logo

నలుగురి జీవితాల్లో వెలుగు నింపిన వైద్యుడు

గుండెపోటుతో మృతి చెందిన డాక్టరు అందించిన కళ్లతో నలుగురికి చూపు లభించింది. పొళ్లాచ్చి వెంకటరమణవీధికి చెందిన అన్నాడిఎంకే నాయకుడు పళనికుమార్‌ కుమారుడు బాలాజీ రష్యాలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసి ఇండియాలో ఎఫ్‌ఎంజీఈ పరీక్షలు రాసి డాక్టరు డిగ్రీ పొందాడు.

Published : 05 Feb 2023 00:58 IST

బాలాజీ (పాత చిత్రం)

రెడ్‌హిల్స్‌, న్యూస్‌టుడే: గుండెపోటుతో మృతి చెందిన డాక్టరు అందించిన కళ్లతో నలుగురికి చూపు లభించింది. పొళ్లాచ్చి వెంకటరమణవీధికి చెందిన అన్నాడిఎంకే నాయకుడు పళనికుమార్‌ కుమారుడు బాలాజీ రష్యాలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసి ఇండియాలో ఎఫ్‌ఎంజీఈ పరీక్షలు రాసి డాక్టరు డిగ్రీ పొందాడు. అతనితో రష్యాలో చదివిన చెన్నైకి చెందిన దిలీప్‌ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. జనవరి 26న చెన్నైలో జరిగిన కర్మక్రియల్లో పాల్గొనేందుకు సాలిగ్రామం చేరుకున్న బాలాజీ గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. దీంతో బాలాజీ కళ్లను కుటుంబీకులు చెన్నైలోని శంకర నేత్రాలయ ఆసుపత్రికి దానం చేశారు. కళ్లలోని నలుపు, తెలుపు భాగాలను ఆసుపత్రి డాక్టర్లు నలుగురికి శనివారం అమర్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని