logo

తెదేపాలో భారీగా చేరికలు

మైదుకూరు మండలం టి.కొత్తపల్లెకు చెందిన వైకాపా నాయకులు మంగళవారం ప్రొద్దుటూరులోని పార్టీ కార్యాలయంలో కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ సమక్షంలో తెదేపాలో చేరారు.

Published : 08 May 2024 05:39 IST

మైదుకూరు, పోరుమామిళ్ల, ప్రొద్దుటూరు వైద్యం, ఖాజీపేట, న్యూస్‌టుడే : మైదుకూరు మండలం టి.కొత్తపల్లెకు చెందిన వైకాపా నాయకులు మంగళవారం ప్రొద్దుటూరులోని పార్టీ కార్యాలయంలో కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ సమక్షంలో తెదేపాలో చేరారు. పురపాలకలోని గడ్డంవారిపల్లె వైకాపా నాయకులు తెదేపాలో చేరారు. పోరుమామిళ్ల మండలంలోని ఈదులపల్లెలో 20 కుటుంబాలు తెదేపాలో చేరారు. మండల తెదేపా అధ్యక్షుడు నగిరి బైరవప్రసాదు వీరికి పార్టి కండువాలు వేసి పార్టీలో ఆహ్వానించారు. కూటమి అభ్యర్థి బొజ్జా రోశన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం బోర్డు మాజీ సభ్యుడు సీతా వెంకటసుబ్బయ్య, తెదేపా నాయకులు తోట జనార్దన్‌, బ్రహ్మయ్య, వెంకటయ్య, సత్యరాజ్‌, రఘురామిరెడ్డి, శంకర్‌రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రొద్దుటూరులో ఖచ్చితంగా తెదేపా జెండా ఎగురవేసి తీరుతామని, ప్రజలంతా తెదేపాకే మద్దతు తెలుపుతున్నారని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి అన్నారు. స్థానిక తన కార్యాలయం వద్ద స్థానిక 9వ వార్డుకు చెందిన వంద మంది యువకులు తెదేపాలో చేరారు. వారందరికీ వరదరాజులరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి రోజూ పార్టీలో చేరికలు జరుగుతున్నాయని, ప్రజలంతా తెదేపా గెలుపులో భాగస్వామ్యం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఏసేబు, రామిరెడ్డి, సునీల్‌, చింటూ, ప్రేమ్‌, రామయ్య, ఇమాంమ్‌బాషా, రాజశేఖర్‌, నరేష్‌, శ్రీనివాసులు, మునిస్వామి, సునీల్‌వర్మ, ప్రశాంత్‌కుమార్‌, శ్రవణ్‌, చరణ్‌తో పాటు వంద మంది కండువా కప్పుకొన్నారు.  ఖాజీపేట మండలంలో తెదేపాలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం మండల పరిధిలోని నాగసానిపల్లె, పత్తూరులో వైకాపాకు చెందిన 50 కుటుంబాలు తెదేపాలో చేరాయి. మైదుకూరు నియోజకవర్గ ఎన్డీయే అభ్యర్థి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ సమక్షంలో ఇరు గ్రామాలకు చెందిన సిద్ధం సూరయ్య, సుబ్బరాయుడు, బాలినేని పెద్దహుస్సేన్‌, దాసరి వెంకటేష్‌, తెదేపాలో చేరారు.


మైలవరం, న్యూస్‌టుడే: తెదేపా అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని మాజీ ఎమ్మెల్సీ చదిపిరాళ్ల నారాయణరెడ్డి అన్నారు. మంగవారం మండల పరిధిలోని దొమ్మరనంద్యాల గ్రామానికి చెందిన యనమల ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో 20 కుటుంబాలు తెదేపాలో చేరాయి. వీరికి ఆయన పార్టీ కండవాలు వేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


ముద్దనూరు న్యూస్‌టుడే: ముద్దనూరు టౌనుకు చెందిన సీనియర్‌ నాయకుడు అల్లిషెర్‌ మంగళవారం రాత్రి ఎన్డీఏ తీర్థం పుచ్చుకున్నారు. కొండాపురం టౌనుకు సంబదించిన 200 కుటుంబాలకు భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి సమక్షంలో వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి భూపేష్‌రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని