ప్రజల వద్దకే సేవలంటే ఇలాగేనేమో..
గ్రామీణ ప్రజలకు సేవలు మరింత చేరువ చేస్తాం.. ప్రభుత్వ కార్యకలాపాలు అందుబాటులో ఉంచుతాం.. అందుకే గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం..
గ్రామీణ ప్రజలకు సేవలు మరింత చేరువ చేస్తాం.. ప్రభుత్వ కార్యకలాపాలు అందుబాటులో ఉంచుతాం.. అందుకే గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం.. అంటూ గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి.. అయిదేళ్లయినా వాటి నిర్మాణంపై నిర్లక్ష్యం వహించారు. ఇప్పటికీ పునాదుల స్థాయిని దాటని భవనాలు ఎన్నో. ఫలితంగా సచివాలయాలను అద్దె భవనాలు, పాఠశాలలు, శిథిల, ఇరుకు భవనాల్లో అరకొర వసతుల మధ్య నిర్వహిస్తున్నారు. వివిధ పనులపై వచ్చే ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నారు. వైకాపా పాలనా తీరుకు ఉమ్మడి జిల్లాలో వీటి దుస్థితే నిదర్శనం.
ఇక్కడ పంచాయతీ కార్యాలయమే గతి..
వీరఘట్టం: మండలంలోని చిట్టపుడివలసలో పంచాయతీ కార్యాలయంలోని రెండు ఇరుకు గదుల్లో సచివాలయం నిర్వహిస్తున్నారు. ఇక్కడ భవన నిర్మాణానికి రూ.40లక్షలు మంజూరయ్యాయి. దీని నిర్మాణం చివరిదశలో నిలిచిపోయింది. పీహెచ్సీ, ఆర్బీకే, ఈ భవన నిర్మాణం ఒక్కరే చేయిస్తుండడంతో జాప్యం జరిగింది. దీనిపై ఇంజినీర్ రమేష్ను అడగ్గా దాదాపు పూర్తయ్యిందన్నారు. త్వరలో అప్పగిస్తామన్నారు.
సగమే కట్టారు..
శంబరలో పునాదుల్లోనే భవన నిర్మాణం
సాలూరు: నియోజక వర్గంలోని సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల్లో 56 సచివాలయ భవనాలు మంజూరు కాగా, ఇప్పటికి 27 మాత్రమే పూర్తి చేశారు. మిగిలిన భవనాల పనులు పునాదులు, గోడలు, స్తంభాల దశలోనే ఉన్నాయి. శంబర, కూర్మరాజుపేట, కరాసువలస, మరిపల్లి, పాచిపెంట-2లో పునాదుల్లో ఉండగా, గురివినాయుడుపేట, కర్రివలస, పాచిపెంట-1, పనుకువలస, రాయిగుడ్డివలస భవనాలు గ్రౌండ్ ఫ్లోర్లో నిలిచాయి. మూటకూడు, గంజాయిభద్ర, పట్టుచెన్నారు, సంపంగిపాడులో అసలు ప్రారంభించలేదు. చేసిన పనులకు సకాలంలో బిల్లులు మంజూరు కాకపోవడమే దీనికి కారణం. పనులు పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టామని పంచాయతీరాజ్ డీఈ చిన్నంనాయుడు తెలిపారు.
కొనసా...గుతున్నాయ్!
మెంటాడ (గజపతినగరం): ఇది మెంటాడ మండలం బడేవలసకు చెందిన గ్రామ సచివాలయ భవన నిర్మాణం. ఏడాదిగా దీని నిర్మాణం అలాగే ఉంది. ప్రస్తుతం ఆర్బీకేలో నడుస్తోంది. ఒకే కార్యాలయంలో సచివాలయం, ఆర్బీకే సిబ్బందికి విధుల నిర్వహణలో ఇబ్బంది పడుతున్నారు. బిల్లుల చెల్లింపులు లేక పనులు నిలిచాయి. కె.ఎల్.వలసలో పంచాయతీ కార్యాలయంలో సచివాలయం నిర్వహిస్తున్నారు. చెల్లింపులు లేక గుత్తేదారు పనులు నిలిపేశారు. చల్లపేటలోనూ ఇదే పరిస్థితి. మండలంలో 19 సచివాలయాల్లో పదింటికి భవనాల సమస్య ఉంది. దీనిపై మండల ఇంజినీరింగ్ అధికారి గౌతమ్ వద్ద ప్రస్తావించగా గుత్తేదారులతో చర్చించి పనులు పూర్తి చేయిస్తామన్నారు.
శిథిల భవనంలో నిర్వహణ
పాచిపెంట: పాచిపెంటలో రెండు సచివాలయాలకు భవనాలు మంజూరు కాగా, పాచిపెంట-2 భవనం నిర్మాణం రెండేళ్లుగా పునాదుల స్థాయి దాటలేదు. మరొకటి మొండిగోడలకే పరిమితమైంది. దీంతో ఖాళీగా ఉన్న ఎస్సీ బాలుర వసతి గృహంలో సచివాలయం-2 నిర్వహిస్తున్నారు. ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇది శిథిలావస్థకు చేరడంతో స్లాబు పెచ్చులూడి కింద పడుతుండడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గ్రామ కార్యదర్శి నవీన్ కుమార్ ‘న్యూస్టుడే’తో మాట్లాడుతూ వేరొక చోట నిర్వహణకు అవకాశం లేక ఇక్కడ పెట్టామన్నారు.
ఇరుకు గదుల్లోనే పాలన
భోగాపురం: మండలంలో సచివాలయాల నిర్మాణం చాలాచోట్ల పూర్తికాలేదు. రామచంద్రపేట పంచాయతీలో భవన నిర్మాణం చేపట్టగా.. ఆ భూమి తమదేనని కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో పనులు జరగక.. సచివాలయానికి వసతి సమస్య ఏర్పడింది. పాత పంచాయతీ భవనంలోనే సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కటే గది కావడంతో అందరికీ సరిపడా సీట్లు కూడా లేని పరిస్థితి. ఇబ్బందులున్నా సర్దుకుపోతున్నామని పంచాయతీ కార్యదర్శి రమణమ్మ తెలిపారు.
తొమ్మిదిలో ఆరు పరాయి పంచనే..
పాలకొండ, గ్రామీణం: నగరపంచాయతీ పరిధిలో తొమ్మిది సచివాలయాలకు గాను ఆరు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఎన్కేరాజపురం, బాసూరువారివీధి, కోమటిపేట, గారమ్మకాలనీ, శెగిడివీధి, కోరాడవీధుల్లో ఏళ్లుగా అద్దె ఇళ్లలో కొనసాగుతున్నాయి. ఇరుకుగా ఉండడంతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. మండలంలో 22 సచివాలయాలకు 14 మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన 8 పాత పంచాయతీ భవనాల్లో నిర్వహిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాలోనే విజయనగరం అభివృద్ధి
[ 08-05-2024]
విజయనగరం గడ్డపై పసుపుజెండా ఎగరాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిలపునిచ్చారు. మంగళవారం సాయంత్రం విజయనగరంలోని అయోధ్య మైదానంలో జరిగిన యువగళం సభలో ఆయన మాట్లాడారు. -
జనం ఆస్తులకు జగన్ గండం
[ 08-05-2024]
దేశంలో ఎక్కడా అమలుకాని భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని సీఎం జగన్ రాష్ట్రంలో ప్రవేశ పెట్టడంతో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని కూటమి కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని తోయక జగదీశ్వరి ఆరోపించారు. -
ఆంక్షలు లేని సంక్షేమం అభివృద్ధి నిలయంగా మన్యం
[ 08-05-2024]
‘రాష్ట్రంలో కూటమి గెలుపు ఖాయమైంది. మరికొద్ది రోజుల్లో జగన్ రాక్షస పాలన అంతం కాబోతోంది. ఆర్థికంగా, అభివృద్ధిపరంగా గాడితప్పిన ఈ రాష్ట్రాన్ని మోదీ నిబద్ధత, చంద్రబాబు సమర్థత, పవన్ కల్యాణ్ చతురతతో పునఃనిర్మాణం చేసుకుంటాం. -
హింసోద్ధారకుడు
[ 08-05-2024]
నీళ్లడిగారో ఇళ్లకొచ్చి కొడతారు.. రోడ్డు ఊసెత్తారో ఊపిరి తీసేస్తారు.. అభివృద్ధి మాటెత్తితే ఆ మాటే లేకుండా చేస్తారు.. ప్రశ్నిస్తే పగ.. నిలదీస్తే నింద.. దారికాసి దాడులు.. దౌర్జన్యాలు..దోపిడీలు.. అడుగడుగునా వేధింపులు.. ఎక్కడికక్కడే హత్యలు.. అత్యాచారాలు.. ఇదీ వైకాపా అయిదేళ్ల పాలన.. -
విజయనగరం గడ్డపై పసుపు జెండా ఎగరాలి
[ 08-05-2024]
కేంద్రంలో మనకోసం స్వరం విప్పే ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు. ఆయన్ను గెలిపించి పార్లమెంట్లో అడుగు పెట్టించాలి. -
మా ఓటెక్కడ?
[ 08-05-2024]
ఉద్యోగుల పోస్టల్ బ్యాలËట్ విషయంలో గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి. దరఖాస్తు చేసుకున్న వారిలో కొంతమందికి ఓట్లు లేకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఏం తినేది.. ఎలా బతికేది జగన్!
[ 08-05-2024]
ఆర్థిక దన్ను లేకపోతే జీవితం సాఫీగా సాగదు. అందుకే సంపాదనలో కొంత మొత్తాన్ని మున్ముందు అవసరాలకు పొదుపు చేయడం అత్యవసరంగా భావిస్తారు. ఖర్చులు పోగా మిగిలితే పొదుపు చేయడానికి ఆస్కారం ఉంటుంది. -
‘దివ్యాంగుల ఉసురు జగన్కు తగులుతుంది’
[ 08-05-2024]
దివ్యాంగుల ఉసురు జగన్ ప్రభుత్వానికి తగులుతుందని రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు గోనుగుంట కోటీశ్వరరావు అన్నారు. మంగళవారం బొబ్బిలిలో తెదేపా ఆధ్వర్యంలో జరిగిన జిల్లాస్థాయి దివ్యాంగుల సమావేశంలో మాట్లాడారు. -
వర్షంతో ఉపశమనం
[ 08-05-2024]
ఎండ వేడిమితో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు మంగళవారం కురిసిన వర్షం ఉపశమనాన్ని కలిగించింది. సోమవారం రాత్రి నుంచి వర్షం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 14.50 మి.మీ సరాసరి వర్షపాతం నమోదైంది. -
ప్రజల భూములు కాజేసేందుకే నల్లచట్టం
[ 08-05-2024]
ప్రజల భూములను కాజేసేందుకే వైకాపా ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్టును అమలు చేసేందుకు నిర్ణయించిందని తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి పడాల భూదేవి అన్నారు. -
అక్షరంపై అంకుశం
[ 08-05-2024]
విద్యల నగరంగా ఖ్యాతి పొందిన ఉమ్మడి విజయనగరం జిల్లాకు నిరక్ష్యరాస్యతశాపంగా మారుతోంది. రాష్ట్ర విభజనకు ముందు, తర్వాత అక్షరాస్యతలో జిల్లాది రాష్ట్రంలో అట్టడుగు స్థానమే.