రూ.6.47 కోట్ల బంగారం, వెండి వస్తువుల స్వాధీనం
వ్యానులో తరలిస్తున్న రూ.6.47 కోట్ల విలువజేసే బంగారం, వెండి వస్తువులను విజయనగరం జిల్లా డెంకాడ మండలం మోదవలస చెక్పోస్టు వద్ద పోలీసులు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు.
వాహనంలో వస్తువులు ఉన్న పార్సిళ్లను పరిశీలిస్తున్న అధికారులు
డెంకాడ, న్యూస్టుడే: వ్యానులో తరలిస్తున్న రూ.6.47 కోట్ల విలువజేసే బంగారం, వెండి వస్తువులను విజయనగరం జిల్లా డెంకాడ మండలం మోదవలస చెక్పోస్టు వద్ద పోలీసులు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. దీనికి సంబంధించి భోగాపురం సీఐ వెంకటేశ్వరరావు, డెంకాడ ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం... ముంబయి, దిల్లీ, చెన్నై తదితర ప్రాంతాల నుంచి బి.వి.సి.లాజిస్టిక్స్ కొరియర్ పార్సిల్ సర్వీసు ద్వారా విజయనగరంలోని ఆరు ప్రముఖ జ్యూయలరీ దుకాణాల పేరుతో రూ.6.47 కోట్ల విలువైన 10 కిలోల బంగారం ఆభరణాలు, 17 కిలోల వెండి వస్తువులు రవాణా అవుతున్నాయి. వీటిని విశాఖపట్నంలోని మురళీనగర్లోని కొరియర్ సర్వీసు బ్రాంచ్ కార్యాలయం ద్వారా ఆయా దుకాణాలకు శుక్రవారం రాత్రి వ్యానులో రవాణా చేస్తున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా మోదవలస చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించగా భారీగా వస్తువులు గుర్తించి సీజ్ చేశారు. వీటికి సంబంధించిన బిల్లులు ఉన్నప్పటికీ ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి పత్రం లేకపోవడంతో స్వాధీనం చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. దుకాణదారులు కొనుగోలు చేశారా? లేక ఎన్నికల్లో పంపిణీ కోసం తెస్తున్నారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదేళ్లు కట్టలేక పోయారు
[ 07-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే వంశధార పరివాహక ప్రాంత రైతులను ఆదుకుంటామని ఇచ్చిన హామీని సీఎం జగన్మోహనరెడ్డి నెరవేర్చలేదు. -
9న చీపురుపల్లికి చంద్రబాబు
[ 07-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా చీపురుపల్లిలో 9న ప్రజాగళం భారీ బహిరంగ సభకు తెదేపా అధినేత చంద్రబాబు హాజరు కానున్నట్లు తెదేపా విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున తెలిపారు. -
మా ‘గడప’కొస్తే.. తరిమికొడతాం!!
[ 07-05-2024]
నమ్మి ఓట్లేశాం.. అభివృద్ధి చేస్తారని భావించాం.. మా పిల్లలకు భవిష్యత్తునిస్తారని కలలుగన్నాం.. కానీ ఈ ఐదేళ్లలో ఆక్రమణలపై పెట్టిన దృష్టి మా కష్టాలపై పెట్టలేదు..మా అవస్థలను చూడలేదు.. ఉద్యోగాల కోసం మా యువకులు పడుతున్న శ్రమను గుర్తించలేదు. -
నోట్లతో ఎర.. బెదిరింపులు జర
[ 07-05-2024]
పార్వతీపురం నియోజకవర్గంలోని అంగన్వాడీ కార్యకర్తలను ఎన్నికల విధులకు తీసుకున్నారు. వారికి పోస్టల్ బ్యాలెట్ జారీ చేశారు. -
ఊడిపోతున్నాయ్... పంకా రెక్కలు
[ 07-05-2024]
పంకా రెక్కలు ఊడిపోతున్నాయ్.. ఇంతకాలం వైకాపాను నమ్మి తామేం కోల్పోయామో ఆ పార్టీ నేతలు, శ్రేణులతో పాటు ప్రజలు గ్రహించారు. -
దేవుడికే ‘జగన్’ శఠగోపం
[ 07-05-2024]
శతాబ్దాల చరిత్ర సొంతం.. ఉట్టిపడే శిల్పకళా సౌందర్యం.. భక్తకోటికి దైవసాన్నిహిత్యం.. ఇలా ఎన్నో విశిష్టతల సమాహారం.. అందుకే ఉభయ జిల్లాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాలది ప్రత్యేక స్థానం.. -
పోస్టల్ బ్యాలెట్లు.. ఉద్యోగుల ఇక్కట్లు
[ 07-05-2024]
పోస్టల్ బ్యాలెట్లో భాగంగా ఓట్లేసేందుకు ఉద్యోగులకు కష్టాలు తప్పడం లేదు. విజయనగరం జేఎన్టీయూ గురజాడ విద్యాలయంలో ఫెసిలిటేషన్ కేంద్రం వద్ద ఈ పరిస్థితి కనిపిస్తోంది. -
రాజీనామా చేసిన వాలంటీర్లకు జీతాలు చెల్లింపు
[ 07-05-2024]
ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్లు పెద్ద ఎత్తున రాజీనామా చేస్తూ వస్తున్నారు. ఇలా ఉద్యోగాలు వదులుకున్న వారికి గౌరవవేతనం చెల్లించకూడదు. -
జగనన్న కాలనీల్లో బినామీలు!
[ 07-05-2024]
ఉభయ జిల్లాల్లోని జగనన్న కాలనీల్లో బినామీలు పాగా వేస్తున్నారు. ఇళ్ల స్థలాల కేటాయింపులోనే రాజకీయాలు, ఒత్తిళ్లు చోటు చేసుకుంటున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
-
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..
-
నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర
-
స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 73,960
-
ప్రజాస్వామ్యమా... పెద్దిరెడ్డి రాజ్యమా?
-
చక్కటి ఉపాయం.. చల్లని ప్రయాణం