logo

అతివలే అధికం!

జిల్లా అధికార యంత్రాంగం ఓటర్ల తుది జాబితా ప్రచురించింది. నాలుగు నెలల్లోనే 22 వేల మందికిపైగా ఓటర్లు పెరిగారు.  మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 16,16,509 మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 22,557 మంది కొత్తగా నమోదైనవారితో కలిపి 16,39,066గా నమోదైంది.

Published : 29 Apr 2024 03:58 IST

జిల్లాలో మొత్తం ఓటర్లు 16,39,066

అట్లూరులో వరసలో ఓటర్లు (పాతచిత్రం)

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: జిల్లా అధికార యంత్రాంగం ఓటర్ల తుది జాబితా ప్రచురించింది. నాలుగు నెలల్లోనే 22 వేల మందికిపైగా ఓటర్లు పెరిగారు.  మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 16,16,509 మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 22,557 మంది కొత్తగా నమోదైనవారితో కలిపి 16,39,066గా నమోదైంది. ఈ ఏడాది జనవరి 22న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం ఓటర్లు మొత్తం ఓటర్లు 16,16,509 మంది ఉండగా, వీరిలో 7,91,108 మంది పురుషులు ఉండగా, 8,25,177 మంది మహిళలు, ఇతరులు 224 మంది ఉన్నారు. తాజాగా వెల్లడించిన తుది జాబితా ప్రకారం ఆ సంఖ్య 16,39,066కి చేరింది. వీరిలో పురుషులు 8,00,857 మంది, మహిళలు 8,37,993 మంది, ఇతరులు 216 మంది ఉన్నారు. ఇందులో పురుషుల కంటే మహిళలే అత్యధికంగా నమోదయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని