నరకయాతన!!
ఇతర జిల్లాల్లో జగన్ సభలు జరిగినా ఆర్టీసీ అధికారులు నగరవాసులకు చుక్కలు చూపిస్తున్నారు. రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నారు. ప్రయాణికుల గురించి పట్టించుకోకుండా వందలాది బస్సులను జగన్ సభలకు తరలించేస్తున్నారు.
సీఎం జగన్ సేవలో ఆర్టీసీ.. జనాల పాట్లు వర్ణణాతీతం
కాకినాడ ‘సిద్ధం’ సభకు 350 సర్వీసుల తరలింపు
నడిరోడ్లపై ప్రయాణికుల పడిగాపులు
న్యూస్టుడే, కార్పొరేషన్
ఇతర జిల్లాల్లో జగన్ సభలు జరిగినా ఆర్టీసీ అధికారులు నగరవాసులకు చుక్కలు చూపిస్తున్నారు. రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నారు. ప్రయాణికుల గురించి పట్టించుకోకుండా వందలాది బస్సులను జగన్ సభలకు తరలించేస్తున్నారు.
శుక్రవారం కాకినాడలో జరిగిన మేమంతా సిద్ధం సభకు నగరం నుంచి 300 సిటీ బస్సులు, 50 దూర ప్రాంత సర్వీసులను పంపించేశారు. దీంతో నగర వాసులకు బస్సులు అందుబాటులో లేకుండా పోయాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణికులు గంటల తరబడి రోడ్లపై నిరీక్షించాల్సి వచ్చింది. విధులకు ఇతర ప్రాంతాలకు వెళ్లే ఉద్యోగులు, వివిధ పనులపై వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆటోలను ఆశ్రయించి చేతి చమురు వదిలించుకోవాల్సి వచ్చింది.
మాధవధార, మురళీనగర్, పెందుర్తి, కొత్తవలస, సింహాచలం, గాజువాక, మల్కాపురం, ఆరిలోవ, భీమిలి, తగరపువలస ప్రాంతాల నుంచి నగరానికి రాకపోకలు సాగించేవారు, ముఖ్యంగా బస్సు పాసులు కలిగినవారి పాట్లు వర్ణణాతీతం. ఇదే అదునుగా ఆటో వాలాలు రూ.10 నుంచి రూ.30 వరకు అదనంగా ఛార్జీలు వసూలు చేశారు. నగరం నుంచి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, పాలకొండ, సాలూరు, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం, రాజమహేంద్రవరం, కాకినాడ, విజయవాడకు సర్వీసులను కుదించారు. దీంతో ద్వారకా బస్స్టేషన్తోపాటు, జాతీయ రహదారిపై ప్రయాణికులు పడిగాపులు పడ్డారు.
ఒక పక్క భగభగ మండే ఎండలు, ఉక్కపోత కారణంగా నిలువునా నీరైపోతుంటే మరో పక్కన బస్సులు లేక నగరవాసులు తీవ్ర అసహనానికి గురయ్యారు. వైకాపా ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ నుంచి బస్సులు తిరిగి వచ్చినా శనివారం మధ్యాహ్నం నుంచి రోడ్లపైకి వచ్చే అవకాశాలున్నాయి. అప్పటి వరకు ప్రయాణికులకు అవస్థలు తప్పవు.
బాబోయ్.. ప్రయాణికుల పాట్లెన్నో!
న్యూస్టుడే, మద్దిలపాలెం
గంటలకొద్దీ ఎదురుచూపు..: నగరంలో ప్రయివేట్ సంస్థలో పనిచేస్తున్నాను. విధులు ముగించుకుని ఆనందపురం వెళ్లడానికి బస్సు కోసం మద్దిలపాలెం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద సాయంత్రం ఐదు గంటల నుంచి సుమారు గంటపాటు పడిగాపులు కాశాను. నగర శివారు ప్రాంతాలకు వెళ్లే సిటీబస్సులతో పాటు, కనీసం విజయనగరం రూట్ వెళ్లే బస్సులు కూడా లేక ఇబ్బంది పడ్డాం.
శిరీష, ఆనందపురం
ఆటోలను ఆశ్రయించాల్సి వచ్చింది..
జగన్ రాష్ట్రంలో ఏ జిల్లాలో సిద్ధం సభ, సమావేశాలు నిర్వహించినా విశాఖ నుంచి బస్సులు తరలిస్తున్నారు. దీనివల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. నగరంలోకి బతుకుదెరువుకోసం వలస వచ్చాను. ఎంతసేపు ఎదురుచూసినా బస్సు రాలేదు. చివరికి ఆటోను ఆశ్రయించాల్సి వచ్చింది.
అప్పలరెడ్డి, తగరపువలస
అసలే బస్సులు లేవు..
అసలే నగరంలో బస్సులు తక్కువగా ఉన్నాయి. దీనికి తోడు ఈ సభలకు బస్సులను తరలించటం వల్ల ప్రయాణికులకు, విద్యార్థులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఉదయం కళాశాలలకు రావాలన్నా.. సాయంత్రం ఇంటికి వెళ్లాలన్నా గంటలకొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది. ఇలా చేయటం మంచిది కాదు.
నవీన్, పెందుర్తి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీ పేరు పెట్టావ్.. ఒట్టు తీసి గట్టున పెట్టావ్
[ 02-05-2024]
తెదేపా హయాంలో ‘బీఆర్ అంబేడ్కర్’ పేరుతో అమలు చేసిన విదేశీ విద్య పథకానికి ముఖ్యమంత్రి జగన్ నీళ్లొదిలారు. ఈ పథకానికి తన పేరు పెట్టుకోవడం తప్ప చేసిందేమీ లేదు. -
పవన్ సభకు.. జన సునామీ!!
[ 02-05-2024]
పెందుర్తిలో ‘వారాహి విజయభేరి’ సభ జన సునామీని తలపించింది. బుధవారం రాత్రి నిర్వహించిన సభకు చిన్నారుల నుంచి పెద్దల వరకు భారీగా తరలివచ్చారు. -
చప్పగా సీఎం ప్రసంగం.. స్పందన అంతంతమాత్రం
[ 02-05-2024]
ఒకవైపు ఎండ.. మరోవైపు అంతంతమాత్రంగా వచ్చిన జనం.. వారిలోనూ కానరాని స్పందన.. మొత్తంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగంలో కొత్త విషయాలేవీ లేకుండా చప్పగా సాగింది. -
బాలకృష్ణకు ఘన స్వాగతం
[ 02-05-2024]
ఉత్తరాంధ్రలో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బుధవారం మధ్యాహ్నం గన్నవరం నుంచి విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. -
పాడికుండకు చిల్లు.. జగన్కే చెల్లు!
[ 02-05-2024]
పల్లె జీవనంలో, గ్రామాల అభివృద్ధిలో పాడిది విడదీయరాని పాత్ర. క్షీరధారలు ఎంత పొంగిపొర్లితే పల్లెలు అంత పచ్చగా ఉన్నట్టు, అన్నదాత ఆనందంగా ఉన్నట్టు. ప్రతిపక్షం మీద కక్షతో జగన్ పాడిని పాడు చేశారు. -
మాటలు బడాయి.. పేదల వైద్యానికి బకాయి
[ 02-05-2024]
సంపూర్ణ ఆరోగ్యం ప్రతి ఒక్కరి హక్కు. అందుకు అనుగుణంగా ప్రభుత్వాలు కృషి చేయాలి. మెరుగైన వైద్య సేవలందించాలి. కానీ వైకాపా ప్రభుత్వం అవేవీ పట్టవన్నట్లు వ్యవహరిస్తోంది. -
మీ ఓటు ఎక్కడ ఉందో తెలుసా..
[ 02-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో ఓటు ఎక్కడ ఉంది? పోలింగ్ కేంద్రం ఎక్కడ? ఎలా చేరుకోవాలి? అనే సందేహాలు ఓటర్లలో తలెత్తుతున్నాయి. -
నేడు ‘దక్షిణం’లో పవన్ సభ
[ 02-05-2024]
దక్షిణ నియోజకవర్గ దుర్గాలమ్మ ఆలయం ప్రాంతంలో గురువారం సాయంత్రం ఆరుగంటలకు జనసేన అధినేత పవన్కల్యాణ్ బహిరంగ సభ జరగనుందని ఆ పార్టీ నగర అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. -
ఫలితాలు తేల్చేది వనితలే!
[ 02-05-2024]
జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఏప్రిల్ 25 నాటికి 12,89,371 మంది ఓటర్లు ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రవి గత శనివారం రాజకీయ పార్టీల సమావేశంలో ప్రకటించారు. -
కాపులకు మేలు చేసింది తెదేపానే: గంటా
[ 02-05-2024]
రాష్ట్రంలో కాపులకు మేలుచేసిన పార్టీ తెదేపా మాత్రమేనని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. -
ఆరోగ్యశ్రీ పథకానికి అనారోగ్యం
[ 02-05-2024]
జగనన్న పాలనలో ప్రజల ఆరోగ్యం గాల్లో దీపంలా మారింది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం మాటలు నీటి మూటలయ్యాయి. -
విదేశీ విద్య.. అంతా మిథ్య
[ 02-05-2024]
విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదవాలన్న పేద విద్యార్థుల కలను జగన్ కల్లగానే మిగిల్చేశారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పేరిట అమలు చేస్తున్న ఈ పథకం లబ్ధిదారులకు కఠిన నిబంధనలు అడ్డుగా మారాయి. -
జనసేనానికి జన నీరాజనం
[ 02-05-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు పెందుర్తిలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా జనసేనానికి నీరాజనాలు పలికారు. -
ఎమ్మెల్యే సారూ.. జెట్టీ ఒట్టి మాటేనా..
[ 02-05-2024]
పరవాడ మండలం ముత్యాలమ్మలపాలెం పంచాయతీ పరిధిలోని దిబ్బపాలెం, జాలారిపేట, సమ్మెంగిపాలెంలోని మత్స్యకారులకు చేపల వేటే ప్రధాన ఆధారం. -
నోటా కోసమే ఒక బ్యాలెట్ యూనిట్
[ 02-05-2024]
జిల్లాలో ఇతర నియోజకవర్గాలతో పోల్చితే విశాఖ దక్షిణంలో పోలింగ్ ఈసారి కాస్త భిన్నంగా ఉండనుంది. ఇ -
స్వగ్రామానికి ఆర్మీ ఉద్యోగి మృతదేహం
[ 02-05-2024]
పశ్చిమబెంగాల్లో హఠాన్మరణం చెందిన ఆర్మీ హవల్దార్ చిల్ల త్రినాథరెడ్డి (36) మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన చిట్టివలస సమీప జీరుపేట గ్రామానికి బుధవారం తీసుకువచ్చారు. -
ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్యాయత్నం....
[ 02-05-2024]
ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ కుమార్తె మృతి చెందింది. -
బాలికపై అత్యాచార యత్నం
[ 02-05-2024]
ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన వ్యక్తిపై ఎండాడ దిశా పోలీసు స్టేషన్లో పోక్సో చట్టం కింద కేసు నమోదైనట్లు భీమిలి సీఐ డి.రమేశ్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
-
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
-
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్