విజిలేస్తున్నారు
జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరుగుతోంది. రాజకీయ పార్టీల వారు అనుమతులు లేకుండా ప్రచారం చేసినా, బహిరంగ ప్రదేశాల్లో హోర్డింగులు, బ్యానర్లు కట్టినా, రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయకున్నా, ఓటర్లకు తాయిలాలు పంపిణీ చేస్తున్నా, రాజకీయ విందులు ఏర్పాటు చేసినా..సామాజిక బాధ్యతగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయొచ్చు.
ఫిర్యాదులకు సత్వర స్పందన
ఏలూరు కలెక్టరేట్, కుక్కునూరు, న్యూస్టుడే: జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరుగుతోంది. రాజకీయ పార్టీల వారు అనుమతులు లేకుండా ప్రచారం చేసినా, బహిరంగ ప్రదేశాల్లో హోర్డింగులు, బ్యానర్లు కట్టినా, రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయకున్నా, ఓటర్లకు తాయిలాలు పంపిణీ చేస్తున్నా, రాజకీయ విందులు ఏర్పాటు చేసినా..సామాజిక బాధ్యతగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయొచ్చు.
ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై చర్యలు తీసుకునేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ‘సీ-విజిల్’ యాప్ను ప్రవేశపెట్టింది. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. చైతన్యవంతులైన ప్రజలు తమ ప్రాంతాల్లో నియమావళి ఉల్లంఘనలపై యాప్ ద్వారా సమాచారం పంపిస్తున్నారు.
ఇప్పటివరకు 64.. సీ-విజిల్ యాప్ ద్వారా ప్రజలు పంపే సమాచారాన్ని ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు పరిశీలిస్తూ సత్వర చర్యలు చేపడుతున్నారు. ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లోగా పరిష్కరిస్తున్నారు. ఏలూరు జిల్లాలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నాటినుంచి ఇంతవరకు యాప్నకు 64 ఫిర్యాదులు అందగా అన్నింటిని పరిష్కరించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవడంతో పాటు పలువురు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, ఇతర సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్, సంబంధిత శాఖల అధికారులు ఉత్తర్వులిచ్చారు.
ఎవరైనా సమాచారం ఇవ్వొచ్చు.. ఎవరైనా నియమావళిని ఉల్లంఘించినట్లు ప్రజలు గుర్తిస్తే సీ-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ఇందుకు కలెక్టరేట్లో ప్రత్యేకంగా ఒక విభాగం నెలకొల్పారు. ఫిర్యాదు చేసే వారి వివరాలను గోప్యంగా ఉంచుతారు. ఇటీవల ఉంగుటూరులో నియమావళి ఉల్లంఘనలపై ఓ వ్యక్తి యాప్ ద్వారా ఫిర్యాదు చేయగా.. ఆ విషయాన్ని కొంత మంది ఉద్యోగులు వైకాపా వర్గీయులకు తెలిపారు. ఈ విషయాన్ని ‘ఈనాడు’ వెలుగులోకి తేవడంతో కలెక్టర్ వెంటనే విచారణ చేయించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని తేలడంతో ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు.
నియోజవర్గాల వారీగా.. దెందులూరు 17, ఏలూరు 5, కైకలూరు 8, నూజివీడు 11, పోలవరం 13, ఉంగుటూరు 10, చింతలపూడి 0.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ రాసిన మరణ శాసనం
[ 27-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక నాటు సారా తయారీ, విక్రయాలు, వినియోగం అన్నీ పెరిగాయి. నూతన మద్యం విధానం పేరుతో రూ.60 ఉన్న క్వార్టర్ సీసాను రూ.120-150కి అమాంతం పెంచేశారు. -
మాటలు ఎక్కడో.. పనులు ఇక్కడే
[ 27-04-2024]
‘ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేస్తాం.. తొమ్మిది రకాల అభివృద్ధి పనులు చేపట్టి కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతాం’ అని సీఎం జగన్, వైకాపా నాయకుడు ఊకదంపుడు ఉపాన్యాసాలిచ్చారు. -
పార్లమెంట్ 4, అసెంబ్లీకి 26 తిరస్కరణ
[ 27-04-2024]
జిల్లాలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. ఏలూరు పార్లమెంట్కు 17 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయగా వివిధ కారణాలతో 4 తిరస్కరణకు గురయ్యాయి. -
‘భూగర్భం’లో.. కలిసిపోయిన హామీలు..!
[ 27-04-2024]
నరసాపురంలో ప్రస్తుత జనాభా సుమారు 70వేలకు చేరిందని అంచనా. 31 వార్డుల్లో 109 కి.మీ మేర డ్రెయిన్ వ్యవస్థ ఉంది. మేజర్ డ్రెయిన్ల అవుట్లెట్ పొన్నపల్లి వద్ద గోదావరిలోకి ఉంది. -
ఎన్నికల విధుల్లో అప్రమత్తత అవసరం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలని సాధారణ పరిశీలకులు దీప, ఎల్ నిర్మలారాజ్, పోలీసు పరిశీలకులు శైలేష్కుమార్సిన్హా పేర్కొన్నారు. -
జగన్ పాలనలో అంతా దోపిడీ
[ 27-04-2024]
‘అయిదేళ్ల వైకాపా పాలనలో చింతలపూడి ఎత్తిపోతల కోసం సీఎం జగన్మోహన్రెడ్డి తట్టెడు మట్టి కూడా వేయలేదు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే అవకాశం ఉన్నా పట్టించుకోలేదు. -
నామినేషన్ రోజునే గెలుపు ఖరారు: నిమ్మల
[ 27-04-2024]
తను నామినేషన్ వేసిన ఈ నెల 19న నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాది మంది స్వచ్ఛందంగా తరలి వచ్చినప్పుడే పాలకొల్లులో తన గెలుపు ఖరారయ్యిందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ధీమా వ్యక్తం చేశారు. -
నాడు జీవనాడి సవ్వడి.. నేడు జీవనం చతికిలపడి!
[ 27-04-2024]
రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను 2014-19లో తెదేపా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సోమవారాన్ని పోలవరంగా మార్చుకున్న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనులు పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అటు అధికారులు, ఇటు గుత్తేదారులను పరుగులు పెట్టించేవారు. -
రెండు గంటల ఛార్జింగ్.. 25కి.మీ. ప్రయాణం
[ 27-04-2024]
తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) విద్యార్థులు ఎలక్ట్రికల్ బైక్కు రూపకల్పన చేశారు. -
కుమారుడి జీతం నుంచి తల్లికి జీవన భృతి
[ 27-04-2024]
జన్మనిచ్చి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను బాధ్యతగా, ప్రేమగా చూసుకోవాలని బాధ్యత పిల్లలదేనని ఆర్డీవో శ్రీనివాసులరాజు అన్నారు. -
ఇంత దగానా జగన్!
[ 27-04-2024]
‘అధికారంలోకి వచ్చిన వెంటనే గోపాలమిత్రలకు న్యాయం చేస్తా. ఉద్యోగ భద్రత కల్పించి జీవనోపాధిని మెరుగుపరుస్తా..’ అంటూ గత ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చిన జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక దానిని నెరవేర్చలేదు. -
రాక్షస పాలనకు త్వరలో తెర
[ 27-04-2024]
రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలనకు త్వరలోనే తెరపడనుందని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
కూటమి వస్తేనే యువతకు ఉపాధి
[ 27-04-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి రాగానే యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు అన్నారు. -
నేడు పాలిసెట్
[ 27-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి శనివారం పరీక్ష (పాలిసెట్) నిర్వహించనున్నారు. ఏలూరు, పరిసర ప్రాంతాల్లో పరీక్ష నిర్వహణకు 11 కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్కుమార్, పరిశీలకులు దీప అభ్యర్థులు, వివిధ పార్టీల ప్రతినిధులు, ఏజెంట్ల సమక్షంలో నామపత్రాలను పరిశీలించారు. -
నేటి నుంచి ఇంటింటికీ ఓటరు చీటీలు
[ 27-04-2024]
ఇంటింటికీ ఓటరు సమాచార చీటీల పంపిణీని శనివారం నుంచి నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. -
లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసులో సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్ల అరెస్టు
[ 27-04-2024]
చీటింగ్ కేసులో నిందితుడి వద్ద రూ.50 వేలు తీసుకుంటూ ఓ కానిస్టేబుల్ ఏసీబీకి పట్టుబడిన కేసులో సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. -
తపాలా బ్యాలెట్ దరఖాస్తుకు గడువు పెంపు
[ 27-04-2024]
తపాలా బ్యాలెట్ కోసం ఫారం-12 సమర్పించేందుకు మే 1 వరకు గడువును పొడిగిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం