తెదేపాలో భారీగా చేరికలు
మైదుకూరు మండలం టి.కొత్తపల్లెకు చెందిన వైకాపా నాయకులు మంగళవారం ప్రొద్దుటూరులోని పార్టీ కార్యాలయంలో కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో తెదేపాలో చేరారు.
మైదుకూరు, పోరుమామిళ్ల, ప్రొద్దుటూరు వైద్యం, ఖాజీపేట, న్యూస్టుడే : మైదుకూరు మండలం టి.కొత్తపల్లెకు చెందిన వైకాపా నాయకులు మంగళవారం ప్రొద్దుటూరులోని పార్టీ కార్యాలయంలో కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో తెదేపాలో చేరారు. పురపాలకలోని గడ్డంవారిపల్లె వైకాపా నాయకులు తెదేపాలో చేరారు. పోరుమామిళ్ల మండలంలోని ఈదులపల్లెలో 20 కుటుంబాలు తెదేపాలో చేరారు. మండల తెదేపా అధ్యక్షుడు నగిరి బైరవప్రసాదు వీరికి పార్టి కండువాలు వేసి పార్టీలో ఆహ్వానించారు. కూటమి అభ్యర్థి బొజ్జా రోశన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం బోర్డు మాజీ సభ్యుడు సీతా వెంకటసుబ్బయ్య, తెదేపా నాయకులు తోట జనార్దన్, బ్రహ్మయ్య, వెంకటయ్య, సత్యరాజ్, రఘురామిరెడ్డి, శంకర్రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రొద్దుటూరులో ఖచ్చితంగా తెదేపా జెండా ఎగురవేసి తీరుతామని, ప్రజలంతా తెదేపాకే మద్దతు తెలుపుతున్నారని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి అన్నారు. స్థానిక తన కార్యాలయం వద్ద స్థానిక 9వ వార్డుకు చెందిన వంద మంది యువకులు తెదేపాలో చేరారు. వారందరికీ వరదరాజులరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి రోజూ పార్టీలో చేరికలు జరుగుతున్నాయని, ప్రజలంతా తెదేపా గెలుపులో భాగస్వామ్యం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఏసేబు, రామిరెడ్డి, సునీల్, చింటూ, ప్రేమ్, రామయ్య, ఇమాంమ్బాషా, రాజశేఖర్, నరేష్, శ్రీనివాసులు, మునిస్వామి, సునీల్వర్మ, ప్రశాంత్కుమార్, శ్రవణ్, చరణ్తో పాటు వంద మంది కండువా కప్పుకొన్నారు. ఖాజీపేట మండలంలో తెదేపాలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం మండల పరిధిలోని నాగసానిపల్లె, పత్తూరులో వైకాపాకు చెందిన 50 కుటుంబాలు తెదేపాలో చేరాయి. మైదుకూరు నియోజకవర్గ ఎన్డీయే అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో ఇరు గ్రామాలకు చెందిన సిద్ధం సూరయ్య, సుబ్బరాయుడు, బాలినేని పెద్దహుస్సేన్, దాసరి వెంకటేష్, తెదేపాలో చేరారు.
మైలవరం, న్యూస్టుడే: తెదేపా అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని మాజీ ఎమ్మెల్సీ చదిపిరాళ్ల నారాయణరెడ్డి అన్నారు. మంగవారం మండల పరిధిలోని దొమ్మరనంద్యాల గ్రామానికి చెందిన యనమల ప్రతాప్రెడ్డి ఆధ్వర్యంలో 20 కుటుంబాలు తెదేపాలో చేరాయి. వీరికి ఆయన పార్టీ కండవాలు వేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ముద్దనూరు న్యూస్టుడే: ముద్దనూరు టౌనుకు చెందిన సీనియర్ నాయకుడు అల్లిషెర్ మంగళవారం రాత్రి ఎన్డీఏ తీర్థం పుచ్చుకున్నారు. కొండాపురం టౌనుకు సంబదించిన 200 కుటుంబాలకు భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి సమక్షంలో వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి భూపేష్రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాయ్ రాజా కాయ్!
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. వచ్చే నెల 4న అభ్యర్థుల భవితవ్యం వెల్లడి కానుంది. విజయం ఎవరిని వరిస్తుందనే చర్చ సర్వత్రా నడుస్తోంది. మరో వైపు గెలుపు ఓటములపై బెట్టింగ్ జోరుగా జరుగుతోంది. -
బ్రహ్మరథంపై వీరబ్రహ్మేంద్రస్వామి దివ్యదర్శనం
[ 19-05-2024]
శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజా మహోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన మహాబ్రహ్మ రథోత్సవం శనివారం సాయంత్రం బ్రహ్మంగారిమఠంలోని మాడ వీధుల్లో నేత్రపర్వంగా సాగింది. -
వంగిపోయారా? లొంగిపోయారా?
[ 19-05-2024]
ఎన్నికల పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణిస్తున్న తరుణంలో ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ తమ శాఖ ప్రక్షాళనపై దృష్టి సారించారు. ఎన్నికల సంఘం దృష్టి సారించక ముందే బాధ్యులపై చర్యలకు కసరత్తు ప్రారంభించారు. -
భూసార పరీక్షలపై శీతకన్ను!
[ 19-05-2024]
వేసవిలో భూసార పరీక్షలను యజ్ఞంలా చేయాలనే మాటను అపద్ధర్మ ప్రభుత్వం విస్మరించింది. పూర్తిగా శీతకన్ను వేసింది. గతేడాది మట్టి నమూనాలను సేకరించారు. యంత్ర సామగ్రి, రసాయనాల కొనుగోలు చేయడానికి నిధులివ్వకపోవడంతో విశ్లేషణ చేయకుండా పక్కన పెట్టేశారు. -
నిలిచిన ఇసుక తవ్వకాలు
[ 19-05-2024]
అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. ప్రొద్దుటూరు పరిసరాల్లో మాత్రం వైకాపా కీలక నేతలు తవ్వకాలు కొనసాగిస్తుండగా అధికారులు పట్టించుకోవడంలేదు. -
గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే బాధితులకు అందని పరిహారం
[ 19-05-2024]
తమకు పరిహారం అందకపోవడంతో బెంగళూరు-విజయవాడ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పనులను అడ్డుకుంటామని బాధిత రైతులు హెచ్చరించారు. -
సుప్రీంకోర్టు ఉత్తర్వులు హర్షనీయం
[ 19-05-2024]
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై మాట్లాడ వద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులివ్వడం హర్షనీయమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా సెల్ విభాగం ఛైర్మన్ తులసిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
రూ.కోటి విలువైన ప్రభుత్వ భూమి కబ్జా
[ 19-05-2024]
సిద్దవటం మండలం టక్కోలు గ్రామ సచివాలయం సమీపంలో రూ.కోటి విలువైన ప్రభుత్వ భూమిని స్థానిక వైకాపా నేత కబ్జా చేసి రాత్రికిరాత్రే మామిడి మొక్కలు నాటారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ భూకబ్జా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
తెలంగాణ ఈఏపీసెట్లో మెరిసిన మదనపల్లె విద్యార్థిని
[ 19-05-2024]
లక్ష్యం, పట్టుదల ఉంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చునని నిరూపించింది మదనపల్లెకు చెందిన ప్రణీత. తెలంగాణ ఈఏపీసెట్లో అగ్రికల్చర్ ఫార్మశీ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచి ప్రశంసలు అందుకుంటోంది. -
ఆగడంలేదు... ఆపడంలేదు!
[ 19-05-2024]
మదనపల్లెలో వైకాపా నేతల అండదండలతో ఇసుకాసురులు ఇష్టారాజ్యంగా ఇసుక దందా సాగిస్తున్నారు. నదులు, వంకలు, చెరువుల్లో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు, రవాణా కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు