logo

వైకాపా నుంచి తెదేపాలో చేరికలు

వైకాపా నుంచి తెదేపాలోకి చేరికల జోరు కొనసాగుతోంది. కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, నందిగాం మండలాలకు చెందిన  150 వైకాపా కుటుంబాల వారు తెదేపాలో చేరారు.

Published : 04 May 2024 05:40 IST

కోటబొమ్మాళి: తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో చేరిన కురుడు వైకాపా కార్యకర్తలు  తదితరులు

కోటబొమ్మాళి, పోలాకి, న్యూస్‌టుడే: వైకాపా నుంచి తెదేపాలోకి చేరికల జోరు కొనసాగుతోంది. కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, నందిగాం మండలాలకు చెందిన  150 వైకాపా కుటుంబాల వారు తెదేపాలో చేరారు. కోటబొమ్మాళి మండలం కురుడుకు చెందిన నాయకులతో పాటు ఏభై కుటుంబాలు , సంతబొమ్మాళి మండలం కోటపాడు నాయకులు, యువకులు, సంతబొమ్మాళికి చెందిన ఏభై మత్స్యకార కుటుంబాలు, ఇజ్జవరం పంచాయతీ నాయకులతో పాటు మరో ఇరవై కుటుంబాలు తెదేపాలో చేరాయి. నందిగాం మండలం హర్షబాడ పంచాయతీ సవరరామకృష్ణాపురానికి చెందిన నాయకులు, యువకులు కూడా చేరారు.  బీ పోలాకి మండల పరిధిలోని మబుగాం గ్రామంలో తెదేపా అభ్యర్థి బగ్గు రమణమూర్తి స్వగృహంలో పోలాకి పంచాయతీ నరసాపురం వార్డు సభ్యులు సనపల నారాయణరావు, సీనియర్‌ వైకాపా  కార్యకర్త మెట్ట తిరుమలరావుల ఆధ్వర్యంలో పలువురు సభ్యులు తెదేపాలో చేరారు. వీరికి బగ్గు రమణమూర్తి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని