ఓటింగ్ శాతం పెంపునకు కృషి
జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్నికల పరిశీలకులు హనీష్ చాబ్రా, తలాత్ పర్వేజ్ కోరారు.
మాట్లాడుతున్న పరిశీలకులు హనీష్ చాబ్రా, తలాత్ పర్వేజ్
విజయనగరం అర్బన్, న్యూస్టుడే: జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్నికల పరిశీలకులు హనీష్ చాబ్రా, తలాత్ పర్వేజ్ కోరారు. ఓట్ల స్లిప్పులను పూర్తి వివరాలతో శతశాతం పంపిణీ చేయాలని ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. మారుమూల ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలకు సిబ్బంది చేరుకునేందుకు అనువైన వాహనాలను సమకూర్చాలన్నారు. నామినేషన్ ప్రక్రియ పూర్తయినందున కోడ్ ఉల్లంఘనలు జరిగే అవకాశముందని, ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లోకి చరవాణులు, కెమెరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పోలీసు విభాగం పరిశీలకుడు సచీంద్ర పటేల్ మాట్లాడుతూ శాంతియుత వాతావరణంలో పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. శనివారం ఉదయం 10.30 గంటల నుంచి 11.30 వరకు పోలీసు అతిథిగృహంలో ఫిర్యాదులు స్వీకరించనున్నామని, చరవాణి ద్వారా తెలియజేయాలనుకుంటే 70751 96069 నంబరును సంప్రదించాలన్నారు. కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ దీపిక ఎం.పాటిల్, సంయుక్త కలెక్టర్ కె.కార్తీక్, సహాయ కలెక్టర్ వెంకట త్రివినాగ్, డీఆర్వో ఎస్.డి.అనిత పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హింసోద్ధారకుడు
[ 08-05-2024]
నీళ్లడిగారో ఇళ్లకొచ్చి కొడతారు.. రోడ్డు ఊసెత్తారో ఊపిరి తీసేస్తారు.. అభివృద్ధి మాటెత్తితే ఆ మాటే లేకుండా చేస్తారు.. ప్రశ్నిస్తే పగ.. నిలదీస్తే నింద.. దారికాసి దాడులు.. దౌర్జన్యాలు..దోపిడీలు.. అడుగడుగునా వేధింపులు.. ఎక్కడికక్కడే హత్యలు.. అత్యాచారాలు.. ఇదీ వైకాపా అయిదేళ్ల పాలన.. -
విజయనగరం గడ్డపై పసుపు జెండా ఎగరాలి
[ 08-05-2024]
కేంద్రంలో మనకోసం స్వరం విప్పే ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు. ఆయన్ను గెలిపించి పార్లమెంట్లో అడుగు పెట్టించాలి. -
మా ఓటెక్కడ?
[ 08-05-2024]
ఉద్యోగుల పోస్టల్ బ్యాలËట్ విషయంలో గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి. దరఖాస్తు చేసుకున్న వారిలో కొంతమందికి ఓట్లు లేకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఏం తినేది.. ఎలా బతికేది జగన్!
[ 08-05-2024]
ఆర్థిక దన్ను లేకపోతే జీవితం సాఫీగా సాగదు. అందుకే సంపాదనలో కొంత మొత్తాన్ని మున్ముందు అవసరాలకు పొదుపు చేయడం అత్యవసరంగా భావిస్తారు. ఖర్చులు పోగా మిగిలితే పొదుపు చేయడానికి ఆస్కారం ఉంటుంది. -
‘దివ్యాంగుల ఉసురు జగన్కు తగులుతుంది’
[ 08-05-2024]
దివ్యాంగుల ఉసురు జగన్ ప్రభుత్వానికి తగులుతుందని రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు గోనుగుంట కోటీశ్వరరావు అన్నారు. మంగళవారం బొబ్బిలిలో తెదేపా ఆధ్వర్యంలో జరిగిన జిల్లాస్థాయి దివ్యాంగుల సమావేశంలో మాట్లాడారు. -
వర్షంతో ఉపశమనం
[ 08-05-2024]
ఎండ వేడిమితో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు మంగళవారం కురిసిన వర్షం ఉపశమనాన్ని కలిగించింది. సోమవారం రాత్రి నుంచి వర్షం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 14.50 మి.మీ సరాసరి వర్షపాతం నమోదైంది. -
ప్రజల భూములు కాజేసేందుకే నల్లచట్టం
[ 08-05-2024]
ప్రజల భూములను కాజేసేందుకే వైకాపా ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్టును అమలు చేసేందుకు నిర్ణయించిందని తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి పడాల భూదేవి అన్నారు. -
అక్షరంపై అంకుశం
[ 08-05-2024]
విద్యల నగరంగా ఖ్యాతి పొందిన ఉమ్మడి విజయనగరం జిల్లాకు నిరక్ష్యరాస్యతశాపంగా మారుతోంది. రాష్ట్ర విభజనకు ముందు, తర్వాత అక్షరాస్యతలో జిల్లాది రాష్ట్రంలో అట్టడుగు స్థానమే.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్