బెదిరింపు రాజకీయాలకు భయపడం
బెదిరింపు రాకీయాలకు భయపడబోమని మాజీ గవర్నర్ తమిళిసై తెలిపారు. లోక్సభ ఎన్నికల సమయంలో ఆళ్వార్పేటలోని పోలింగ్బూత్లో ఏజెంట్గా ఉన్న భాజపా నిర్వాహకుడు గౌతమన్పై డీఎంకే వారు దాడి చేశారని తమిళిసై ఆరోపించారు.
తమిళిసై
సైదాపేట, న్యూస్టుడే: బెదిరింపు రాకీయాలకు భయపడబోమని మాజీ గవర్నర్ తమిళిసై తెలిపారు. లోక్సభ ఎన్నికల సమయంలో ఆళ్వార్పేటలోని పోలింగ్బూత్లో ఏజెంట్గా ఉన్న భాజపా నిర్వాహకుడు గౌతమన్పై డీఎంకే వారు దాడి చేశారని తమిళిసై ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆళ్వార్పేటలోని గౌతమన్ ఇంటికి వెళ్లిన తాగునీటి బోర్డు అధికారులు అతని ఇంట్లో భూమి లోపల ట్యాంక్ (సంపు)ను పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన అనంతరం గౌతమన్ ఇంటికి వెళ్లిన తమిళిసై జరిగిన విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకర్లతో మాట్లాడుతూ... తమిళనాడు ప్రభుత్వ అధికారులతో బెదిరించడం సబబుకాదన్నారు. గౌతమన్ గిరిజనుడని, అయితే అతను భాజపాకు చెందినవాడు కావడంతో అగ్ర కులానికి చెందినవాడని డీఎంకే కుల రాజకీయాలకు పాల్పడుతుందన్నారు. గౌతమన్ ఇంట్లో సంపు సౌకర్యం మాత్రమే ఉందన్నారు. అయితే తాగునీటి బోర్డు అధికారులు ఆ సంపు కనెక్షన్ సైతం తొలగించేందుకు వెళ్లడం దారుణమన్నారు. అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేస్తారా? అని ప్రశ్నించారు. డీఎంకేకు ఓటమి భయం పట్టుకుందని, ఇలాంటి బెదిరింపు రాజకీయాలకు భయపడబోమని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కుమారుడిపై మరుగుతున్న నూనె పోసి హతమార్చిన తల్లి, పెద్దమ్మ
[ 06-05-2024]
మద్యం మత్తులో దాడిచేసిన కుమారుడిపై తల్లి, అతని పెద్దమ్మ మరిగిన నూనె పోసి హతమార్చారు. పోలీసుల కథనం మేరకు.. తిరువణ్ణామలై జిల్లా వందవాసి సమీపం తెన్నాంగూర్ గ్రామానికి చెందిన సురేష్ (35) మద్యానికి బానిసయ్యాడు. -
కాలుష్యం.. కాస్త నయం!
[ 06-05-2024]
వాహనాలు, పరిశ్రమలు, అభివృద్ధి పనులు.. నగరవ్యాప్తంగా కాలుష్య కారకాలుగా మారుతున్నాయి. ఈ ఇక్కట్లు చెన్నై వాసులు నిత్యం అనుభవిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇతర నగరాలతో పోల్చి చూస్తే చెన్నై కొంత నయమన్నట్లుగానే ఉందనే భావన కలుగుతోంది. -
‘విలేజ్ కుకింగ్’ తాత ఆరోగ్యంపై రాహుల్గాంధీ ఆరా
[ 06-05-2024]
విలేజ్ కుకింగ్ యూట్యూబ్ ఛానల్ తాత పెరియతంబి ఆరోగ్యంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరా తీసినట్లు సమాచారం. విలేజ్ కుకింగ్ ఛానల్కు 22 మిలియన్ చందాదారులు ఉన్నారు. -
తాగునీరు అందించనున్న తిరునిండ్రవూరు చెరువు
[ 06-05-2024]
స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని డిమాండు చేస్తున్న ఆవడి వాసులకు జలమండలి విభాగం శుభవార్త చెప్పింది. తిరునిండ్రవూరు చెరువు నీటిని తాగునీరుగా శుద్ధి చేసి ఆవడి కార్పొరేషన్, చెన్నైకి పంపిణీ చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. -
పోలండ్ యువతిని పెళ్లాడిన కృష్ణగిరి యువకుడు
[ 06-05-2024]
కృష్ణగిరి జిల్లా వేప్పన్హళ్లి సమీపం కురియనప్పళ్లి గ్రామానికి చెందిన తిమ్మప్ప, పద్మమ్మ కుమారుడు రమేష్ (33) ఉన్నత విద్య కోసం పోలండ్ వెళ్లాడు. -
ఒకే పాఠశాల పేరుతో రెండు నీట్ కేంద్రాలు
[ 06-05-2024]
తంజావూర్, కుంభకోణంలో ఒకే పేరుతో రెండు పరీక్ష కేంద్రాలు ఉండటంతో గందరగోళానికి గురైన విద్యార్థిని పరీక్ష రాయలేక వెనుదిరిగింది. తంజావూర్ జిల్లాలో తామరై ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో తంజావూర్, కుంభకోణంలో రెండు పాఠశాలలు నడుస్తున్నాయి. -
వర్షం కోసం ప్రత్యేక ప్రార్థనలు
[ 06-05-2024]
వర్షం కోసం ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తమిళనాడు తౌహీద్ జమాత్ కాంచీపురం జిల్లా శాఖ తరపున ఆదివారం కాంచీపురం వలి ముహమ్మద్పేటలోని మున్సిపల్ కార్పొరేషన్ మిడిల్ పాఠశాల ప్రాంగణంలో సుమారు 500 మందికిపైగా ప్రార్థనల్లో పాల్గొన్నారు. -
ముగిసిన జయకుమార్ అంత్యక్రియలు
[ 06-05-2024]
అనుమానాస్పద రీతిలో మృతి చెందిన కాంగ్రెస్ నెల్లై తూర్పు జిల్లా అధ్యక్షుడు జయకుమార్ ధనసింగ్ అంత్యక్రియలు సొంతూరు కరైసుత్తుపుదూరులో ఆదివారం జరిగాయి. -
పోలీసుశాఖ వెబ్సైట్ హ్యాక్
[ 06-05-2024]
తమిళనాడు పోలీసుశాఖ వెబ్సైట్ హ్యాక్ అయింది. ఈ విషయమై సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడు పోలీసులు నిందితులు, ఫిర్యాదుల డేటా నిల్వ చేసేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ ఉపయోగిస్తారు. -
ప్రదీప్ రంగనాథన్ చిత్రానికి డ్రాగన్గా టైటిల్
[ 06-05-2024]
అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోను ఏజీఎస్ సంస్థ గత నెల యూట్యూబ్లో విడుదల చేసింది. -
రాష్ట్రానికి భారీ వర్ష సూచన
[ 06-05-2024]
రాష్ట్రంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఆదివారం వాతావరణ పరిశోధన కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో...
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు
-
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
-
అక్కడికి వెళ్తే.. ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుంది: సునీతా విలియమ్స్
-
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు