logo

తెదేపాలో చేరిన పగిడాల దస్తగిరి

రానున్న ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి అన్నారు.

Published : 20 Apr 2024 04:08 IST

ప్రొద్దుటూరు వైద్యం, న్యూస్‌టుడే: రానున్న ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి అన్నారు. స్థానిక శ్రీనివాస్‌నగర్‌లోని దస్తగిరి నివాసంలో వరదరాజులురెడ్డి ఆయనకు తెదేపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. దస్తగిరి సొంత గూటికి చేరడం సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ముక్తియార్‌, కొత్తపల్లె సర్పించి కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, కౌన్సిలర్‌ మురళీధర్‌రెడ్డి, నాయకులు ఈవీ సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని