ఇక సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు
సచివాలయాలు ఇక రిజిస్ట్రేషన్ కేంద్రాలుగా మారనున్నాయి. ఈ మేరకు ఆస్తుల క్రయ, విక్రయాలు నిర్వహించేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సిద్ధమైంది. విజయనగరం జిల్లా పరిధిలో 116 సచివాలయాలున్నాయి.
జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో సిబ్బందికి అవగాహన కల్పిస్తున్న అధికారులు
విజయనగరం కోట, న్యూస్టుడే: సచివాలయాలు ఇక రిజిస్ట్రేషన్ కేంద్రాలుగా మారనున్నాయి. ఈ మేరకు ఆస్తుల క్రయ, విక్రయాలు నిర్వహించేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సిద్ధమైంది. విజయనగరం జిల్లా పరిధిలో 116 సచివాలయాలున్నాయి. సంబంధిత సిబ్బందికి ఇప్పటికే జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో అవగాహన కల్పించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మరో 15 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. అంతే కాకుండా శాఖా పరంగా ప్రక్రియ సజావుగా సాగేందుకు వీలుగా సాఫ్ట్వేర్ అనుసంధానంతో పాటు, అవసరమైన వెబ్ కెమెరాలను సమకూర్చారు.
ఇప్పటి వరకు ఆస్తుల రిజిస్ట్రేషన్ కేవలం సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే జరిగేది. ఇక నుంచి సచివాలయాలకూ వెళ్లొచ్చు. సంబంధిత రిజిస్ట్రేషన్ల సంఖ్యలను మాత్రం శాఖ పరంగా కేటాయించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో ఇప్పటికే 168 గ్రామాల్లో సమగ్ర భూ సర్వే పూర్తయింది. ఆయా ప్రాంతాల వారు సమీపంలోని సచివాలయాలకు వెళ్లి సేవలు పొందవచ్చు. సర్వే నంబరు ఆధారంగా సిబ్బంది మార్కెట్ ధర నిర్ధరిస్తారు. ల్యాండ్ పార్శిల్ మ్యాప్ మెంబర్(ఎల్పీఎం) ద్వారా ధరల మార్పును పరిశీలిస్తారు. అనంతరం శాఖాధికారుల పరిశీలనకు పంపిస్తారు. అక్కడ నంబరు కేటాయించిన తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తిచేయనున్నారు. దీనిపై ఇప్పటికే సిబ్బందికి తగిన తర్ఫీదునిచ్చామని జిల్లా రిజిస్ట్రార్ సృజన తెలిపారు. ప్రజలు ముందుకొచ్చి, సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలుసా జగన్.. ప్రాణాల విలువ
[ 27-04-2024]
జగన్.. నా గిరిజనులు అన్నావ్.. అన్నగా అండగా ఉంటానన్నావ్.. మరి ఎందుకు కొండ శిఖర గ్రామాలను వదిలేశావ్.. -
116 నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
ఎన్నికలకు సంబంధించి ఎంపీ, నియోజకవర్గ స్థానాలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన శుక్రవారం ముగిసింది. సక్రమంగా లేని 116 నామపత్రాలను అధికారులు తిరస్కరించారు. -
ఓటింగ్ శాతం పెంపునకు కృషి
[ 27-04-2024]
జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్నికల పరిశీలకులు హనీష్ చాబ్రా, తలాత్ పర్వేజ్ కోరారు. -
వైకాపాతో యువతకు నష్టం: కిమిడి
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వ పాలనలో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, యువతకు ఉపాధి అవకాశాలు లేక వలస వెళ్లిపోయారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్ గజపతిరాజు -
ఇంజినీరింగ్ విద్య.. ఓ జగన్మాయ
[ 27-04-2024]
నా ఎస్సీలు.. నా ఎస్టీలంటూనే వారిపై కపట ప్రేమ చూపించి ఆయా వర్గాల వారికి తీవ్ర అన్యాయం చేశారు సీఎం జగన్మోహన్రెడ్డి. తన సొంత కుటుంబంగా భావించి గిరిజనులకు మంచి చేస్తానని, వారి జీవితాల్లో వెలుగులు నింపుతానంటూ ప్రేమ ఒలకబోసి దెబ్బ కొట్టారు. -
నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలోని 31 కేంద్రాల్లో శనివారం పాలీసెట్ ప్రవేశ పరీక్ష జరగనుంది. ఈమేరకు విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల సమన్వయాధికారులు ఆశా రమణి, -
తెదేపాలోకి ముద్దాడ
[ 27-04-2024]
వైకాపా నేత, ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ముద్దాడ మధు యాదవ్ శుక్రవారం తెదేపాలో చేరారు. -
ప్రజల వద్దకే సేవలంటే ఇలాగేనేమో..
[ 27-04-2024]
గ్రామీణ ప్రజలకు సేవలు మరింత చేరువ చేస్తాం.. ప్రభుత్వ కార్యకలాపాలు అందుబాటులో ఉంచుతాం.. అందుకే గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం.. -
రూ.6.47 కోట్ల బంగారం, వెండి వస్తువుల స్వాధీనం
[ 27-04-2024]
వ్యానులో తరలిస్తున్న రూ.6.47 కోట్ల విలువజేసే బంగారం, వెండి వస్తువులను విజయనగరం జిల్లా డెంకాడ మండలం మోదవలస చెక్పోస్టు వద్ద పోలీసులు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. -
వీటిని చూస్తే.. పేకమేడలే సిగ్గు పడవా!!
[ 27-04-2024]
పేదలకు అన్ని వసతులతో కూడిన ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన సీఎం జగన్మోహన్రెడ్డి.. రేపోమాపో కూలిపోయే పేకమేడలు నిర్మిస్తున్నారు. -
అభివృద్ధిపైనా అక్కసేనా?
[ 27-04-2024]
ప్రభుత్వాలు మారినా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ.. ఇందుకు విరుద్ధంగా ఉంది వైకాపా ప్రభుత్వం తీరు.. ప్రజల అవసరాలతో పని లేదన్నట్లు గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులు నిలిపేసి అక్కసు ప్రదర్శించింది.