున్నామన్నారు. గత 12 ఏళ్లుగా సామూహిక గోవింద నామస్మరణతో మహాగళార్చన నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో భజగోవిందం సమితి గౌరవాధ్యక్షులు స్వామిబాబు, కార్యదర్శి లక్ష్మణరావు, సభ్యులు అచ్చెన్న, భాస్కరరావు, నీలం, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని