అన్న వచ్చాడుఅవస్థలు తెచ్చాడు..!
టెక్కలిలో నిర్వహించిన సీఎం మేమంతా సిద్ధం సభ జన సమీకరణకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మేమంతా సిద్ధం సభకు బస్సులు కేటాయించడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు
శ్రీకాకుళంలో బస్సు వెనుక పరుగు తీస్తూ..
టెక్కలిలో నిర్వహించిన సీఎం మేమంతా సిద్ధం సభ జన సమీకరణకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విశాఖ నుంచి 360, విజయనగరం 115, శ్రీకాకుళం నుంచి 190 బస్సులను అధికారులు సభకు కేటాయించారు. దీంతో శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, పలాస, పాతపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ల్లో అరకొరగా ఉన్న బస్సుల కోసం ప్రయాణికులు గంటల
తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ఉక్కపోతతో అవస్థలు పడ్డారు. వేరే దారిలేక ప్రైవేటు వాహనాల్లో కిక్కిరిసి ప్రయాణం చేయాల్సి వచ్చిందని పలువురు వాపోయారు. - న్యూస్టుడే, అరసవల్లి, ఆమదాలవలస గ్రామీణం, కొత్తూరు, పలాస, మందస, నరసన్నపేట
పలాసలో పల్లెవెలుగుకే ఎక్స్ప్రెస్గా బోర్డు మార్చిన వైనం
ప్రజలతో ఆడుకుంటున్నారు
ముఖ్యమంత్రి జగన్కు ప్రజల అవసరాలు పట్టడం లేదు. ఎన్నికల వేళ తన ప్రచార సభలకు జనాన్ని తరలించడానికి ఆర్టీసీ బస్సులు వినియోగించడం సరికాదు. బస్సులు లేక ఎండలో ప్రయాణికులు పడిన బాధలు వర్ణనాతీతం. ఇలాంటి సీఎం దేశంలో ఎక్కడా లేరు. నియంతలా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారు.
ఎం.విక్రం, భిన్నల, మందస మండలం
శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్లో బస్సుల కోసం నిరీక్షిస్తూ..
ఎండలో వేచి చూడాల్సి వచ్చింది
ఆమదాలవలస నుంచి మా గ్రామానికి వెళ్లేందుకు బస్సులు లేక పోవడంతో ఎండలో వేచి చూసి తీవ్ర ఇబ్బందులు పడ్డాం. బస్సులు సీఎం సభకు వేశారని చెబుతున్నారు. ఆమదాలవలస రైల్వేస్టేషన్ నుంచి వైఎస్సార్ కూడలి వరకు నడుచుకొని వెళ్లి అక్కడ నుంచి మా గ్రామానికి ఆటోలో వెళ్లాల్సి వచ్చింది.
నారాయణమ్మ, సింగన్నపాలేం, ఆమదాలవలస మండలం
ఒక్క బస్సు లేదు
ఆమదాలవలస నుంచి మా గ్రామానికి బస్సులు లేకపోవడంతో అవస్థలు ఎదుర్కొన్నాం. వేరే దారిలేక ఆటోలకు అధిక ఛార్జీలు చెల్లించి ప్రయాణం చేయాల్సి వచ్చింది. నాయకుల సమావేశాలకు బస్సులు వేస్తే ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలి. కనీసం దాని గురించి పట్టించుకోక పోవడం బాధాకరం.
ఆదెయ్య, బూర్జ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పండుటాకుల ప్రాణాలతో జగన్నాటకం..!
[ 04-05-2024]
ప్రభుత్వం ఆడిన జగన్నాటానికి పండుటాకులు నరకం చూస్తున్నారు. పింఛను డబ్బులు చేతికి అందించే అవకాశమున్నా పట్టించుకోకుండా వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. జిల్లాలో శుక్రవారం సైతం మండుటెండలో బ్యాంకుల వద్ద వృద్ధులు పడిగాపులు కాశారు. -
9 న నరసన్నపేటలో ప్రజాగళం
[ 04-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఈ నెల 9న జిల్లాకు రానున్నారు. -
ప్రశ్నించే గొంతులపై ‘రాక్షస క్రీడ’..!
[ 04-05-2024]
జగన్ పాలనలో అన్యాయంపై నోరెత్తకూడదు. నిరసన ప్రదర్శించినా, సమస్యను పరిష్కరించమని అడిగినా నేరమే. ప్రభుత్వ వ్యతిరేకతను తెలిపేందుకు ఆందోళన చేసినా వారిపై కేసులు పెట్టించారు. -
ఎన్నికల నిర్వహణకు సంసిద్ధంగా ఉన్నాం
[ 04-05-2024]
శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ఎన్నికల పరిశీలకులు శేఖర్ విద్యార్థి తెలిపారు. కేంద్ర డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితీష్ కుమార్ వ్యాస్ శుక్రవారం ఎన్నికల పరిశీలకులు, కలెక్టర్లు, ఎస్పీలతో దూరదృశ్య సమావేశం నిర్వహించారు. -
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
[ 04-05-2024]
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులతో పాటు ఇతర సిబ్బంది ఓటు వినియోగించుకునేందుకు సమయం ఆసన్నమైంది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం వారందరికీ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు అవకాశం కల్పించారు. -
సికింద్రాబాద్ నుంచి బ్రహ్మపురకు ప్రత్యేక రైలు
[ 04-05-2024]
వేసవి రద్దీని నివారించేందుకు బ్రహ్మపుర నుంచి సికింద్రాబాద్కు ప్రత్యేక రైలును నడపనున్నారు. -
పరిశోధన విభాగం బలోపేతానికి చర్యలు
[ 04-05-2024]
డా.బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో అకడమిక్ అంశాలతో పాటు పరిశోధన విభాగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వర్సిటీ ఉపకులపతి ఆచార్య కె.ఆర్.రజని అన్నారు. -
బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 04-05-2024]
జిల్లాలోని వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన ఐదు నుంచి 18 ఏళ్ల లోపు వయసు కలిగిన బాలలకు కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. -
సంక్షేమం, అభివృద్ధితో కూటమి పాలన
[ 04-05-2024]
‘వైకాపా అస్తవ్యస్త పాలనతో రాష్ట్రంలో ఉపాధి దొరక్క యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. కొత్త పరిశ్రమలు రాకపోవడంతో అవకాశాలు సన్నగిల్లాయి. ప్రతిఒక్కరిపై పన్నుల భారం పడింది. -
వైకాపా నుంచి తెదేపాలో చేరికలు
[ 04-05-2024]
వైకాపా నుంచి తెదేపాలోకి చేరికల జోరు కొనసాగుతోంది. కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, నందిగాం మండలాలకు చెందిన 150 వైకాపా కుటుంబాల వారు తెదేపాలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జగనాసురుడి పన్నాగం.. పండుటాకుల విలాపం
-
పార్కింగ్ గొడవ.. కక్షగట్టి ఏడాది తర్వాత హత్య
-
మంత్రి రోజాను అడ్డుకున్న వేమాపురం వాసులు
-
ఎన్నిక, తీర్పు రెండూ సంచలనమే.. భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ భవిష్యత్తు ప్రశ్నార్థకం!