ఐదేళ్లయినా దారికి రాని విస్తరణ..!
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2022 నవంబరు 23న నరసన్నపేట పర్యటనలో ప్రధాన రహదారి అభివృద్ధికి రూ.10 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినా ఇంతవరకు స్పందన లేకపోవడం గమనార్హం.
నిధులు లేక నిలిచిన పనులు
నెరవేరని ముఖ్యమంత్రి హామీ
ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో విస్తరణకు నోచుకోని వైనం
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2022 నవంబరు 23న నరసన్నపేట పర్యటనలో ప్రధాన రహదారి అభివృద్ధికి రూ.10 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినా ఇంతవరకు స్పందన లేకపోవడం గమనార్హం.
న్యూస్టుడే, నరసన్నపేట: నరసన్నపేట పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణకు ఐదేళ్లుగా గ్రహణం వీడడం లేదు. పాలకుల నిర్లక్ష్యంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. 3 కి.మీ. ర.భ. రహదారిని అభివృద్ధి చేసేందుకు నిధుల లేమి వెంటాడుతోంది. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిని విస్తరించక పోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వాహనదారులు వాపోతున్నారు. 2020లో రాష్ట్ర ప్రభుత్వం నరసన్నపేట ప్రధాన రహదారి విస్తరణకు ఆమోదం తెలపగా, అదే ఏడాది అప్పటి ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పనులను ప్రారంభించినా నేటికీ కొలిక్కి రాలేదు.
అరకొర పనులు
నరసన్నపేట సమీపంలోని సత్యవరం కూడలి నుంచి జమ్ము కూడలి వరకు పాత జాతీయ రహదారి 2.8 కి.మీ. కాగా, ర.భ శాఖ ఈ రహదారిని నిర్వహిస్తోంది. 2021 జూలై 9న ఈ మార్గం విస్తరణకు ప్రణాళికలు రూపొందించారు. అప్పటి వరకు అందుబాటులో ఉన్న నిధులు కేవలం రూ.4.5కోట్లు. దీంతో స్థానిక పోలాకి కూడలి నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు 1.1 కి.మీ. పొడవునా 80 అడుగుల రహదారిగా విస్తరించారు. అటు ఇటు విడిచిపెట్టి మధ్యలో ప్రారంభమైన ఈ పనులు 2022 డిసెంబరు నాటికి పూర్తయ్యాయి. ఇక ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి సత్యవరం కూడలి వరకు, మరోవైపున పోలాకి కూడలి నుంచి జమ్ము కూడలి వరకు పనులు చేయాల్సి ఉంది. 1.7కి.మీ. మేర రహదారిని విస్తరించాలి. దీనికి మరో రూ.11 కోట్లు అవసరమని ఇంజనీరింగ్ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. మూడేళ్ల క్రితమే జమ్ము కూడలి నుంచి పెద్దపేట వరకు రహదారికి రెండు వైపులా ఉన్న భవనాలను కూల్చివేశారు. తీరా రహదారి నిర్మాణం మాత్రం పూర్తి చేయలేదు. కేవలం పట్టణం నడిబొడ్డున మాత్రమే పనులు చేసి చేతులు దులుపుకొన్నారని పలువురు పెదవి విరుస్తున్నారు. మిగిలిన పనులకు ఎప్పుడు మోక్షం కలుగుతుందోనని ఎదురు చూస్తున్నారు.
హడావుడి తప్ప ఆచరణ లేదు
నాలుగేళ్ల క్రితం ప్రధాన రహదారి విస్తరణకు వైకాపా ప్రభుత్వం హడావుడి చేసి పలు భవనాలను కూల్చివేసింది. తీరా రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయింది. కేవలం కొద్ది దూరం మాత్రమే విస్తరించి చేతులు దులుపుకొంది. ఈ పనులకు ఇప్పట్లో మోక్షం లభించేలా లేదు.
- బోయిన సతీష్, లచ్చుమన్నపేట
మాట తప్పిన ముఖ్యమంత్రి
నరసన్నపేట ప్రధాన రహదారి విస్తరణకు ముఖ్యమంత్రి జగన్ నరసన్నపేట వచ్చి మరీ రూ.10 కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఒక్క రూపాయి విడుదల చేయలేదు. విస్తరణకు నోచుకోక పోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
- తాళాభక్తుల గోవిందరావు, ఆదివారపుపేట
ప్రభుత్వానికి నివేదించాం
నరసన్నపేట ప్రధాన రహదారి విస్తరణకు రూ.11కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నిధులు విడుదల కాలేదు. మంజూరైన వెంటనే పనులు పూర్తి చేసి ప్రజల ఇబ్బందులు తీరుస్తాం.
- రాజశేఖర్, ఏఈ, ర.భ.శాఖ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేవునల్తాడలో ఉద్రిక్తత!
[ 02-05-2024]
మంత్రి సీదిరి అప్పలరాజు స్వగ్రామం వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడలో బుధవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెదేపా ఎంపీ, పలాస ఎమ్మెల్యే అభ్యర్థులు కె.రామ్మోహన్నాయుడు, గౌతు శిరీష గ్రామంలో ప్రచారం చేశారు. -
దారుణం..!
[ 02-05-2024]
భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.. తల్లి మానసిక స్థితి బాలేదు.. తనకేమైనా అయితే బిడ్డ పరిస్థితి ఏమవుతుందోనని ఆ తండ్రి మనస్తాపం చెందాడు. -
సారథులు.. ‘సేతు’లెత్తేశారు..!
[ 02-05-2024]
వారంతా అధికార పార్టీ నాయకులు..ఐదేళ్ల పాటు కనీసం వారధులు కూడా నిర్మించలేకపోయిన సారథులు..గత ఎన్నికల్లో ఓట్లేయండి..మీ కష్టాలు తీర్చుతామంటూ ఊరూరా తిరిగి ఊదరగొట్టారు..అందలమెక్కి హామీల ఊసే మరిచారు..కాలం కరిగింది తప్ప వారి మనసు కరగలేదు. -
జగన్ మద్యం.. జీవితాలు ఛిద్రం..!
[ 02-05-2024]
జగనన్న మాటలు నమ్మి అక్కచెల్లెమ్మలు దగాపడ్డారు. మద్య నిషేధం అమలు చేస్తామన్న జగన్ ఆ ఊసే మరిచిపోయారు. అధికారంలోకి రాగానే వైకాపా ప్రభుత్వమే అమ్మకాలు మొదలు పెట్టింది. -
అవ్వాతాతలకు పింఛను పాట్లు
[ 02-05-2024]
జిల్లాలో అవ్వాతాతలకు పింఛను నగదు కోసం పాట్లు తప్పట్లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మొత్తం 3,20,886 మంది లబ్ధిదారుల్లో 2,42,957 మందికి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామని అధికారులు ప్రకటించారు. -
త్వరలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు
[ 02-05-2024]
పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం 17వ వార్డులో తెదేపా ఆధ్వర్యంలో, మే డే వేడుకలు, ఎన్నికల ప్రచారం జరిగింది. -
దళితద్రోహి జగన్ను ఓడించండి
[ 02-05-2024]
దళితులకు చెందిన 27 పథకాలను రద్దుచేసిన దళితద్రోహి జగన్ను రానున్న ఎన్నికల్లో ఓడించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. -
రాత్రి 10 తర్వాత మంత్రి అప్పలరాజు ప్రచారం!
[ 02-05-2024]
మందస మండలం రాంపురం పంచాయతీ బిడిమిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేశారు -
ఇది జగనన్నఆడిన వికృత క్రీడ..!
[ 02-05-2024]
భారతదేశ కీర్తిని ప్రపంచానికి పరిచయం చేసిన కలియుగ భీముడు కోడిరామ్మూర్తి పేరుతో శ్రీకాకుళం నగరంలో నిర్మించిన మైదానంలో తర్ఫీదు పొంది దేశానికి ప్రథమంగా ఒలింపిక్ పతకం సాధించిన కరణం మల్లేశ్వరి, అంతర్జాతీయ, జాతీయ పతకాలు సాధించిన పూజారి శైలజ, నీలంశెట్టి లక్ష్మి, విక్రాంత్ వంటి మేటి క్రీడాకారులు వందలకొద్దీ వెలుగులోకి వచ్చారు -
ఉపాధికి సమాధి
[ 02-05-2024]
గ్రామీణ ప్రాంతాల్లో వలసలు అరికట్టి, ప్రతి కుటుంబానికి వంద రోజుల పని చూపాలని ప్రారంభించిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమల్లో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడడంతో వంద రోజుల పని కొందరికే దక్కుతోంది
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్