logo

ఉద్యోగులకు మద్దతుగా తెదేపా నిరసన

ప్రభుత్వం ఉద్యోగులకు ప్రకటించిన పీఆర్సీకి వ్యతిరేకంగా, వారు చేస్తున్న పోరాటానికి మద్దతుగా బలిజిపేటలో తెదేపా నాయకులు నిరసన తెలియజేశారు. బలిజిపేట బస్టాండుకు

Updated : 20 Jan 2022 18:13 IST

బలిజిపేట : ప్రభుత్వం ఉద్యోగులకు ప్రకటించిన పీఆర్సీకి వ్యతిరేకంగా, వారు చేస్తున్న పోరాటానికి మద్దతుగా బలిజిపేటలో తెదేపా నాయకులు నిరసన తెలియజేశారు. బలిజిపేట బస్టాండుకు సమీపంలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద గురువారం వారంతా నల్లబ్యాడ్జీలు ధరించి వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు చేపడుతున్న దశలవారీ పోరాటానికి తమ సంఘీభావం తెలియజేశారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కమిటీ నాయకులు పెదపాపినాయుడు, మండల నాయకులు వావిలపల్లి రామకృష్ణ, మీసాల మనోహర్‌నాయుడు, మరడ రాజు, చోడిగంజి గణపతి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని