logo

బండిముత్యాలమ్మ సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి

పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం ముత్యాలపల్లిలో బండిముత్యాలమ్మను శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకటరామన్‌ రామసుబ్రహ్మణ్యన్‌, సరస్వతి దంపతులు దర్శించుకున్నారు.

Published : 01 Apr 2023 06:09 IST

అమ్మవారి సన్నిధిలో జస్టిస్‌ వెంకటరామన్‌ రామసుబ్రహ్మణ్యన్‌ దంపతులు

మొగల్తూరు, న్యూస్‌టుడే: పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం ముత్యాలపల్లిలో బండిముత్యాలమ్మను శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకటరామన్‌ రామసుబ్రహ్మణ్యన్‌, సరస్వతి దంపతులు దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. జస్టిస్‌ వెంకటరామన్‌ రామసుబ్రహ్మణ్యన్‌ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో డి.రామకృష్ణంరాజు, ఛైర్మన్‌ కొల్లాటి రామారావు, పాలకవర్గ సభ్యులు తదితరులు వారికి అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం, జ్ఞాపిక అందించారు. ఆయన వెంట ప్రముఖ న్యాయవాదులు దాసరి ప్రసాద్‌, సీహెచ్‌ వెంకటరామన్‌, గుడిసేవ నరసింహమూర్తి, స్వర్ణం ప్రభాకర్‌ తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని