logo

పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య

లావేరు మండలం పెద్దరొంపివలస గ్రామానికి చెందిన నాజాన చంద్రమ్మ(59) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

Published : 30 May 2023 04:38 IST

లావేరు, న్యూస్‌టుడే: లావేరు మండలం పెద్దరొంపివలస గ్రామానికి చెందిన నాజాన చంద్రమ్మ(59) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల మేరకు... చంద్రమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆరోగ్యం బాగుపడకపోవడంతో మనస్తాపంతో పురుగుల మందు తాగి అపస్మారకస్థితికి చేరుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. చంద్రమ్మకు భర్త అప్పలస్వామి, ఐదుగురు పిల్లలు ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ జి.రామారావు తెలిపారు.


రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: జాతీయ రహదారిపై అల్లినగరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖ జిల్లా ముడసరలోవ రోడ్డులో దీనదయాళ్‌పురానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానిక ఎస్సై వి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. రాపర్తి వెంకట సత్యరాఘవేంద్ర (38) అనే వ్యక్తి శుభ కార్యానికి వంటలు చేసేందుకు శ్రీకాకుళం వచ్చి పని పూర్తిచేసుకొని ద్విచక్ర వాహనంపై తిరిగి వెళ్తుండగా అల్లినగరం వద్ద వాహనం అదుపు తప్పి డివైడర్‌ను బలంగా ఢీకొన్నాడు. ఈ ఘటనలో వాహనం నడుపుతున్న రాఘవేంద్ర అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుక కూర్చున్న వ్యక్తికి గాయాలు కావడంతో చికిత్స కోసం 108 వాహనంలో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి రణస్థలానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని