వన్యప్రాణులకు ఉచ్చు..!
ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో వన్యప్రాణుల వేట గుట్టుగా సాగిపోతోంది. అప్పుడప్పుడు వేటగాళ్లు వినియోగించే నాటు తుపాకులు బయటపడుతున్న ఘటనలే నిదర్శనం.
గుట్టుగా సాగుతున్న వేట
కొరవడిన అటవీ శాఖ పర్యవేక్షణ
చీడిపాలెం సమీపంలో స్వాధీనం చేసుకున్న వన్యప్రాణిని అటవీ శాఖ సిబ్బందికి అప్పగిస్తున్న ఎస్ఈబీ అధికారులు
- 2023 ఫిబ్రవరిలో పాతపట్నం మండలం అంతరాబ వద్ద దుప్పిని సన్నని తీగతో వేటాడిన ముగ్గురిని అటవీ శాఖ అధికారులు పట్టుకుని వారిపై కేసు నమోదు చేశారు.
- గతేడాది మేలో కోదూరు సమీపంలో అడవిపంది మాంసాన్ని వాటాలు వేస్తున్న ఇద్దరు పట్టుబడ్డారు.
- సెప్టెంబరులో సీదిలో కొండ మేకను వల వేసి పట్టుకున్న ఇద్దరిపై కేసు నమోదైంది.
న్యూస్టుడే, మెళియాపుట్టి: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో వన్యప్రాణుల వేట గుట్టుగా సాగిపోతోంది. అప్పుడప్పుడు వేటగాళ్లు వినియోగించే నాటు తుపాకులు బయటపడుతున్న ఘటనలే నిదర్శనం. పాతపట్నం అటవీ శాఖ రేంజి పరిధి కొత్తూరు, పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలం, సారవకోట, జలుమూరు మండలాల్లో సుమారు 14 వేల హెక్టార్ల విస్తీర్ణంలో దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. అలుగు జాతికి చెందిన వన్యప్రాణులు, దుప్పులు, జింకలు, కనుజులు, కొండగొర్రెలు, నెమళ్లు, అడవి పందులు, కుందేళ్లు సంచరిస్తున్నాయి.
వన్య ప్రాణుల వేటకు వినియోగించే సన్న తీగ (పాత చిత్రం)
నాటు బాంబులు..కుక్కలు
అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంచారం ఆధారంగా వేటగాళ్లు ఉచ్చులు వేస్తుంటారు. ఆహారం, నీటి కోసం వాటి అన్వేషణ సమయాలను ఆసరాగా చేసుకుని సన్నని తీగలు, కట్టి బళ్లాలు, నాటు తుపాకులు, నాటు బాంబులను గురి కుదిరేలా సిద్ధం చేసి మాటు వేసి వేటాడతారు. కొన్ని ప్రాంతాల్లో కుక్కల్ని వినియోగిస్తుంటారు.
నిఘా సిబ్బందికి తాయిలాలు
వేటగాళ్లు అమాయకులైన గిరిజనులను ప్రలోభాలకు గురి చేసి పని కానిచ్చేస్తున్నారు. విషయం బయటకు పొక్కకుండా నిఘా సిబ్బందికి తాయిలాలు అందజేసి ప్రసన్నం చేసుకుంటున్నారు. కళేబరాలను మాంసం రూపంలో పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్నారు. తెలిసిన వారికే విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
కేసులు నామమాత్రమే..
వన్యప్రాణుల వేటపై అటవీ అధికారుల నిఘా కొరవడింది. ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో సువిశాలమైన అటవీ ప్రాంతం పర్యవేక్షణకు సిబ్బంది కొరత ఉంది. మరోవైపు కొందరు చేతివాటం ప్రదర్శిస్తుండటంతో వన్యప్రాణులు బలవుతున్నాయి. గతేడాది అంతరాబ పరిధిలో ట్రాపింగ్కు వినియోగించే ఉచ్చులను అటవీ శాఖ యంత్రాంగం గుర్తించింది. పదేళ్లలో యాదృచ్ఛికంగా పట్టుబడిన కేసుల నమోదు తప్ప ప్రత్యేకంగా నిఘా ఉంచి దాడులు చేసిన సందర్భాలు కానరావడం లేదు. 2013, 2015, 2016, 2023లో సారవకోట, పాతపట్నం, మెళియాపుట్టి మండలాల పరిధిలో అధికారిక గణాంకాల ప్రకారం ఏడు కేసులు నమోదయ్యాయి.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: నిషేధిత అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులను వేటాడటం నేరం. నిబంధనలు ఉల్లంఘిస్తే అటవీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం. క్షేత్రస్థాయిలో పకడ్బందీగా నిఘా ఉంచాం.
ఆర్.రాజశేఖర్, ప్రాంతీయాధికారి, అటవీ శాఖ, పాతపట్నం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
[ 27-04-2024]
‘పల్లెల్లో అందరూ కలిసి ముందడుగు వేయండి. ఒకే మాటపై నిలబడండి. స్థానిక సంస్థల ఎన్నికలు ఏకగ్రీవం చేసుకుంటే ప్రోత్సాహక నిధులు మంజూరు చేస్తాం’ అని వైకాపా ప్రభుత్వం మూడేళ్ల కిందట పంచాయతీ ఎన్నికల సమయంలో ప్రకటించింది. -
95 ఆమోదం.. 28 తిరస్కరణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లావ్యాప్తంగా దాఖలైన నామపత్రాల పరిశీలన శుక్రవారం జరిగింది. 8 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానాలకు సంబంధించి వచ్చిన నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల పరిశీలకులు, అభ్యర్థుల సమక్షంలో పరిశీలించారు. -
వైకాపా అభ్యర్థుల నామపత్రాలపై అభ్యంతరాలు
[ 27-04-2024]
-
కలమట బాధ్యతల స్వీకరణ
[ 27-04-2024]
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. -
ఓటర్లు 18,75,934 మంది
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఓటర్ల కొత్త జాబితా ఖరారైంది. ఈ నెల 15 నాటికి నమోదైనవారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. -
మృత్యువులోనూ వీడని బంధం!
[ 27-04-2024]
వారిద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు. పిల్లల్ని పెంచి పెద్ద చేసి.. పెళ్లిళ్లు కూడా జరిపించారు. -
దశాబ్దాల వ్యధ.. శంకుస్థాపనకే పరిమితమైన కథ..!
[ 27-04-2024]
మూడు వైపులా మహేంద్రతనయ నది నీరు, మరో వైపు పంట పొలాలు. గ్రామం నుంచి బయటకు రావాలంటే నాటు పడవే శరణ్యం ఇదీ హిరమండలంలోని జిల్లేడుపేట గ్రామస్థుల పరిస్థితి. -
చుక్కలు చూపిస్తున్నారు
[ 27-04-2024]
పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలోని కొండి, పూజారి వీధులకు బోరు నీరే తాగు నీరు. బోరు వేసే సమయంలో 100 అడుగులు మాత్రమే తవ్వి వదిలేయడంతో క్రమేపీ నీటి లభ్యత తగ్గిపోయింది. -
ఇది మీ పాలనకు మచ్చు తునక
[ 27-04-2024]
వైకాపా పాలనలో రోడ్లు ఎలాంటి దీన స్థితిలో ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఇచ్ఛాపురంలోని పలు గ్రామాల్లోని రోడ్లు ఛిద్రమై వాహనదారులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. -
నగరమంతా.. ట్రాఫిక్ తంటా
[ 27-04-2024]
రోజురోజుకు పెరుగుతున్న జనాభా దృష్ట్యా నగరంలో నిత్యం ట్రాఫిక్ సవస్యలు అధికమవుతున్నాయి. డేఅండ్నైట్, రామలక్ష్మణ, సూర్యమహల్, అరసవల్లి మిల్లు, పొట్టిశ్రీరాములు, ఏడురోడ్ల కూడళ్లలో వాహనాల రద్దీతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
అరాచక పాలనకు చరమగీతం పాడాలి
[ 27-04-2024]
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని భాజపా ఎచ్చెర్ల ఎమ్మెల్యే అభ్యర్థి నడుకుదటి ఈశ్వరరావు అన్నారు. -
కూటమి విజయం ఖాయం
[ 27-04-2024]
కొద్ది రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి అఖండ విజయం ఖాయమని తెదేపా ఆమదాలవలస ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్ ధీమా వ్యక్తం చేశారు. -
జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాం
[ 27-04-2024]
అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకరరావు పేర్కొన్నారు. -
వచ్చే ఎన్నికల్లో కూటమి విజయం ఖాయం
[ 27-04-2024]
వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని ఎంపీ రామ్మోహన్నాయుడు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం