చెన్నైలో ట్రాఫిక్ ఆంక్షలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సబ్వే వద్ద మూడు నెలల పాటు ట్రాఫిక్లో మార్పులు చేసినట్టు ఆ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది.
వడపళని, న్యూస్టుడే: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సబ్వే వద్ద మూడు నెలల పాటు ట్రాఫిక్లో మార్పులు చేసినట్టు ఆ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. దక్షిణ రైల్వే ఆధ్వర్యంలో ఆర్బీఐ సబ్వే, వంతెన వద్ద నాలుగో లైను, ఆర్సీసీ బాక్సు నిర్మాణ పనుల కారణంగా శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి మూడు నెలలపాటు ఆంక్షలు అమల్లో ఉంటాయి.
- రాయపురం వంతెన, రాజాజీ సాలై నుంచి కామరాజర్ సాలైకి వెళ్లాల్సిన వాహనాలు ఆర్బీఐ సబ్వే మీదుగా వార్ మెమోరియల్ వెళ్లడానికి అనుమతి లేదు.
- వాహనాలు ఆర్బీఐ సబ్వే సర్వీసు రోడ్డు, నార్త్ ఫోర్ట్ సాలై, రాజా అన్నామలై మండ్రం, ముత్తుస్వామి సాలై, డాక్టర్ ముత్తుస్వామి బ్రిడ్జి, వాలాజా పాయింట్, ఫ్లాగ్ స్టాఫ్ రోడ్డు, వార్ మెమోరియల్ మీదుగా కామరాజర్ సాలై చేరుకోవాలి.
- కామరాజర్ సాలై నుంచి ప్యారీస్ కార్నర్ వైపు వెళ్లాల్సిన వాహనాలు ఆర్బీఐ సబ్వే మీదుగా ఎప్పటిలాగానే వెళ్లొచ్చు.
టీనగర్లో ఏడాది పాటు..
టీనగర్ మ్యాడ్లీ రోడ్డు కూడలిలో పైవంతెన నిర్మాణం కారణంగా శనివారం నుంచి (ఏప్రిల్ 27) ఏడాది పాటు ట్రాఫిక్లో మార్పులు చేసినట్టు ఆ విభాగం తెలిపింది. ః నార్త్ ఉస్మాన్ రోడ్డు, టీనగర్ బస్టాండు మీదుగా ఉస్మాన్ రోడ్డు పైవంతెన మీదకు వాహనాలకు అనుమతి లేదు. ః పైవంతెన సర్వీసు రోడ్డు గుండా టీనగర్ బస్టాండు, ప్రకాశం రోడ్డు, భాష్యం రోడ్డు, త్యాగరాజ రోడ్డు, బర్కిత్ రోడ్డు మీదుగా వెళ్లాలి. ః బర్కిత్ రోడ్డు, మూపనార్ వీధి కూడలి నుంచి మ్యాడ్లీ రోడ్డుకు బస్సులను అనుమతిస్తారు. ః ఇతర వాహనాలు టీనగర్ బస్టాండుకు ఉస్మాన్ రోడ్డు, మూపారప్పన్ వీధి, మూస వీధి, సౌత్ దండపాణి వీధి, మన్నర్ వీధి గుండా రావాల్సి ఉంటుంది. ః టీనగర్ బస్టాండు, సౌత్ ఉస్మాన్ రోడ్డు మీదుగా సైదాపేట అన్నా రోడ్డు, కన్నమ్మపేట జంక్షన్, సౌత్ వెస్ట్ బోగ్ రోడ్డు, సీఐటీ నగర్ 4వ మెయిన్ రోడ్డు, సీఐటీ నగర్ 3వ మెయిన్ రోడ్డు మీదుగా వాహనాలు అన్నా రోడ్డు చేరుకోవాలి. ః సీఐటీ నగర్ మొదటి మెయిన్ రోడ్డు నుంచి నడిచే వాహనాలు కన్నమ్మపేట జంక్షన్ వద్ద నార్త్ ఉస్మాన్ రోడ్డు, సౌత్ వెస్ట్ బోగ్ రోడ్డు, వెంకటనారాయణ రోడ్డు, నార్త్ ఉస్మాన్ రోడ్డు, నాగేశ్వరన్ రోడ్డు మీదుగా పయనించాలి. ః టీనగర్ బస్టాండు నుంచి వచ్చే వాహనాలు మ్యాడ్లీ రోడ్డు చుట్టూ తిరిగి బర్కిత్ రోడ్డు, వెంకటనారాయణ రోడ్డు, నాగేశ్వరన్ రోడ్డు మీదుగా నార్త్ ఉస్మాన్ రోడ్డుకు రావాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
8 ఏళ్ల ప్రేమ.. వివాహమైన వెంటనే పారిపోయిన భర్త
[ 07-05-2024]
కళ్లకురిచ్చి జిల్లా ఉళుందూర్పేట సమీపం సిరుత్తనూర్ గ్రామానికి చెందిన గోవిందస్వామి ఏసు కుమార్తె రోస్లిన్ మేరీ (25) చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సు. -
అమ్మాయిలు అదరగొట్టారు
[ 07-05-2024]
ప్లస్టూ పబ్లిక్ పరీక్షల్లో అమ్మాయిలు అదరగొట్టారు. అబ్బాయిల కన్నా ఎక్కువ ఉత్తీర్ణతశాతం సాధించారు. -
చిన్నారిపై పెంపుడు కుక్కల దాడి
[ 07-05-2024]
పార్కులో ఐదేళ్ల చిన్నారిపై రెండు పెంపుడు కుక్కలు దారుణంగా దాడిచేసిన ఘటన నగరంలో చోటుచేసుకుంది. -
ఠారెత్తిస్తున్న ఎండలు!
[ 07-05-2024]
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు బాగా పెరిగాయి. చాలా జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరికలూ జారీ చేసింది. -
అంధ పాఠకులకు ప్రత్యేక యాప్
[ 07-05-2024]
సభ్యత్వం ఉన్న వారికి పుస్తకాలను అద్దెకిచ్చే పద్ధతిని ఇటీవల అన్నా సెంటినరీ గ్రంథాలయం ప్రారంభించిన విషయం తెలిసిందే. -
ప్లస్టూ ఫలితాల విడుదల
[ 07-05-2024]
మహానగర చెన్నై కార్పొరేషన్ పాఠశాల విద్యార్థులు 12వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 87.13 శాతం ఉత్తీర్ణత సాధించారని కమిషనర్ డాక్టర్ జె.రాధాకృష్ణన్ వెల్లడించారు. -
చర్చనీయంగా ఏ.ఆర్.రెహమాన్ పోస్టు
[ 07-05-2024]
దివంగత హాస్యనటుడు కుమరిముత్తు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ వీడియోను ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ తన ఎక్స్ పేజీలో షేర్ చేశారు. -
వైద్య విద్యార్థుల మృతికి సీఎం సంతాపం
[ 07-05-2024]
కన్నియాకుమరి జిల్లా రాజాక్కమంగలంలోని సముద్రంలో మునిగి మృతి చెందిన వైద్య విద్యార్థుల ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
విక్రవాండి ఉప ఎన్నికకు రంగం సిద్ధం!
[ 07-05-2024]
విళుపురం జిల్లా విక్రవాండి ఎమ్మెల్యే (డీఎంకే) మృతితో ఆ నియోజకవర్గం ఖాళీగా ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. -
ఇండియా కూటమిలో డీఎంకే ఉండి ప్రయోజనమేంటి?
[ 07-05-2024]
డీఎంకే ఇండియా కూటమిలో ఉన్నా రాష్ట్రానికి ప్రయోజనమేమి లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి అన్నారు. -
జయకుమార్ మృతిపై దర్యాప్తు ముమ్మరం
[ 07-05-2024]
తిరునెల్వేలి కాంగ్రెస్ తూర్పు జిల్లా అధ్యక్షుడు జయకుమార్ ధనసింగ్ మృతి వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
-
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..
-
నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర
-
స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 73,960
-
ప్రజాస్వామ్యమా... పెద్దిరెడ్డి రాజ్యమా?
-
చక్కటి ఉపాయం.. చల్లని ప్రయాణం