వేర్వేరు ఘటనల్లో ముగ్గురి దుర్మరణం
జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. అనకాపల్లి రైల్వేస్టేషన్లో రైలు ఢీకొని గురువారం ఒప్పంద పారిశుద్ధ్య కార్మికుడు మృతి చెందారు. దువ్వాడ జీఆర్పీ ఎస్సై
అప్పారావు (పాతచిత్రం)
లక్ష్మీదేవిపేట(అనకాపల్లి), న్యూస్టుడే: జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. అనకాపల్లి రైల్వేస్టేషన్లో రైలు ఢీకొని గురువారం ఒప్పంద పారిశుద్ధ్య కార్మికుడు మృతి చెందారు. దువ్వాడ జీఆర్పీ ఎస్సై కె.శాంతారాం తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక శ్రీరామనగర్కు చెందిన పెద్దాడ అప్పారావు(43) స్టేషన్లో గురువారం మూడో నంబరు ప్లాట్ఫాం పట్టాలపై చెత్తను శుభ్రం చేసి ట్రాక్ దాటుతుండగా ఏపీ ఎక్స్ప్రెస్ ఢీకొట్టడంతో మృతి చెందారు. అప్పారావు భార్య గతంలోనే చనిపోవడంతో ఇద్దరు పిల్లలను చదివిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలని మృతుడి కుటుంబసభ్యులు గుత్తేదారుడితో వాగ్వాదానికి దిగారు. పోలీసులు జోక్యం చేసుకొని సర్ది చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
కొక్కిరాపల్లిలో వాహనం ఢీకొని..
ఎలమంచిలి గ్రామీణం: కొక్కిరాపల్లి కూడలి వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందినట్లు గ్రామీణ ఎస్ఐ సన్నిబాబు తెలిపారు. 30 ఏళ్లు వయసు కలిగి తెల్లరంగు చొక్కా ధరించి ఉన్నాడని, వివరాలు తెలిసిన వారు పోలీసుస్టేషన్లో సంప్రదించాలన్నారు.
చికిత్స పొందుతూ వృద్ధురాలు..
అనకాపల్లి పట్టణం: తుమ్మపాలలో ఈనెల 15న అగ్ని ప్రమాదంలో గాయపడిన వృద్ధురాలు పీలా లక్ష్మి (65) చికిత్స పొందుతూ మృతిచెందింది. పట్టణ ఎస్సై ధనుంజయ్ కథనం ప్రకారం.. చీర కొంగుతో గ్యాస్ స్టౌవ్ నుంచి టీ పాత్ర తీస్తుండగా చీరకు మంటలు అంటుకుని గాయపడింది. చికిత్స నిమిత్తం కేజీహెచ్కు తరలించగా గురువారం మృతిచెందింది. ఈమె కుమార్తె అన్నపూర్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై తెలిపారు.
సబ్జైలు హెడ్ వార్డర్ మృతి
తెనాలి టౌన్, న్యూస్టుడే: గుంటూరు జిల్లా తెనాలి సబ్ జైలు హెడ్ వార్డర్ కృష్ణారెడ్డి (60) గురువారం మృతిచెందారు. తాను నివసించే క్వార్టరు మెట్ల వద్ద ఈయన మృతిచెంది ఉండడాన్ని తోటి ఉద్యోగులు గుర్తించారు. 2019లో ఈయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. పిల్లల చదువుల నేపథ్యంలో కుటుంబం విశాఖపట్నంలో ఉంటోంది. భార్య అప్పుడప్పుడూ ఇక్కడికి వచ్చి వెళుతుంటారు. సంక్రాంతి పండుగకు కూడా ఆమె వచ్చి ఈ నెల 16న తిరిగి వెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణారెడ్డి కుటుంబసభ్యులు తెనాలి చేరుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలనలో రోజూ.. ‘భూ’కంపమే!!
[ 11-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక విశాఖ నగరం ఉలిక్కిపడేలా ‘జె’ గ్యాంగ్ రెచ్చిపోయింది. వివాదాల్లో ఉన్న విలువైన భూముల్ని లాక్కొంది. ప్రభుత్వ స్థలాల్లో పాగా వేసింది. భారీ ప్రాజెక్టులు చేతులు మారిపోయాయి. -
చంద్రబాబుకు ముస్లిం మతపెద్దల మద్దతు
[ 11-05-2024]
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ముస్లిం మతపెద్దలు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం తెదేపా కార్యాలయంలో వారు చంద్రబాబును కలిసి మద్దతు ప్రకటించారు. -
ఫలితాన్ని శాసించే ‘పోస్టల్ బ్యాలెట్’..!
[ 11-05-2024]
ఈ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలట్లు ఫలితాన్ని శాసిస్తాయా అంటే.. ఉద్యోగ వర్గాల నుంచి ఔననే సమాధానం వస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పోస్టల్ బ్యాలట్ ఓట్లు నమోదయ్యాయి. -
సూపర్-6 పథకాలతో మేలు: శ్రీభరత్
[ 11-05-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని, తెదేపా కూటమి ప్రభుత్వంలో వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తామని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. -
పింఛను రూ.4 వేలు ఇస్తాం: తెదేపా
[ 11-05-2024]
తెదేపా కూటమి ప్రభుత్వంలో రూ.4 వేల పింఛను అందిస్తామని పశ్చిమం తెదేపా అభ్యర్థి గణబాబు, విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. -
త్వరితగతిన ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లిస్తాం..
