ద్విచక్ర వాహనం నుంచి జారిపడి మహిళ మృత్యువాత
మండలంలోని పెంటూరు గ్రామానికి చెందిన కూర్మాపు సరోజినీ (48) ద్విచక్ర వాహనం పైనుంచి జారిపడి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
కూర్మాపు సరోజినీ (పాత చిత్రం)
నందిగాం, న్యూస్టుడే: మండలంలోని పెంటూరు గ్రామానికి చెందిన కూర్మాపు సరోజినీ (48) ద్విచక్ర వాహనం పైనుంచి జారిపడి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె కుమారుడు రమేష్కు ఈనెల 24న వివాహం జరగనుంది. పెండ్లి సామగ్రి కొనుగోలు చేయడానికి శుక్రవారం కుమారుడితో కలిసి పలాసకు ద్విచక్ర వాహనంపై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కొత్తఅగ్రహారం వద్దకు వచ్చేసరికి వాహనంపై నుంచి జారిపడింది. తలకు బలమైన గాయం కావడం వల్ల విపరీతమైన రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే దుర్మరణం చెందింది. శవ పంచనామా నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. సరోజినీ సోదరుడు వసంతరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై మహమ్మద్ అమీర్ ఆలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఫార్మా పరిశ్రమలో ప్రమాదం
నలుగురికి గాయాలు
రణస్థలం, న్యూస్టుడే: ప్రారంభానికి సిద్ధంగా ఉన్న శ్రేయాస్ ఫార్మా పరిశ్రమలో శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదం జరిగి నలుగురికి గాయాలయ్యాయి. పోలీసులు కథనం మేరకు.. పరిశ్రమలో ట్రయల్ రన్ వేస్తుండగా బొగ్గు నుంచి పౌడరు తీసే బ్రాయిలరు వద్ద ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగడంతో కంచిలికి చెందిన జానకి ప్రధాన్, మద్ది దాలయ్య, ఝార్ఖండ్కు చెందిన నకుల్కుమార్పాల్, విశాఖకు చెందిన మణికంటస్వామికి గాయాలయ్యాయి. వీరిని పరిశ్రమ యాజమాన్యం విశాఖలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తుంది. శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోవిందరావు తెలిపారు.
30 మేకల అపహరణ
సారవకోట, న్యూస్టుడే: మండలంలోని జమచక్రం పంచాయతీ రామచంద్రాపురం గ్రామంలో దండుపాటి సింహాచలంనకు చెందిన 30 మేకలు అపహరణకు గురయ్యాయి. వాటిని పెంచుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఈయన ఎప్పటి మాదిరిగా తన ఇంటికి సమీపంలో ఉన్న శాలలో గురువారం రాత్రి వాటిని ఉంచారు. శుక్రవారం ఉదయం లేచి చూసేసరికి ఒక్క మేక కూడా శాలలో లేదు. సాలకు ఉన్న తలుపు తీసి ఉండటంతో బయటకు వెళ్లిపోయి ఉంటాయని భావించి స్థానిక, పరిసర గ్రామాల్లో వెదికినప్పటికీ ఫలితం లేకపోయింది. రూ.5 లక్షల విలువ గల మేకలను దొంగలు ఎత్తుకుపోయారని గుర్తించి లబోదిబోమన్నారు. సారవకోటలోని పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని సర్పంచి మెండ సంధ్యకు, పెద్దలకు తెలియజేశారు. పోలీసులు రామచంద్రాపురం గ్రామానికి వెళ్లి పరిశీలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేవునల్తాడలో ఉద్రిక్తత!
[ 02-05-2024]
మంత్రి సీదిరి అప్పలరాజు స్వగ్రామం వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడలో బుధవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెదేపా ఎంపీ, పలాస ఎమ్మెల్యే అభ్యర్థులు కె.రామ్మోహన్నాయుడు, గౌతు శిరీష గ్రామంలో ప్రచారం చేశారు. -
దారుణం..!
[ 02-05-2024]
భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.. తల్లి మానసిక స్థితి బాలేదు.. తనకేమైనా అయితే బిడ్డ పరిస్థితి ఏమవుతుందోనని ఆ తండ్రి మనస్తాపం చెందాడు. -
సారథులు.. ‘సేతు’లెత్తేశారు..!
[ 02-05-2024]
వారంతా అధికార పార్టీ నాయకులు..ఐదేళ్ల పాటు కనీసం వారధులు కూడా నిర్మించలేకపోయిన సారథులు..గత ఎన్నికల్లో ఓట్లేయండి..మీ కష్టాలు తీర్చుతామంటూ ఊరూరా తిరిగి ఊదరగొట్టారు..అందలమెక్కి హామీల ఊసే మరిచారు..కాలం కరిగింది తప్ప వారి మనసు కరగలేదు. -
జగన్ మద్యం.. జీవితాలు ఛిద్రం..!
[ 02-05-2024]
జగనన్న మాటలు నమ్మి అక్కచెల్లెమ్మలు దగాపడ్డారు. మద్య నిషేధం అమలు చేస్తామన్న జగన్ ఆ ఊసే మరిచిపోయారు. అధికారంలోకి రాగానే వైకాపా ప్రభుత్వమే అమ్మకాలు మొదలు పెట్టింది. -
అవ్వాతాతలకు పింఛను పాట్లు
[ 02-05-2024]
జిల్లాలో అవ్వాతాతలకు పింఛను నగదు కోసం పాట్లు తప్పట్లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మొత్తం 3,20,886 మంది లబ్ధిదారుల్లో 2,42,957 మందికి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామని అధికారులు ప్రకటించారు. -
త్వరలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు
[ 02-05-2024]
పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం 17వ వార్డులో తెదేపా ఆధ్వర్యంలో, మే డే వేడుకలు, ఎన్నికల ప్రచారం జరిగింది. -
దళితద్రోహి జగన్ను ఓడించండి
[ 02-05-2024]
దళితులకు చెందిన 27 పథకాలను రద్దుచేసిన దళితద్రోహి జగన్ను రానున్న ఎన్నికల్లో ఓడించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. -
రాత్రి 10 తర్వాత మంత్రి అప్పలరాజు ప్రచారం!
[ 02-05-2024]
మందస మండలం రాంపురం పంచాయతీ బిడిమిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేశారు -
ఇది జగనన్నఆడిన వికృత క్రీడ..!
[ 02-05-2024]
భారతదేశ కీర్తిని ప్రపంచానికి పరిచయం చేసిన కలియుగ భీముడు కోడిరామ్మూర్తి పేరుతో శ్రీకాకుళం నగరంలో నిర్మించిన మైదానంలో తర్ఫీదు పొంది దేశానికి ప్రథమంగా ఒలింపిక్ పతకం సాధించిన కరణం మల్లేశ్వరి, అంతర్జాతీయ, జాతీయ పతకాలు సాధించిన పూజారి శైలజ, నీలంశెట్టి లక్ష్మి, విక్రాంత్ వంటి మేటి క్రీడాకారులు వందలకొద్దీ వెలుగులోకి వచ్చారు -
ఉపాధికి సమాధి
[ 02-05-2024]
గ్రామీణ ప్రాంతాల్లో వలసలు అరికట్టి, ప్రతి కుటుంబానికి వంద రోజుల పని చూపాలని ప్రారంభించిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమల్లో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడడంతో వంద రోజుల పని కొందరికే దక్కుతోంది
తాజా వార్తలు (Latest News)
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
-
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
-
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్