చెన్నై - తడ జాతీయ రహదారి పనులు వేగవంతం
చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిలా తడ వరకు ఆరు వరుసల జాతీయ రహదారి నిర్మితమవుతోంది. పనులు 95.75 శాతం మేరకు పూర్తయ్యాయి. ఇంకా 1.4 కిలోమీటర్ల దూరానికి జరగాల్సిన పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి.
వచ్చే ఏడాది జనవరి నాటికి పూర్తి
న్యూస్టుడే, వడపళని
చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిలా తడ వరకు ఆరు వరుసల జాతీయ రహదారి నిర్మితమవుతోంది. పనులు 95.75 శాతం మేరకు పూర్తయ్యాయి. ఇంకా 1.4 కిలోమీటర్ల దూరానికి జరగాల్సిన పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. పైవంతెన కింద నుంచి తేలికపాటి వాహనాలు వెళ్లేందుకు అండర్పాస్, పాదచారులు నడిచేందుకు ప్రత్యేక మార్గం నిర్మాణం జరగాల్సి ఉందని జాతీయ రహదారుల విభాగం పేర్కొంది.
పెరిగిన నిర్మాణ సామగ్రి వ్యయం
రూ.295.97 కోట్ల వ్యయంతో జరుగుతున్న నిర్మాణం కాంట్రాక్టు ఒప్పందం మేరకు 2025 జనవరికల్లా పూర్తి కావాల్సి ఉంది. ఎల్వీయూపీ వద్ద అనుసంధానం అయ్యే రోడ్ల పని పూర్తయిందని, రోడ్డు వెడల్పు పూర్తి కావాల్సి ఉందని అధికారులు అంటున్నారు. నిర్మాణ సామగ్రి ధరలు పెరిగి పోయాయని, పాత ధరలతో నిర్మాణం జరపడం కుదరదని కాంట్రాక్టరు సమస్యలు లేవనెత్తారు. దీంతో పనుల్లో కొంత జాప్యం అయింది. కాంట్రాక్టరు పేర్కొన్న దానిపై జాతీయ రహదారుల విభాగం వ్యత్యాస నగదును చెల్లించేందుకు అంగీకరించింది. దీంతో కాంట్రాక్టరు పనులు తిరిగి ప్రారంభించారని హైవేస్ విభాగాధికారులు పేర్కొన్నారు. కారనోడై వంతెన వద్ద ఒక లేనులో పనులు ముగియడంతో అక్కడ వాహనాలు కూడా అనుమతించామని చెప్పారు.
స్థల సమస్య
వంతెనను అనుసంధానం చేస్తూ జరగాల్సిన నిర్మాణానికి స్థల సమస్యతో మరి కొంత సమయం వేచి ఉండాల్సి వచ్చింది. చెన్నై నుంచి తడ వరకు మొత్తం మరమ్మతులతో సరిపెట్టకుండా కొత్తగా జాతీయ రహదారుల విభాగం రోడ్డు వేయాలని కొందరు అంటున్నారు. కవరపట్టై, టోల్ప్లాజాలున్న ప్రాంతాల్లో పకడ్బందీగా మరమ్మతులు జరగాల్సి ఉంది. బాగా పాడైన రోడ్డుకు కూడా టోల్ ఛార్జీలు చెల్లిస్తున్నామని వాహన చోదకులు అధికారులకు తరచూ ఫిర్యాదులు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
8 ఏళ్ల ప్రేమ.. వివాహమైన వెంటనే పారిపోయిన భర్త
[ 07-05-2024]
కళ్లకురిచ్చి జిల్లా ఉళుందూర్పేట సమీపం సిరుత్తనూర్ గ్రామానికి చెందిన గోవిందస్వామి ఏసు కుమార్తె రోస్లిన్ మేరీ (25) చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సు. -
అమ్మాయిలు అదరగొట్టారు
[ 07-05-2024]
ప్లస్టూ పబ్లిక్ పరీక్షల్లో అమ్మాయిలు అదరగొట్టారు. అబ్బాయిల కన్నా ఎక్కువ ఉత్తీర్ణతశాతం సాధించారు. -
చిన్నారిపై పెంపుడు కుక్కల దాడి
[ 07-05-2024]
పార్కులో ఐదేళ్ల చిన్నారిపై రెండు పెంపుడు కుక్కలు దారుణంగా దాడిచేసిన ఘటన నగరంలో చోటుచేసుకుంది. -
ఠారెత్తిస్తున్న ఎండలు!
[ 07-05-2024]
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు బాగా పెరిగాయి. చాలా జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరికలూ జారీ చేసింది. -
అంధ పాఠకులకు ప్రత్యేక యాప్
[ 07-05-2024]
సభ్యత్వం ఉన్న వారికి పుస్తకాలను అద్దెకిచ్చే పద్ధతిని ఇటీవల అన్నా సెంటినరీ గ్రంథాలయం ప్రారంభించిన విషయం తెలిసిందే. -
ప్లస్టూ ఫలితాల విడుదల
[ 07-05-2024]
మహానగర చెన్నై కార్పొరేషన్ పాఠశాల విద్యార్థులు 12వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 87.13 శాతం ఉత్తీర్ణత సాధించారని కమిషనర్ డాక్టర్ జె.రాధాకృష్ణన్ వెల్లడించారు. -
చర్చనీయంగా ఏ.ఆర్.రెహమాన్ పోస్టు
[ 07-05-2024]
దివంగత హాస్యనటుడు కుమరిముత్తు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ వీడియోను ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ తన ఎక్స్ పేజీలో షేర్ చేశారు. -
వైద్య విద్యార్థుల మృతికి సీఎం సంతాపం
[ 07-05-2024]
కన్నియాకుమరి జిల్లా రాజాక్కమంగలంలోని సముద్రంలో మునిగి మృతి చెందిన వైద్య విద్యార్థుల ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
విక్రవాండి ఉప ఎన్నికకు రంగం సిద్ధం!
[ 07-05-2024]
విళుపురం జిల్లా విక్రవాండి ఎమ్మెల్యే (డీఎంకే) మృతితో ఆ నియోజకవర్గం ఖాళీగా ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. -
ఇండియా కూటమిలో డీఎంకే ఉండి ప్రయోజనమేంటి?
[ 07-05-2024]
డీఎంకే ఇండియా కూటమిలో ఉన్నా రాష్ట్రానికి ప్రయోజనమేమి లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి అన్నారు. -
జయకుమార్ మృతిపై దర్యాప్తు ముమ్మరం
[ 07-05-2024]
తిరునెల్వేలి కాంగ్రెస్ తూర్పు జిల్లా అధ్యక్షుడు జయకుమార్ ధనసింగ్ మృతి వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
-
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
-
ఇజ్రాయెల్ ఆధీనంలో రఫా క్రాసింగ్
-
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
-
మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు.. జనసేనకు మద్దతు ప్రకటించిన నాని