జగన్ను సాగనంపేందుకు జనం సిద్ధం
అరాచక పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.
ఆటో ప్రయాణికులతో మాట్లాడుతున్న రఘురామ
పాలకోడేరు, న్యూస్టుడే: అరాచక పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. పాలకోడేరు మండలం గొల్లలకోడేరు, గరగపర్రు, మైప, కోరుకొల్లు, మోగల్లు గ్రామాల్లో ఆయన గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే మంతెన రామరాజు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి జుత్తిగ నాగరాజుతో కలిసి ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మౌలిక సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు. తెదేపా, జనసేన మండల అధ్యక్షులు కోటేశ్వరరాజు, గాదం నానాజీ, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
పాలకోడేరు, న్యూస్టుడే: చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని మాజీ ఎంపీపీలు పాలా చలపతి, వీరవల్లి వెంకటలక్ష్మి తెలిపారు. మైప గ్రామంలో తెలుగుయువత, ఐ టీడీపీ ఆధ్వర్యంలో ‘బాబును మళ్లీ రప్పిద్దాం’ నినాదంతో గురవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బాబు తొలి సంతకంతో మెగా డీఎస్సీ నిర్వహించి యువతకు ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!