logo

జిల్లా వైద్యాధికారి సబ్బవరం ఆసుపత్రి సందర్శన

జిల్లా కుష్ఠు, ఎయిడ్స్‌, క్షయ నివారణ అధికారి ఎంవీఎస్‌కే బాలాజీ శుక్రవారం సబ్బవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించారు.

Published : 20 Apr 2024 03:31 IST

సబ్బవరం, న్యూస్‌టుడే: జిల్లా కుష్ఠు, ఎయిడ్స్‌, క్షయ నివారణ అధికారి ఎంవీఎస్‌కే బాలాజీ శుక్రవారం సబ్బవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించారు. జాతీయ కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు. వివరాలను స్థానిక డాక్టర్‌ ఎన్‌ఎస్‌ఆర్‌ చక్రవర్తిని అడిగి తెలుసుకున్నారు. ఆయా విభాగాల దస్త్రాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్‌ విధ్యాదరి, స్వర్ణలత, ఎంపీహెచ్‌ఈవో జేసుదాస్‌, కె.రవిబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని