ఉప్పుగెడ్డపై వంతెన.. ఉత్తమాటేనా?
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెదేపా హయాంలో ప్రారంభించిన పనులను ఎలాగో గాలికొదిలేసింది. కనీసం వారి పాలనలో చేపట్టిన పనులను సైతం పూర్తి చేయలేకపోయారు.
మూడేళ్లుగా ముందుకు సాగని పనులు
శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు (పాతచిత్రం)
న్యూస్టుడే, గార: వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెదేపా హయాంలో ప్రారంభించిన పనులను ఎలాగో గాలికొదిలేసింది. కనీసం వారి పాలనలో చేపట్టిన పనులను సైతం పూర్తి చేయలేకపోయారు. బిల్లుల చెల్లింపులో జరుగుతున్న జాప్యం కారణంగా.. ప్రభుత్వంపై విశ్వసనీయత లేక గుత్తేదారులు పనులు చేపట్టేందుకు ఆసక్తి కనబరచడం లేదు. ఫలితంగా చాలా చోట్ల ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. అందుకు ఉదాహరణే గార మండలంలో ఉప్పుగెడ్డ వంతెన నిర్మాణ పనులు. మొదలుపెట్టి మూడేళ్లయినా కనీసం పునాదుల స్థాయి కూడా దాటలేదు.
గార మండలం బలరాంపురం, శ్రీకూర్మం పంచాయతీ పడపానపేట గ్రామాల మధ్య ఉన్న ఉప్పుగెడ్డపై వంతెన నిర్మించాలని నిర్ణయించారు. వంతెన, రహదారి నిర్మాణానికి నేషనల్ సెంటర్ ఫర్ సస్టయినబుల్ ఆక్వాకల్చర్, సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ (ఎంపీఈడీఏ) ఆర్థిక సహకారంతో సుమారు రూ.4 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఆ మేరకు 2021 డిసెంబరులో మంత్రి అప్పలరాజు, అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆర్భాటంగా పనులు ప్రారంభానికి భూమిపూజ చేశారు. శిలఫలకాన్ని సైతం ఆవిష్కరించారు. వంతెన పూర్తయితే సముద్ర తీర గ్రామాలకు రవాణా సదుపాయం మెరుగవుతుందని, జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు దూరం తగ్గుతుందని స్థానికులు, రొయ్యల వ్యాపారులు ఆశపడ్డారు. కానీ ఇప్పటికీ నెరవేరకుండానే పోయింది..
కొలిక్కిరాని స్థల సేకరణ..
శ్రీకూర్మం పంచాయతీ పడపానపేట గ్రామం నుంచి గెడ్డ వరకు 1,744 మీటర్లు మేర మట్టిదారి నిర్మించారు. వంతెనకు మరో వైపు బలరాంపురం ప్రధాన రహదారి వరకు మరో రెండున్నర కి.మీ. రోడ్డు వేసేందుకు భూ సర్వే చేశారు. దానికి స్థానిక రైతులు అభ్యంతరాలు తెలిపారు. అక్కడి నుంచి ప్రక్రియ ముందుకు సాగలేదు. స్థల సేకరణపై స్పష్టత రాకపోవడంతో పనులు ప్రారంభించి మూడేళ్లవుతున్నా.. ఇంకా పునాదులు స్థాయిలోనే ఉండిపోయాయి. ప్రభుత్వ కాలపరిమితి పూర్తయినా వంతెన నిర్మించకపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చేతిలో అధికారం.. చేసేదంతా అ‘ధర్మం’..!
[ 11-05-2024]
ఆయనో రాజకీయ దురంధరుడు. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్నని, తన మాటలతో ఎంతటి వారినైనా అలవోకగా నమ్మించేస్తారు. -
ఉద్యోగాలేవీ.. ఉపాధి ఉసేది జగన్?
[ 11-05-2024]
గత సార్వత్రిక ఎన్నికల ముందు ప్రత్యేక హోదా అన్నారు.. స్థానిక ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకేనని డప్పుకొట్టారు.. ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటన.. ఇలా.. యువతకు చెప్పనిది లేదు. -
పర్యాటకాన్ని మడతపెట్టేశారు..!
[ 11-05-2024]
జిల్లాలో సహజసిద్ధ పర్యాటక సొబగులు ఎన్నో ఉన్నాయి.. వాటిని పర్యాటకులకు అనుకూలంగా అభివృద్ధి చేస్తే జిల్లాలో ఈ రంగానికి ఎంతో ఆదరణ లభిస్తుంది. -
పేరుతో కిరణం.. ప్రగతిలో అంధకారం..!
[ 11-05-2024]
గత ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని హామీలు గుప్పించారు. ఆయన అధికారంలోకి వస్తే నియోజకవర్గ రూపురేఖలు మారతాయని నమ్మిన ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. -
ప్రచారానికి నేటితో తెర
[ 11-05-2024]
ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడుతోంది. మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనుంది. -
సభాపతికి నిరసన సెగ
[ 11-05-2024]
శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాంకు సొంత ఇలాకాలో నిరసన సెగ తగిలింది. -
ఎమ్మెల్యే కవ్వింపు చర్యలకు పాల్పడటం సరికాదు
[ 11-05-2024]
నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, భాజపా శ్రేణులను ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అహంకార పూరితంగా వ్యవహరిస్తూ బెదిరింపులకు దిగుతున్నారని తెదేపా పార్లమెంట్ నియోజకవర్గ కోశాధికారి పిసిని జగన్నాథం ఆరోపించారు. -
మట్టి రోడ్లే గతి.. పడకేసిన ప్రగతి
[ 11-05-2024]
ఇచ్ఛాపురం పురపాలక సంఘంలో శివారు ప్రాంతాలతో పాటుగా కాలనీల్లో శాశ్వత రహదారులు లేకపోవడంతో ఆయా ప్రాంతాల వాసులు ఇక్కట్లు పడాల్సి వస్తోంది. -
మహిళా సంక్షేమం.. తెదేపా ధ్యేయం
[ 11-05-2024]
స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలతోపాటు ప్రత్యేక పథకాల ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే తెదేపా ధ్యేయమని పలాస, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అభ్యర్థులు గౌతు శిరీష, అశోక్ అన్నారు. -
ప్రముఖుల చేరిక
[ 11-05-2024]
ఇచ్ఛాపురం పురపాలకసంఘం 23వ వార్డు మాజీ కౌన్సిలర్ బాసి పార్వతీశం, దోనీ రాజు, మరికొంత మంది ముఖ్యనాయకులు, కార్యకర్తలతో తెదేపాలో చేరారు. -
ఓటర్లకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి
[ 11-05-2024]
పోలింగ్ సమయంలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని తహసీల్దారు ఎం.సురేష్ అన్నారు. -
మిత్రుడి కుటుంబానికి ఆపన్న హస్తం
[ 11-05-2024]
మండలం పరిధి ధర్మపురం గ్రామానికి చెందిన ఉప్పాడ సోమేష్ పోలాండ్లో పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతిచెందారు. -
ఐటీఐల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 11-05-2024]
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రవేశాల జిల్లా కన్వీనర్, ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రధానాచార్యులు ఎల్.సుధాకరరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు