ఓరుగల్లు.. సాగునీటి వనరుల ఖిల్లా!
రాష్ట్రం ఏర్పాటు తర్వాత సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ఓరుగల్లు సాగునీటి వనరులు ఖిల్లాగా మారింది. ఇదివరకే కాకతీయుల నాటి గొలుసుకట్టు చెరువులతో కళకళలాడింది.
ఈనాడు డిజిటల్,జయశంకర్ భూపాలపల్లి
మేడిగడ్డ బ్యారేజీ
రాష్ట్రం ఏర్పాటు తర్వాత సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ఓరుగల్లు సాగునీటి వనరులు ఖిల్లాగా మారింది. ఇదివరకే కాకతీయుల నాటి గొలుసుకట్టు చెరువులతో కళకళలాడింది. గోదావరిపై నూతనంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు సైతం ఉమ్మడి జిల్లాలో ఉంది. ఫలితంగా పంటల సాగు సైతం పెరిగింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ‘సాగునీటి దినోత్సవం’ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో సాగునీటి వనరులపై కథనం.
* సాగునీటి దినోత్సవాన్ని పురస్కరించుకుని రామప్పలో మంత్రి కేటీఆర్ సరస్సు వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొననున్నారు.
* ప్రతి నియోజకవర్గంలో చెరువుల వద్ద సాగునీటి దినోత్సవాన్ని నిర్వహించ నున్నారు.
మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ
రామప్ప సరస్సు
ఎనిమిది శతాబ్దాల క్రి¨తమే సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు కాకతీయులు గొలుసుకట్టు చెరువులు నిర్మించారు. నేటికీ ఉమ్మడి జిల్లాలో ప్రధాన వనరు కాకతీయుల చెరువులే. రామప్ప, లక్నవరం, గణపసముద్రం, తదితర చెరువులు వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో దాదాపు 8 వేలకు పైగా చెరువులున్నాయి. మిషన్ కాకతీయ పథకంతో 2 వేల చెరువుల్లో పూడిక తీసి పునరుద్ధరించారు. దీంతో సాగునీటి సమస్య పరిష్కారమైంది. నియోజకవర్గానికో చెరువును మినీ ట్యాంక్ బండ్లా నిర్మించి ఆహ్లాదభరితంగా రూపొందించారు.
దేవాదులకు అనుసంధానంగా..
మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు దేవాదుల. ఏడు లక్షల ఎకరాల సాగునీరు లక్ష్యంగా నిర్మించిన దేవాదుల ఉమ్మడి వరంగల్ జిల్లాకు సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తోంది. రాష్ట్రం ఏర్పడ్డాక మూడో దశ పనులు వేగవంతం అయ్యాయి. దేవాదుల నుంచి ఏడాదికి 70 టీఎంసీˆలను ఎత్తిపోసేందుకు దేవాదులకు అనుసంధానంగా నిర్మించిన సమ్మక్కసాగరం(తుపాకులగూడెం) అందుబాటులోకి వచ్చింది. వేసవిలోనూ ఎత్తిపోస్తున్నారు.
కాళేశ్వరంతో జీవనదిగా గోదావరి
వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే గోదావరిలో నీరుండేది. వేసవి కాలంలో గోదావరి నీటిధారలు కూడా కనిపించేవి కావు. నేడు కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎల్లంపల్లి నుంచి మేడిగడ్డ వరకు గోదావరిలో జలకళ ఉట్టిపడుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలతో పాటు, కాళేశ్వరం పంప్హౌస్ నిర్మించారు. 45 లక్షల ఎకరాల సాగునీటి లక్ష్యంతో నిర్మించిన ప్రాజెక్టు ఈ ఏడాది 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించినట్లు అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్కు మధ్యమానేరు, ఎల్ఎండీ నుంచి ఎస్సారెస్పీ డీబీఎం ద్వారా సాగునీరు అందుతోంది. గతంలో వర్షాకాలంలోనే ఎస్సారెస్పీ నుంచి సాగునీరు వచ్చేది. నేడు రెండు పంటలకు చివరన ఉన్న నర్సంపేట, ములుగు, భూపాలపల్లి, నియోజకవర్గాలకు కూడా సరఫరా అవుతోంది.
ఇది గొప్ప ప్రాజెక్టు
ఎన్. వెంకటేశ్వర్లు, ఈఎన్సీ రామగుండం
కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రానికి ఎంతో మేలు కలుగుతోంది. వెనక్కు ఎత్తిపోతలనేది ప్రపంచంలోనే ఎక్కడా లేదు. సీఎం కేసీఆర్ ఆలోచనతో ఇది సాధ్యమైంది. దీంతో రాష్ట్రానికి 70 శాతం వరకు నీటి అవసరాలు తీరుతాయి. గోదావరిపై బ్యారేజీల నిర్మాణంతో నదికి జీవకళ వచ్చింది. 6 నుంచి ఏడున్నర మీటర్ల వరకు భూగర్భ జలాలు పెరిగాయి. గతంలో ఎస్సారెస్పీ నీటి ద్వారా ఒక పంటే సాగుచేసేవారు. కాళేశ్వరం నీటితో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, తదితర ప్రాంతాల్లో రెండు పంటలు పండిస్తున్నారు. వరి సాగు రెండున్నర రెట్లు పెరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మట్టి కప్పుతూ.. మాయ చేస్తూ..!
[ 04-05-2024]
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కళ్ల ముందే.. దోచేస్తున్నా.. రైతులు ఏమీ చేయలేని పరిస్థితుల్లో మిన్నకుండి పోతున్నారు. -
ఎక్కడ తూటా పేలినా ఇక్కడ ఉలికిపాటు!
[ 04-05-2024]
మావోయిస్టు ఉద్యమ ప్రస్థానంలో ఉమ్మడి వరంగల్ జిల్లాది కీలకపాత్ర. పీపుల్స్వార్ ఉద్యమంలో చేరి కీలక పదవులను చేపట్టారు. -
ఓరుగల్లు వాసికి భారాస అవకాశం
[ 04-05-2024]
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఏనుగుల రాకేశ్రెడ్డిని తమ అభ్యర్థిగా భారాస ప్రకటించింది. -
జాతీయ రహదారి.. అభివృద్ధికి మార్గసూచి!
[ 04-05-2024]
రాష్ట్రంలో జాతీయ రహదారుల అనుసంధానం కలిగిన జిల్లాల్లో ఖమ్మం తర్వాత ఉమ్మడి వరంగల్ ఉంటుంది. ఇవి వరంగల్, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఎనిమిది ప్రాంతాల్లో దాదాపు 847.62 కి.మీ. విస్తరించాయి. -
రేపటి నీట్కు పకడ్బందీ ఏర్పాట్లు
[ 04-05-2024]
ఇంటర్మీడియట్ బైపీసీ పూర్తి చేసిన విద్యార్థులకు వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఈ నెల 5న ఆదివారం నిర్వహించనున్న జాతీయ అర్హత పరీక్ష -2024 (నీట్)కు నగరంలో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. -
ఓటు సామాజిక బాధ్యత
[ 04-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు సామాజిక బాధ్యత అని, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. -
‘కడియంది వెన్నుపోట్ల చరిత్ర’
[ 04-05-2024]
ఓటర్లు తనను ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని భాజపా వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేష్ అన్నారు. -
వేసవి సెలవులు.. ఆటపాటలతో బాలానందం కొలువు
[ 04-05-2024]
వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు బాలలు సిద్ధమయ్యారు. -
మట్టిని కొల్లగొడుతున్నారు!
[ 04-05-2024]
జిల్లా కేంద్రంలో మొరం, మట్టి వ్యాపారాన్ని కొందరు గుత్తేదారులు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. -
కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారం
[ 04-05-2024]
‘రాష్ట్రంలో గత ప్రభుత్వం స్కీముల పేరిట అన్ని పథకాలను స్కాములుగా తయారు చేసి ఆర్థికంగా విధ్వంసం సృష్టించింది.. దేశసమైక్యతను దెబ్బతీసిన భాజపా ఈ ఎన్నికల్లో ఓడిపోతుంది.. -
నోరు మెదపని వారిని లోక్సభకు పంపొద్దు: సీతారాంనాయక్
[ 04-05-2024]
నోరు మెదపని వారిని పార్లమెంట్కు పంపొద్దని భాజపా ఎంపీ అభ్యర్థి అజ్మీర సీతారాంనాయక్ కోరారు. -
దివ్యాంగులు, వయోవృద్ధులు ఇంటి నుంచే ఓటు
[ 04-05-2024]
వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం ఎన్నికల అధికారులు శుక్రవారం నుంచి ఇంటి వద్దనే ఓటింగ్ ప్రక్రియను చేపట్టారు. -
8న లక్ష్మీపురంలో ప్రధాని మోదీ బహిరంగ సభ
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం తిమ్మాపురం గ్రామంలోని లక్ష్మీపురంలో ఈ నెల 8న నిర్వహించనున్న ప్రధాని మోదీ బహిరంగ సభకు భాజపా శ్రేణులు శుక్రవారం స్థలాన్ని పరిశీలించారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితాలో తప్పులు
[ 04-05-2024]
వరంగల్ జిల్లా ఖానాపురంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితాలో తప్పులు చోటు చేసుకున్నాయి. -
రూ.2తో ఓటు సవాలు
[ 04-05-2024]
కేవలం రూ.2లతో ఓటును సవాలు (ఛాలెంజ్) చేసే అవకాశం పోలింగ్ కేంద్రంలో కూర్చునే ఏజెంట్కు మాత్రమే ఉంటుంది. -
దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ తెలుసు..
[ 04-05-2024]
వ్యాపారి నుంచి రూ.5 కోట్లు వసూలు చేశారు. డబ్బులు ఇవ్వాలని బాధితుడు నిలదీస్తే ‘మాకు దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ తెలుసు. -
ద్విచక్రవాహనంతో సహా బావిలో పడి ఒకరి మృతి
[ 04-05-2024]
రోడ్డు పక్కనున్న వ్యవసాయ బావిలో ద్విచక్రవాహనం పడిపోవడంతో ఒకరు మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లిలో చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
నిజ్జర్ హత్య కేసు.. ఆ ముగ్గురు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు..!
-
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
-
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?
-
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్