[ 11-05-2024]
విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని, ఆరోగ్యశ్రీ బకాయిలను ఎప్పటికప్పుడు చెల్లించేలా చూస్తామని తెదేపా, జనసేన, భాజపా కూటమి అభ్యర్థులు హామీ ఇచ్చారు. -
జగన్.. ఇదేం మెలిక..!
[ 11-05-2024]
గాజువాక హౌస్కమిటీ భూ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొన్నామంటూ ప్రగల్భాలు పలికిన వైకాపా ప్రభుత్వం... చివరకు ఆంక్షల పేరుతో బాధితులకు చుక్కలు చూపించింది. హక్కు పత్రాలు (కన్వెన్షన్ డీడ్) చేతికి ఇవ్వడానికి ముప్పుతిప్పలు పెట్టింది. -
అపురూపం.. నిజరూప దర్శనం
[ 11-05-2024]
సింహాచలం అప్పన్న స్వామి నిజరూపాన్ని భక్తులు ప్రశాంతంగా దర్శించుకున్నారు. అధికారులు ఒక ప్రణాళిక ప్రకారం చేసిన ఏర్పాట్లు మంచి ఫలితాన్ని ఇచ్చాయి. గతానుభవాలను దృష్టిలో ఉంచుకొని చేసిన పకడ్బందీ సన్నాహాలతో ఎక్కడా ఇబ్బంది కలగలేదు. -
మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది
[ 11-05-2024]
కేంద్రంలో మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎంపీ శశిథరూర్ ఆరోపించారు. విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన మాట్లాడుతూ.. మోదీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి నెరవేర్చలేదన్నారు. -
కేజీహెచ్ గ్రేడ్-1 నర్సింగ్ సూపరింటెండెంట్ సరెండర్
[ 11-05-2024]
కేజీహెచ్ గ్రేడ్1 నర్సింగ్ సూపరింటెండెంట్ జె.విజయలక్ష్మిని ప్రభుత్వానికి సరెండర్ చేశారు. -
ఓటు అనే ఆయుధాన్ని ప్రజలంతా ఉపయోగించుకోవాలి
[ 11-05-2024]
మీ ఓటు అనే ఆయుధం ద్వారా జగన్ను తరిమికొట్టాలని కూటమి (భాజపా) శాసనసభ అభ్యర్థి విష్ణుకుమార్రాజు పేర్కొన్నారు. -
జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొస్తా!
[ 11-05-2024]
తనను ఎంపీగా గెలిపిస్తే అనకాపల్లి జిల్లాకు పరిశ్రమలు తీసుకువచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పిస్తానని లోక్సభ భాజపా అభ్యర్థి సీఎం రమేశ్ హామీ ఇచ్చారు. -
ఆటగాళ్లకు మోసగాడు
[ 11-05-2024]
వైకాపా పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన రంగాల్లో క్రీడారంగం ఒకటి. ఐదేళ్లలో క్రీడాభివృద్ధికి రూపాయి ఖర్చు పెట్టలేదు. క్రీడా పరికరాలు సమకూర్చలేదు. మైదానాలు బాగు చేయలేదు. -
వినిపించలేదా.. జగన్ అన్నదాతల ఆత్మఘోష?
[ 11-05-2024]
ప్రస్తుతం ఆయా బాధిత కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాయి. ఇలాంటివారిని రైతు స్వరాజ్య వేదిక గుర్తించి జీవనోపాధికి ఉన్నంతలో సాయం చేసినా జగన్ సర్కారుకు మాత్రం పరిహారం ఇవ్వడానికి చేతులు రాలేదు. -
పోలింగ్ ముగిసే వరకు అప్రమత్తత: చంద్రబాబు
[ 11-05-2024]
పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఏమైనా ఇబ్బందులుంటే తన దృష్టికి తేవాలని తెదేపా అధినేత చంద్రబాబు కూటమి అభ్యర్థులు, పార్టీ నేతలకు సూచించారు. -
యువకులపై యమపాశం
[ 11-05-2024]
జిల్లాలో శుక్రవారం జరిగిన రెండు ప్రమాదాల్లో నలుగురు యువకుల దుర్మరణం పాలై ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నింపారు. అందరితో కలివిడిగా ఉండే వారు అనుకోని ప్రమాదంలో మరణించడంతో కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు బోరున విలపించారు. -
అయిదేళ్ల నరకానికి రెండు రోజుల్లో మోక్షం
[ 11-05-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలు అనుభవించిన నరకానికి రెండు రోజుల్లో మోక్షం కలగనుందని కూటమి ‘పేట’ అభ్యర్థి వంగలపూడి అనిత అన్నారు. -
జలాశయాన్ని కప్పేస్తున్నారు..
[ 11-05-2024]
వందల ఎకరాలకు సాగునీరందించే జలాశయాన్ని కొందరు అక్రమార్కులు తమ స్వార్థానికి ఇష్టారాజ్యంగా పూడ్చేస్తున్నారు. ఇదంతా నిరాటంకంగా సాగుతున్నా అధికారులు మాత్రం చూసీచూడనట్లు వదిలేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు