అటకెక్కిన ఆధునికీకరణ
మంగపేట మండలం నర్సింహసాగర్ సమీపంలో వర్షాధారంగా నిర్మించిన మల్లూరు వాగు ప్రాజెక్ట్ను ఆధునికీకరించాల్సిన అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.
మల్లూరు వాగు ప్రాజెక్ట్
న్యూస్టుడే, మంగపేట: మంగపేట మండలం నర్సింహసాగర్ సమీపంలో వర్షాధారంగా నిర్మించిన మల్లూరు వాగు ప్రాజెక్ట్ను ఆధునికీకరించాల్సిన అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. కుడి, ఎడమ కాలువలకు మరమ్మతులను అధికారులు చేపట్టకపోవడంతో పంటలకు సాగు నీరందక అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు. రెండు దశాబ్దాల పాటు సక్రమంగా నీరందించినా, తరువాత అధికారుల నిర్లక్ష్యంతో ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందకుండా పోతోంది. ప్రాజెక్ట్ కుడి, ఎడమ కాలువల తూములు లీకేజీ వల్ల ప్రాజెక్ట్లోకి చేరిన నీరు వృథాగా గోదావరిలో కలిసిపోతోంది. మరోవైపు కాలువల్లో పూడిక తీయకపోవడం, చెట్లు పెరగడం మూలాన ఆయకట్టుకు నీరందటం లేదు. ఏటా సంబంధిత అధికారులకు రైతులు మొర పెట్టుకుంటున్నా ఆలకించే వారు లేరు. 2009- 2010లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్.రాజశేఖర్రెడ్డి హయాంలో అప్పటి భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రాజెక్ట్ ఆధునీకరణ పనులను ప్రారంభించారు. యంత్రాంగం నిర్లక్ష్యంతో ఐదేళ్లకే మళ్లీ కాలువలు పూడికపడ్డాయి. చెట్టుచేమ మొలిచి కాలువలు కనిపించడం లేదు. 2016 జూన్లో అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి చందులాల్ ప్రాజెక్ట్ను సందర్శించి నిధులకు హామీ ఇచ్చినా విడుదల కాలేదు. ఇటీవల నామినేటెడ్ పనుల కింద రూ. 5 లక్షలు మంజూరవగా, ప్రాజెక్ట్ కట్టపై చెట్లు తొలగించి మొరం పోశారు. ఇప్పటికైనా ప్రాజెక్టు ఆధునికీకరణకు అవసరమైన రూ.30 కోట్లు మంజూరు చేయాలని, తక్షణం కాలువల్లో పూడికతీత, చెట్ల తొలగింపునకు కనీసం రూ.2 కోట్లు కేటాయించాలని రైతులు కోరుతున్నారు.
బోరునర్సాపురం వద్ద ఎడమ కాలువలో ఏపుగా పెరిగిన చెట్లు
లబ్ధి చేకూరే గ్రామాలు: కుడి కాలువ పరిధిలో నర్సింహసాగర్, గాంధీనగర్, పూరేడుపల్లి, శనిగకుంట, మల్లూరు, చుంచుపల్లి, రమణక్కపేట, వాగొడ్డుగూడెం. ఎడమ కాలువ పరిధిలో నీలాద్రిపేట, బాలన్నగూడెం, బుచ్చంపేట, తిమ్మంపేట, చెరుపల్లి, జబ్బోనిగూడెం, బోరునర్సాపురం
చేపట్టాల్సిన పనులు
- కుడి ఎడమ కాలువల తూముల వద్ద లీకేజీ అరికట్టాలి.
- ప్రాజెక్ట్ కుడి ఎడమ కాలువల్లో పూడిక తీయాలి.
- కాల్వల్లో చెట్లు పిచ్చి మొక్కలు తొలగించాలి
- ప్రాజెక్టు మత్తడికి మరమ్మతులు చేయాలి.
ప్రాజెక్టు: మల్లూరు వాగు
నిర్మాణం ప్రారంభం: 1976
నిర్మాణం పూర్తి: 1980
కుడి కాలువ ఆయకట్టు: 4,300 ఎకరాలు
ఎడమ కాలువ ఆయకట్టు: 3,500 ఎకరాలు
2009-10లో ఆధునికీకరణకు కేటాయించిన నిధులు: రూ.14 కోట్లు
ప్రస్తుతం అవసరమైన నిధులు: రూ.30 కోట్లు
అధికారులు పట్టించుకోవాలి
గాదె శ్రావణ్కుమార్, ప్రాజెక్ట్ మాజీ ఛైర్మన్
ఏటా తూముల మరమ్మతులు చేయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. శాశ్వత మరమ్మతులు చేపట్టడం లేదు. వర్షాకాలం ప్రారంభం కాకముందే పనులు చేపడితే ఆయకట్టు రైతులకు మేలు కలుగుతుంది.
లీకేజీలు చేయించాం..
వలీ మహ్మద్, ఇరిగేషన్ ఏఈ
తూములకు మరమ్మతు చేయించి లీకేజీలు అరికట్టాం. కాలువల్లో ఉన్న పూడికమట్టిని తొలగించేందుకు సంబంధిత అధికారులకు అంచనాలు వేసి పంపించాం. నిధుల మంజూరైతే వెంటనే పనులు చేపడతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
23,57,331 మంది ఓటేశారు..!
[ 15-05-2024]
వరంగల్, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లో సోమవారం జరిగిన పోలింగ్కు ఓటర్లు పోటెత్తారు. -
పరిహారం చెల్లించరు.. పనులు ప్రారంభించరు!
[ 15-05-2024]
రామప్ప నుంచి లక్నవరం జలాశయం వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం భూ సేకరణ చేయనున్న స్థలమిది. -
అందరి సహకారంతో ఎన్నికలు విజయవంతం
[ 15-05-2024]
అందరి సహకారంతో ములుగు జిల్లాలో లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం పోలింగ్ నిర్వహణపై ఆమె ప్రకటన విడుదల చేశారు. -
ప్రకటన బోర్డులు భద్రమేనా..!
[ 15-05-2024]
ఇటీవల ముంబయి మెట్రో నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఈదురుగాలుల బీభత్సానికి ఘట్కోపర్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం భారీ హోర్డింగ్ నేలకూలడంతో పది మందికి పైగా మరణించగా.. 80 మంది వరకు గాయపడ్డారు. -
కాస్త విశ్రాంతి..!
[ 15-05-2024]
రెండు నెలలుగా సాగిన లోక్సభ ఎన్నికల పోరులో అభ్యర్థులు తీరిక లేకుండా పనిచేశారు. ఎన్నికల షెడ్యూలు వచ్చిన నాటి నుంచి టికెట్టు కోసం పార్టీల అధిష్ఠానాలను ప్రసన్నం చేసుకోవడం, -
ఎవరి అంచనాలు వారివే..!
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ సోమవారం ముగియడంతో ఫలితాలు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి. -
ఫలితం నిక్షిప్తం.. భద్రత కట్టుదిట్టం
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రజా తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. వరంగల్ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఈవీఎంలను.. సాధారణ పరిశీలకురాలు స్వాగత్ రణ్వీర్చంద్, -
పెరిగిన వినియోగం..బిల్లుల భారం
[ 15-05-2024]
మండే ఎండలు.. భరించలేని ఉక్కపోత.. వీటి నుంచి ఉపశమనం పొందడానికి ఏప్రిల్, మే మొదటి వారంలో కరెంటు వినియోగం బాగా పెరిగింది. -
పట్టణ ఓటర్లు..పట్టించుకోలే!
[ 15-05-2024]
అక్షరాస్యులు ఎక్కువగా ఉన్న పట్టణ ప్రాంత ఓటర్ల కంటే.. గ్రామీణుల్లో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది.. వంద శాతం పోలింగ్ జరిగేందుకు ప్రభుత్వం పట్టణ ప్రజలకు అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టినా నిర్లిప్తత వీడలేదు.. -
పది విద్యార్థులకు ఆదర్శ కళాశాలల ఆహ్వానం
[ 15-05-2024]
ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపి, రానున్న 2024-25 విద్యా సంవత్సరంలో ఇంటర్ విద్యకు ఎదురు చూస్తున్న విద్యార్థులకు ఆదర్శ కళాశాలలు ప్రవేశాలకు ఆహ్వానం పలుకుతున్నాయి. -
క్రాస్ ఓటింగ్.. ఎవరికి లాభమో..?
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికలు ముగిశాయి.. ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమెంది. మూడు రాజకీయ పార్టీల నేతలు సుమారుగా నెల రోజుల పాటు హోరాహోరీ ప్రచారం నిర్వహించారు. -
ఆదర్శ పోలింగ్ కేంద్రాల్లో.. అంతంత మాత్రమే!
[ 15-05-2024]
ఓటర్లందరు ఓటు వేసేలా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అనేక సంస్కరణలు అమలవుతున్నాయి. -
ఎమ్మెల్యేలతో మమేకమై పనిచేస్తా
[ 15-05-2024]
పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు లోక్సభ ఎన్నికల్లో తన విజయం కోసం ఎంతో కృషి చేశారని, తాను గెలిస్తే వారితో మమేకమై నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను’ అని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ అన్నారు. -
ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాం
[ 15-05-2024]
ఎన్నికల్లో ఓట్లు వేసి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ తాను రుణపడి ఉంటానని ఎంపీ, భారాస అభ్యర్థి మాలోత్ కవిత అన్నారు. -
పేరు పేరునా కృతజ్ఞతలు
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల్లో తాను ఎంపీగా విజయం సాధించాలనే లక్ష్యంతో పార్లమెంట్ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో నాయకులు, కార్యకర్తలు కృషి చేశారని భాజపా అభ్యర్థి ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో వర్సిటీల ఉపకులపతుల నియామకానికి ఈసీ అనుమతి
-
మ్యూచువల్ ఫండ్ మదుపర్లకు గుడ్న్యూస్.. కేవైసీ నిబంధనల్లో సడలింపు
-
మళ్లీ కలిసిన కేఎల్ - సంజీవ్ గోయెంకా.. అభిమానికి గంభీర్ స్వీట్ రిప్లయ్!
-
ఆర్సీబీ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లుతాడా? చెన్నైతో మ్యాచ్కు వర్షం ముప్పు
-
ఆ షూటింగ్లో రెండు భుజాలకు ఎన్నో గాయాలయ్యాయి: జాన్వీ కపూర్
-
‘కడుపులో పిండానికీ జీవించే హక్కు’ - సుప్రీంకోర్టు