logo

రైలు ఢీకొని హోంగార్డు...

మండలంలోని కె.కృష్ణాపురం రైల్వే గేటు సమీపంలో పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు బొకారో ఎక్స్‌ప్రెస్‌ రైలు కిందపడి అదే గ్రామానికి చెందిన హోంగార్డు మంత్రి నరసింహారావు(45) మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల

Published : 21 May 2022 04:33 IST


నరసింహారావు (పాత చిత్రం)

దత్తిరాజేరు, న్యూస్‌టుడే: మండలంలోని కె.కృష్ణాపురం రైల్వే గేటు సమీపంలో పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు బొకారో ఎక్స్‌ప్రెస్‌ రైలు కిందపడి అదే గ్రామానికి చెందిన హోంగార్డు మంత్రి నరసింహారావు(45) మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విజయనగరం రైల్వే ఎస్‌.ఐ. రవివర్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నరసింహారావు గజపతినగరం పోలీసు స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నారు. ఇతనికి భార్య నాగలక్ష్మి, కుమార్తెలు జాహ్నవి(15), లాస్య(8) ఉన్నారు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని